వాసిలి సురేష్
1902 జూలైలో ఉద్యోగాలలో బలహీన వర్గాలకు 50 శాతం అవకాశం కల్పిస్తూ సాహూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సామాజిక ఉద్యమాల చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన సందర్భం. ఆస్థానంలో దళితుల్ని గుర్రాలను సాకే వారీగా, మావటి వాళ్లుగా ఇంకా ఇతర ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. సాహు వ్యక్తిగత సిబ్బందిగా, చివరికి రాజమహల్ వంటశాలలో సైతం దళితులని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. సాహు దళితులను ఎప్పుడూ తన పక్కనే ఉంచుకునేవారు. వారి చేతుల మీదుగానే తినేవారు, తాగేవారు. ఛాందసులకి ఎంత గుండె మంట ఉన్నా రాజుగారు కాబట్టి ఎవరూ నోరెత్తలేక పోయేవారు. విందుల్లో, సభల్లో దళితులని రాజుగారు తన సరసనే కూర్చోబెట్టుకునే వారు. సభల్లో ప్రజలందరి ముందు 'టీ' సైతం ఉద్దేశపూర్వకంగానే దళితుల చేతుల మీదుగానే తెప్పించుకుని తాగేవారు. రాజుగారు అతిథులకి, పెద్దపెద్ద వాళ్లకి ఇచ్చే విందుల్లో సైతం దళితులు వడ్డనలో ఉండేవారు. ఛాందసులు మింగలేక, కక్కలేక అవస్థ పడేవారు. ఎవరూ వంక పెట్టడానికి వీల్లేకుండా దళితులు, పరిశుభ్రత పాటించేలా శిక్షణ ఇప్పించి, అమలు చేసేవారు. రాజ్యంలో నలుమూలలా పర్యటించేటప్పుడు, వేటకు వెళ్లే సందర్భంలో కూడా తన మందీమార్బలంతో మహారాజు మహర్ల ఇండ్ల దగ్గర ఆగేవారు. అందరూ చూస్తుండగా ఛత్రపతి దళితుల చేతుల మీదుగా నీళ్లు తెప్పించుకుని తాగేవారు.
సాహూ అసలు పేరు యశ్వంతరావు. ఈయన 1874 జూన్ 26న జన్మించారు. ఆయన రాజవంశీకుడు కాదు. కుంబీ కులానికి చెందిన మరాఠా. యశ్వంతరావును రాణీ ఆనందబాయి దత్తత తీసుకోవడంతో ''సాహూ మహారాజ్'' అయ్యాడు. 20ఏండ్ల వయసులో కొల్హాపూర్ సంస్థానానికి రాజయ్యారు. ఫూలే తర్వాత ఉద్యమాన్ని అంత సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడు ఛత్రపతి సాహూ మహరాజ్. ఆయన 1894 నుండి 1922 దాకా, మొత్తం 28 ఏండ్లపాటు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించాడు. దళిత, బహుజనులను అగ్రవర్ణాల పెత్తనం నుండి విముక్తి చెయ్యటానికి సైద్ధాంతికంగాను, పాలనాపరంగాను తీవ్ర కృషి చేశాడు. అట్టడుగు కులాలు, వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఆర్థిక, విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలన్నింటిలోనూ విప్లవాత్మకమైన చట్టాలను రూపొందించింది సాహూ ప్రభుత్వం. వెనకబడిన కులాల ప్రజలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో 50శాతం రిజర్వేషన్లను అమలు చేసిన మొట్టమొదటి పాలకుడు అతను. అగ్రవర్ణ పెత్తందారుల ఆధిపత్యంలో మగ్గుతూ ఉండిన మహారాష్ట్ర నుండి తర్వాత కాలంలో దళిత నాయకులు, మేధావులూ ముందుకు రావటం వెనక సాహూ చేసిన కృషి ఎంతో ఉంది. పంచగంగా ఘాట్ దగ్గర తనకు జరిగిన అమానంతోనే వివక్షను ప్రశ్నించడటం మొదలుపెట్టారు. కుల అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే అసమానతల కుల వ్యవస్థను దెబ్బ తీయాలని నిర్ణయానికి వచ్చి, స్వల్ప కాలంలోనే అణగారిన కులాల అభ్యున్నతికి అవసరమైన ఎన్నో పథకాలను అమలు చేశారు. 1902 జూలైలో ఉద్యోగాలలో బలహీన వర్గాలకు 50 శాతం అవకాశం కల్పిస్తూ సాహూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సామాజిక ఉద్యమాల చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన సందర్భం. దళితుల్ని ఆస్థానంలో గుర్రాలను సాకే వారీగా, మావటి వాళ్లుగా ఇంకా ఇతర ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. సాహు వ్యక్తిగత సిబ్బందిగా, చివరికి రాజమహల్ వంటశాలలో సైతం దళితులని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. సాహు దళితులను ఎప్పుడూ తన పక్కనే ఉంచుకునేవారు. వారి చేతుల మీదుగానే తినేవారు, తాగేవారు. ఛాందసులకి ఎంత గుండె మంట ఉన్నా రాజుగారు కాబట్టి ఎవరూ నోరెత్తలేక పోయేవారు. విందుల్లో, సభల్లో దళితులని రాజుగారు తన సరసనే కూర్చోబెట్టుకునే వారు. సభల్లో ప్రజలందరి ముందు 'టీ' సైతం ఉద్దేశపూర్వకంగానే దళితుల చేతుల మీదుగానే తెప్పించుకుని తాగేవారు. రాజుగారు అతిథులకి, పెద్దపెద్ద వాళ్లకి ఇచ్చే విందుల్లో సైతం దళితులు వడ్డనలో ఉండేవారు. ఛాందసులు మింగలేక, కక్కలేక అవస్థ పడేవారు. ఎవరూ వంక పెట్టడానికి వీల్లేకుండా దళితులు, పరిశుభ్రత పాటించేలా శిక్షణ ఇప్పించి, అమలు చేసేవారు. రాజ్యంలో నలుమూలలా పర్యటించేటప్పుడు, వేటకు వెళ్లే సందర్భంలో కూడా తన మందీమార్బలంతో మహారాజు మహర్ల ఇండ్ల దగ్గర ఆగేవారు. అందరూ చూస్తుండగా ఛత్రపతి దళితుల చేతుల మీదుగా నీళ్లు తెప్పించుకుని తాగేవారు. తర్వాత తాను విశ్రమించాల్సిన బసకు వెళ్లే వారు. రాణిగారికి కూడా తన ఆదర్శాలను చెప్పి ఒప్పించారు సాహు మహారాజ్. అంత:పుర స్త్రీలకి హౌషా ఉండే రోజుల్లో రాణిగారి సమక్షంలో దళితులకి ప్రవేశం ఉండేది. ఇటువంటి సంగతులు ప్రజలని, సిబ్బందిని దిగ్భ్రాంతిలో ముంచేవి. చివరికి తన కుమార్తె వివాహ వేడుకల్లో సైతం సాహు అంటరాని వారితో కలిసి మెలిసి ఉన్నారు. గంగారామ్ కాంబ్లే అనే దళితుడికి సాయం చేసి, కొల్లాపూర్ ప్రధాన రహదారి మీద అతడి చేత హోటల్ తెరిపించారు. మహారాజా తన పరివారమంతటితో తరచుగా అక్కడ ఆగి టీ తెప్పించుకుని తాగేవారు. అగ్రకులాల వారి వలెనే దళితులకు సైతం ఆయుధాలు ధరించేందుకు అనుమతిచ్చారు. దళితుల్ని గ్రామాల్లో 'తలాతి'గా (పట్వారీలుగా) నియమించారు. చేతులు కట్టుకుని, గ్రామానికి బయట ఉండాల్సిన వారు ఈ చర్యతో ఊరి పెద్దలయ్యారు. కొల్లాపూర్ మునిసిపాలిటీలో అణగారిన కులాలకి కొన్ని సీట్లని కేటాయించారు. కాలక్రమేణా మునిసిపాలిటీకి ఒక చమార్ అధ్యక్షుడు కాగలిగారు. ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లలోను అస్పృశ్యుల్ని ఉద్యోగులుగా తీసుకోవాలని ఉత్తరువు ఇచ్చారు. ఇది నచ్చని వారు ఆరు వారాల్లోగా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్లి పోవాలని ఆందులో రాశారు. అలా వెళ్లేవారికి ఎటువంటి పెన్షన్ దక్కదని ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఇటువంటి ఉత్తర్వులు ప్రతీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. విద్యాశాఖలో ఇదే విధమైన ఉత్తర్వులిస్తూ, ఈ ఉత్తర్వులను పాటించని ఎయిడెడ్ సంస్థల ఎయిడ్ నిలిపి వేయబడుతుందని స్పష్టం చేశారు. వారికిచ్చిన ఆటస్థలం, భవనాలు, ఇతర చర, స్థిర ఆస్థులపైన భారీగా పన్ను వేస్తామని హెచ్చరించారు. ఒక ఉపాధ్యాయుడు ఎంత పని చేసి అలసిపోయినా, పాఠశాలలో ఎవరైనా దళిత విద్యార్థి ఏదైనా సందేహం అడిగితే అతడి సందేహాన్ని తీర్చి సాయపడాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాల్లో, కార్యాలయాల్లో ఉమ్మడి బావుల్లో, నదుల్లో అంటరానితనాన్ని భేదభావాన్ని పాటించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఏ ఊళ్లోనైనా ఈ ఉత్తర్వులు అమలు జరగకపోతే, గ్రామంలోని మున్సబు, కరణాలనే బాధ్యుల్ని చేస్తామని ఉత్తర్వులో తెలిపారు. వెట్టి చాకిరీని రద్దు చేశారు. ఏడాదికి ఒకసారి ఇచ్చే జీతాలని ఈనాములని రద్దు చేశారు. దళితులతో ఎవరూ ఒత్తిడి చేసి, నిర్బంధంగా పని చేయించుకోరాదని చెప్పారు. నేర తెగల వారు రోజూ పోలీసు కచేరీకి వచ్చి సంతకం చేయాల్సిన దుస్థితినుంచి సాహు తప్పించారు. హజరీ పద్ధతిని రద్దుపరిచారు. ఈ హజరి అమానుషమైనదని పేదల్ని అణచివేయడానికి అవకాశం కల్పిస్తున్నదని అన్నారు. తమకు కావలసిన వారు అనారోగ్యంతో చనిపోయినా హజరీ కారణంగా కడసారి చూపులకు కూడా కరువయ్యే పరిస్థితి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన కులాల వారి చేత నీచమైన పనులు దాస్యపు పనులు నిర్బంధంగా చేయించే హక్కు ఎవరికీ లేదని సాహు ఆదేశాలిచ్చారు. చచ్చిపోయిన జంతువుల దేహాల్ని తొలగించడం, చెత్త ఎత్తడం, పేడ తియ్యడం మొదలైన పనులు చేయాల్సి వచ్చినపుడు హిందువులు, ముసల్మానులు, బ్రాహ్మణులు, మహార్లు, మాంగులు, మరాఠాలు, జైనులు, లింగాయతులు వీళ్ల నుంచి ఎవరైనా పిలుచుకుని డబ్బులిచ్చి పని వెళ్లదీసుకోవాలి. 1908లో దళితుల్లో విద్యావ్యాప్తికి ఒక సొసైటీ స్థాపించారు. తన రాజ్యంలో ప్రాథమిక విద్యను ఉచితం, నిర్బంధం చేశారు. దళిత విద్యార్థుల కోసం మొదట కొల్హాపూర్లో 3 హాస్టళ్లు కట్టారు. పండగలకు, పబ్బాలకు ఈ హాస్టళ్లలో జరిగే కార్యక్రమాలకి రాజు స్వయంగా హాజరై దళితుల చేతి ప్రసాదం తినేవారు. అందువల్ల చూసేవారికి రాజుగారిని అనుసరించడం తప్ప వేరే దారి ఉండేది కాదు. వారు కూడా అంటరానితనాన్ని విడిచి, దళితుల చేతి ప్రసాదం తినాల్సి వచ్చేది. ఇతర శూద్ర విద్యార్థుల కోసం సైతం హాస్టళ్లు తెరిచారు. ఇటువంటి హాస్టళ్లు 20 వరకూ ఉన్నాయి. అణగారిన కులాల విద్యార్థులకు స్కాలర్షిప్పులిచ్చారు. స్కూలు ఫీజు రద్దు చేశారు. 1919లో దళితులకు ప్రత్యేకంగా కేటాయించిన స్కూళ్లని రద్దు చేసి, దళిత, అణగారిన విద్యార్థులకు విద్యాలయాల్ని తెరిపించారు. విద్యాలయాల్లో భేదభావం లేకుండా అంటరానితనం పాటించకుండా విద్యార్థులంతా కలిసి మెలిసి చదువుకోవాలని సాహు ఆశించారు.
రాజ్యమంతటా గ్రంథాలయాలను తెరిపించారు. కులాంతర వివాహాలను విరివిగా ప్రోత్సహించారు. దగ్గరుండి జరిపించారు. మొదట్లో ఫూలే సత్యశోధక్ సమాజ్ కార్యకలాపాలను కొల్లాపూర్లో వ్యాపించేందుకు కషి చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్కు వ్యక్తిగతంగా అనేక సందర్భాల్లో సహాయపడ్డారు. అంబేద్కర్తో కలిసి, అనేక నిమ్నవర్గాల సభల్లో ప్రసంగించారు. మూక్ నాయక్ పత్రికకు పలుమార్లు ఆర్ధిక సహాయం చేశారు. ఆత్మీయంగా అంబేద్కర్ కుటుంబం గురించి వాకబు చేసి ఇక్కడ స్వదేశంలో ఉన్న అంబేద్కర్ సతీమణి రమాబాయికి కూడా ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు సాహు. భారతదేశంలో సామాజిక ప్రజాస్వామ్యం కోసం పురోగమిస్తున్న మహోద్యమానికి మీరు ఆధార స్తంభం వంటి వారని అంబేద్కర్ సాహును ప్రశంసించారు. 'అస్పృశ్య' శబ్దం తన చెవిలో ఎర్రగా కాల్చిన కడ్డీలా గుచ్చుకుంటోందని, అందువలన దాని బదులు 'సోమ వంశీయ' అనే శబ్దం వాడాలని, లేదా పంచములని అనాలని కోరారు. 'అస్పృశ్య' శబ్దం వర్తింపచేసే వారిని, కోర్టుకి ఎందుకు ఈడ్వకూడదు? అని సాహు ప్రశ్నించారు. కింది కులాలు తమ కుల వృత్తులకు కట్టుబడరాదని, ఉన్నత వృత్తుల్ని, ఉద్యోగాలని చేపట్టాలని ఆకాంక్షించారు. సహస్రాబ్దాలుగా పీడిస్తున్న శాపం అంటరానితనం ఒకనాటికి పోతుందని, సాహు అన్నారు. 'మీరు మీ హక్కుల్ని పరిరక్షించుకోవడం నేర్చుకోవాలి' అని అణగారిన కులాలకి చెప్పారు. 'మీ సామాజిక హక్కులు ఆక్రమణకు గురైన సందర్భాలు ఎదరైనప్పుడల్లా మీరు దృఢంగా నిలబడి, మీ హక్కుల్ని రక్షించుకోవాలి. అయితే కొట్లాడే, ద్వేషించే స్ఫూర్తితో కాదు, ప్రేమ, వివేకం నిండిన స్ఫూర్తితో మీరు ఆ పని చేయాలి' అన్నారు సాహు. కుల నిర్మూలన ఆవశ్యకతని సాహు బలంగా నొక్కి చెప్పారు. ''నాయకులారా హ్రస్వదష్టి విడిచి పెట్టండి. భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. కులాల్ని మొత్తంగా రద్దు చేయడం అవసరం. కులాల్ని గొప్పచేయడం పాపం. మన అందరి ఉమ్మడి పురోభివృద్ధికి ఈ కులాలు ఆటంకం. అందువల్ల మన శక్తి అంతా కూడగట్టుకుని, ఏవిధంగానైనా ఈ కులాల్ని నిర్మూలించడం మన కర్తవ్యం'' అన్నారు సాహు. 'ఒక వేళ అణగారిన జనం సకాలంలో పురోగమించలేకపోతే, కులం అనే విసుర్రాయి కింద పడి వాళ్లు నలిగిపోతారని నేను భయపడుతున్నాను. అణగారిన కులాలను బలపర్చడమంటే, కుల విద్వేషాలను ప్రోత్సహించినట్టు కాదని దీన్ని బట్టి తెలియడం లేదా? మనుషుల్ని వారి పుట్టుకని బట్టి హీనులుగా పరిగణించే పద్ధతి మనలో అంతరించిపోయిన రోజు అదే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అవుతుంది' అని సాహు మహారాజ్ చెప్పారు. కులాన్ని నిర్మూలించే విషయంలో సాహుకి ఉన్న పట్టుదల, నిబద్ధత అభినందనీయం. అణగారిన కులాల ప్రజలు సదా స్మరించుకునే సాహు 1922లో 48ఏండ్ల చిన్నవయసులోనే అస్తమించారు.
సెల్ : 9494615360
Authorization