యాదగిరి జల్ల/సంపతి రమేష్ మహారాజ్
ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి అంతేగాని స్వస్థత ప్రార్థనలతో రోగాలు నయం కావు. ఇలాంటి శాస్త్రీయతకు నిరూపణ కానీ అశాస్త్రీయ నమ్మకాలు, వీటి వల్ల జరిగే మేలు ఎంత వరకు నిజం అని ప్రశ్నించినప్పుడు సైన్స్ ముందు ఇసుమంత కూడా నిలబడలేవని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం వివిధ మతాలలో కూడా అనేక రూపాలలో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు విచ్చలవిడిగా వ్యాపింపజేస్తూ సామాన్య జనాన్ని అజ్ఞానులను చేస్తున్నారు. నేడు సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ అభివృద్ధి జాడలు అందక మాయగాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ఓ వ్యక్తి అనారోగ్యంతో అస్వస్థతకు గురైనా, చిన్న పిల్లలు ఏడ్చినా, వాంతులు-విరేచనాలు అయినా, ఇతర అనారోగ్య సమస్యలు ఏం వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించకుండా బాబాలను, స్వాములను, సిగం ఊగే వాళ్లను, పాస్టర్లును ఆశ్రయించే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. వారు ఇచ్చే పసుపు, కుంకుమ, విభూది, నిమ్మకాయలు, కొబ్బరి కాయలను తీసుకొచ్చి రాత్రిపూట ఆదివారం, గురువారం, అమావాస్య రోజంటూ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పదిమంది కలియదిరిగే నడివీధుల్లో పెట్టి వారి రోగాలకు సాంత్వనగా భావిస్తున్నారు. పల్లెల్లో విజృంభించిన వ్యాధులకు కారణం గ్రామ దేవత అని, గ్రామదేవతను శాంతింపచేయాలని జంతుబలులు, నరబలులు చేయడం లాంటి సంఘటనలు కూడా అక్కడక్కడ చూస్తూనే ఉన్నాము. కానీ వీటివల్ల వారి ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సాంత్వన జరగకుండా చివరికి ప్రాణాల మీదికి కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను అజ్ఞానులతోపాటు విజ్ఞానులు కూడా పాటించడం విచారించదగ్గ విషయం.
ప్రాచీన కాలంతో పోలిస్తే మానవుడు మేధస్సు పరంగా ఎంతో ఎదిగాడు. ఇలా ఎదగడానికి ప్రధాన కారణం అతని పట్టుదలే. ఒకే పనిని పలుమార్లు చేయడం మూలాన ఆ పనిని సులువుగా చేయడం నేర్చుకున్నాడు. ఆ క్రమంలో అతను ఏర్పరచుకున్న నియమాలనే సైన్సు అని చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఆ క్రమపద్ధతిలో తాను నడుచుకోకపోతే అతని జీవితం అస్తవ్యస్తంగా ఉండేది. అలా మేధస్సును చక్కగా ఉపయోగించుకున్నందుకే మనిషి ఇప్పటికి ఎన్నో కనిపెట్టాడు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొని ప్రపంచానికి వెలుగులు పంచాడు. అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోన్ కనుగొని సుదూర ప్రాంతాల్లో ఉన్నవారితో కూడా క్షణాల్లో మాట్లాడే సౌలభ్యం కల్పించాడు. చార్లెస్ బాబేజ్ కంప్యుటర్ను ఆవిష్కరించి సాంకేతిక విప్లవానికి నాంది పలికాడు. ఇలా ఎన్నో విజయాలు మానవుడు తనకు తానుగా సాధించాడు. కాబట్టి ప్రశ్నకు సమాధానం పరిశోధనే అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇలా శాస్త్రీయ మార్గంలో పయనిస్తేనే మనవ జీవితం పరిపూర్ణమౌతుంది.
సమాజంలో ఒకవర్గం ఇంకో వర్గాన్ని కించపరుస్తూ, హీనంగా చూడటం, ఘర్షణలకు కేంద్ర బిందువు కావడం మత ఫలితమే అనేది ఎన్నో సార్లు తేలిన సత్యం. సమాజంలో మతాల ప్రభావం మనుషులపై చాలా ఉన్నది. కాబట్టే అమాయకులు మతాల వలన నలిగిపోతున్నారు. దీని ప్రభావం ఎంత ఉందంటే చివరికి సాటి మనిషిని మత విశ్వాసాలకోసం దాడులు, హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. సామాజికంగా ప్రజలు కోరిన నాయకులను ఎన్నుకుని తమ స్థితిగతులలో మార్పు తెచ్చుకునేందుకు అంబేద్కర్ మహాశయుడు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు. కాని అది కూడా నేడు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవటం లేదని చెప్పవచ్చు. కారణం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల గుణగణాలను, ఇచ్చిన హామీలను చూడకుండా ఓటరు కుల, మత ప్రభావానికి లోనై ఓటు వేసే పరిస్థితి మనం చూస్తున్నాం.
మూఢనమ్మకాలే శాస్త్ర ప్రగతికి అవరోధం
కలియుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మానవుడు ఎంతగానో వైజ్ఞానిక అభివృద్ధి సాధించి విశ్వ రహస్యాలను ఛేదిస్తూ విశ్వ మానవుడుగా ఎదుగుతున్న క్రమంలో మూఢనమ్మకాలు అనే అశాస్త్రీయ నమ్మకాలు సమాజాన్ని వెనక్కు నెట్టడం విచారకరం. మానవుడు వైజ్ఞానిక ప్రగతి ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటూ మానవాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ వైజ్ఞానిక ప్రగతి పైపు పరిగెడుతున్నాడు. కానీ ప్రస్తుత సమాజంలో మూఢనమ్మకాలు అనేక రూపాలలో విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాలలో బాబాలు, స్వాములు, మంత్రగాళ్ల పేరుతో కొందరు వ్యక్తులు విభిన్నమైన వేషధారణతో ప్రజల్లోకి వచ్చి తమ దగ్గర మహిమలు, మాయలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని మాయ మాటలు చెబుతూ ''మీ ఇంటిపై, ఒంటిపై ఉన్న శక్తులను నాశనం చేసే శక్తి మాకు ఉన్నద'ని సామాన్య జనాన్ని బురిడీ కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు. అదేవిధంగా పాస్టర్లు స్వస్థత కూటముల పేరుతో కండ్లు లేని వారికి కండ్లు, కాళ్లు లేనివారికి కాళ్లు ప్రార్థన ద్వారా బాగు చేస్తామని ప్రజానీకానికి మాయ మాటలు చెపి మూఢవిశ్వాసాల వైపు తీసుకెళ్తున్నారు. ఇటీవల కల్వరి చర్చి ఫాదర్ల మూఢత్వానికి అన్యాయంగా ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. శాస్త్రీయమైన ఆలోచన విధానంతో ఇతర దేశాలు ముందుకు వెళ్తుంటే.... మనదేశంలో మాత్రం ఇలాంటి మూఢ నమ్మకాలద్వారా మనుషుల్ని చంపుకుంటున్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి అంతేగాని స్వస్థత ప్రార్థనలతో రోగాలు నయం కావు. ఇలాంటి శాస్త్రీయతకు నిరూపణ కానీ అశాస్త్రీయ నమ్మకాలు, వీటి వల్ల జరిగే మేలు ఎంత వరకు నిజం అని ప్రశ్నించినప్పుడు సైన్స్ ముందు ఇసుమంత కూడా నిలబడలేవని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం వివిధ మతాలలో కూడా అనేక రూపాలలో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు విచ్చలవిడిగా వ్యాపింపజేస్తూ సామాన్య జనాన్ని అజ్ఞానులను చేస్తున్నారు. నేడు సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ అభివృద్ధి జాడలు అందక మాయగాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ఓ వ్యక్తి అనారోగ్యంతో అస్వస్థతకు గురైనా, చిన్న పిల్లలు ఏడ్చినా, వాంతులు-విరేచనాలు అయినా, ఇతర అనారోగ్య సమస్యలు ఏం వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించకుండా బాబాలను, స్వాములను, సిగమూగే వాళ్లను, పాస్టర్లును ఆశ్రయించే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. వారు ఇచ్చే పసుపు, కుంకుమ, విభూది, నిమ్మకాయలు, కొబ్బరి కాయలను తీసుకొచ్చి రాత్రిపూట ఆదివారం, గురువారం, అమావాస్య రోజంటూ ప్రజలు పదిమంది కలియదిరిగే నడివీధుల్లో పెట్టి వారి రోగాలకు సాంత్వనగా భావిస్తున్నారు. పల్లెల్లో విజృంభిం చిన వ్యాధులకు కారణం గ్రామ దేవత అని, గ్రామదేవతను శాంతింప చేయాలని జంతుబలులు, నరబలులు చేయడం లాంటి సంఘటనలు కూడా అక్కడక్కడ చూస్తూనే ఉన్నాము. కానీ వీటివల్ల వారి ఆరోగ్య సమస్యలకు ఎలాంటి సాంత్వన జరగకుండా చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను అజ్ఞానులతోపాటు విజ్ఞానులు కూడా పాటించడం విచారించదగ్గ విషయం.
నేడు ఎంతో వైజ్ఞానిక అభివృద్ధి జరిగి ప్రజల సామాజిక, ఆర్థిక జీవితాలలో కొంతమేరకైనా మార్పు జరిగినప్పటికీ ప్రజలు అనేక అంధ విశ్వాసాలను నమ్మడం విచారకరం. ముఖ్యంగా పిల్లి లేదా పాములు ఎదురైనా, ఎవరైనా తుమ్మినా అపశకునంగా భావించడం లాంటి సంఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనబడతాయి. మానవ శ్రమతో ముడిపడిన చదువు, వ్యాపార ప్రగతి ఆడ, మగ కలయికతో పుట్టిన పిల్లలకు కూడా అతీంద్రియ శక్తులే కారణమని ఆపాదించడం, ఇస్రో శాస్త్రవేత్తల్లో రాకెట్ ప్రయోగానికి ముందు రాకెట్ ప్రతిమలు దేవుని ముందు పెట్టడం లాంటి అంశాలు మానవ శాస్త్ర ప్రగతిని, శ్రమను, మేధస్సును తక్కువ చేయడమే. ప్రస్తుతం సమాజంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు రోజురోజుకు వెళ్లానుకుపోతుండటం మానవ ప్రగతికి పెద్ద అవరోధంగా భావించవచ్చు. నేడు మూఢనమ్మకాలు సామాజిక, ఆర్థిక, రాజకీయాలను అనేక రూపాలలో ప్రభావితం చేస్తూ శాస్త్ర ప్రగతికి అవరోధంగా మారి ప్రజల్ని అంధ విశ్వాసాల వైపు తీసుకెళ్తున్నాయి.
గ్రామీణ ప్రాంత ప్రజలు డాక్టర్లు ఇచ్చే మందులకన్నా చెప్పే సలహాలకన్నా బాబాలు, స్వాములు వంటి మాయగాళ్లను ఎక్కువ నమ్మడం చాలా విషాదకరమైన విషయం. నిజంగా వీరి మాయలకు, మహిమలకు అతీత శక్తులున్నాయా అంటే ఏమీ ఉండవు. వీరు చేసే ప్రతి మహిమలు, మాయల వెనుక ఏదో ఒక సైన్స్ ట్రిక్ మాత్రమే దాగి ఉండి హస్తలాఘవం ద్వారా మాయగా, మంత్రంగా సామాన్య జనానికి చూపిస్తూ వారిని మోసం చేస్తూ వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కొందరిని మంత్రగాళ్లనే నెపంతో అతి కిరాతకంగా కాల్చి చంపడం లాంటి సంఘటనలు కూడా కొనసాగుతున్నాయి. తద్వారా ఈ మూఢ నమ్మకాలు సామాజిక సమస్యగా మారుతున్నాయి. మూఢనమ్మకాలు తల్లిదండ్రుల ద్వారా పిల్లలు కూడా వాటిని నమ్ముతూ పాటిస్తున్నారు. తద్వారా భవిష్యత్ సమాజం అంధకారం వైపు వెళ్తోంది. కావున మూఢనమ్మకాల నిర్మూలన అనేది చాలా ప్రాధాన్యమైన అంశంగా నేడు ప్రభుత్వాలు గమనించవలసిన అవసరం ఉంది. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వైజ్ఞానిక అలవాట్లను పెంపొందించడానికి పాఠశాల స్థాయి నుండే పునాది పడాల్సిన అవసరముంది. సమకాలీన సమాజంలో మతాలను గౌరవిస్తూ వివిధ మతాలలో ఉన్న మూఢనమ్మకాలను, అంధ విశ్వాసాలను తొలగించడానికి ప్రభుత్వం, ప్రజా సైన్స్ సంస్థలు నిరంతరం కృషి చేయాలి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అనేక ప్రజా సైన్స్ ఉద్యమాలు పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో కొనసాగుతున్నాయి, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా ''జన విజ్ఞాన వేదిక'' నిరంతరం వివిధ ప్రదర్శన కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తూ వైజ్ఞానిక సమాజం వైపు తీసుకు వెళ్లడానికి కృషి చేస్తున్నది. ప్రభుత్వం కూడా మూఢనమ్మకాల నిర్మూలనకు పటిష్టమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి. వీలైనంత వరకు శాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. మనిషి కోసం మతమా లేక మతం కోసం మనిషా, అనేది ఎవరికివారు పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
సెల్ : 6303141210
9958556367
Authorization