ఇటీవల వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో తొమ్మిది నెలల పసిపాపపై లైంగికదాడి సంఘటన తర్వాత చాలా మంది స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలూ ర్యాలీలు చేస్తూ ఆ ఘటనను సభ్యసమాజం తలదించుకునే చర్య అని ఖండించారు. అసలు పౌరసమాజమంతా సభ్యసమాజం తలదించుకునే చర్య అని ఎందుకంటున్నారు? నేరం చేసింది ఒకడైతే మొత్తం సమాజం ఎందుకు తలదించుకోవలసి వస్తుంది? ఎందుకంటే.. సమాజం మొత్తం కూడా తమకు తెలియకుండానే ఆ నేరం పట్ల బాధ్యత ఉందనీ సమాజంలోని వ్యక్తులు ఆ నేరంలో మాకు భాగం ఉందని పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. శ్రీహితపై జరిగిన అత్యాచారం కేవలం ఆ పసిపాపపై జరిగిన లైంగికదాడిగా గాక మొత్తం మానవ సమాజంపై జరిగిన లైంగికదాడిగా, భవిష్యత్ తరంపై జరిగిన అత్యాచారంగా చూడాల్సి ఉంటుంది.
వనపాకాల దిలీప్
వరంగల్లో జరిగిన ఈ సంఘటన విపరీతమైన మానసిక రుగ్మతలతో కూడిన వింత సెక్స్ ప్రవర్తన కలిగిన ప్రవీణ్ పసిపాపపై అత్యాచారం చేయడం వరకు రావడం వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఒక కారణమైతే ఇటువంటి ఆకతాయిల వేధింపులకు గురైన బాధిత మహిళలు బయటకు చెప్పకపోవడం వేధింపులను కూడా పరువు సమస్యగా భావించడం రెండో కారణం. పోలెపాక ప్రవీణ్కు గతంలో నేర చరిత్ర ఉందని చెబుతున్న పోలీసులు ప్రవీణ్పై ఫిర్యాదు అందిన ప్రతిసారీ వారి పద్ధతులలో మందలించి వదిలేశారు తప్ప అతనిని పూర్తిస్థా యిలో విచారణ చేసి అతనిపై నిఘా ఉంచలేదు. అంతేగాక గత ంలో ప్రవీణ్ నాలుగైదు సార్లు ఇట్లాచేస్తే పోలీసులకు అప్ప గించినా పోలీసులు తగు చర్య తీసుకోలేదని స్థానిక మహిళలు అంటున్నారు. సహజంగానే ఇలాంటి కేసులు నమోదైనప్పుడు పోలీసులు బాధితులతో మర్యాదగా ప్రవర్తించడం కూడా తక్కు వేనని అంటున్నారు. రెండవది పరువు సమస్య.. ఎవరైతే వేధిం పులకు గురి అవుతారో ఆ మహిళలు ధైర్యంగా వారికి జరిగిన అవమానాన్ని చెప్పుకోలేకపో వడం, ధైర్యంగా పోలీస్స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయకపోవడం, ఒకవేళ ఎవరైనా మహిళలు కొంచెం ధైర్యం చేసి పోలీసు కేసు పెడతామంటే కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం ఇవన్నీ అవసరమా? కుటుంబం పరువు పోతుందని కొందరంటే బాధిత మహిళలకు వ్యతిరేకంగా వారికి జరిగిన అవమానాన్ని చులకన చేసి, హేళనగా మాట్లాడే సమాజం మనది. ఇట్లా ఈ పరువు సమస్య వేధింపులకు పాల్పడే వ్యక్తులకు ఒక ఆయుధంగా మారింది. మహిళల పరువు పేరుతో వారి నోరు నొక్కేసి నేరస్తుల వికత చేష్టలు మరింత బలపడేలా పరోక్షంగా సహకరిస్తున్నది ఈ సమాజమే...
అయితే ఈ సంఘటనను పక్కన పెడితే మొత్తంగానే లైంగికదాడులు వయసుతో సంబంధం లేకుండా పసిగుడ్డు నుండి మొదలు ముసలివాళ్ల దాకా కొనసాగుతున్నాయి. కొన్నిసార్లు హత్య చేయబడుతు న్నారు. మహిళలపై దాడులు, లైంగికదాడులు నిత్యకత్యమవుతున్నాయి. గత జనవరిలో జమ్మూకాశ్మీర్లో ఆసిఫాపై మొదలు ఫిబ్రవరిలో హన్మకొండ పట్టణంలో రవళిపై పెట్రోల్ దాడి, నల్గొండ జిల్లా హాజీపూర్లో మర్రి శ్రీనివాస్రెడ్డి సీరియల్ లైంగికదాడులు, హత్యలు, శ్రీహితపై లైంగికదాడి, హత్య ఇది మరువకముందే నేరేడ్మెట్లో ఐదేండ్ల సొంత కూతురిపై తండ్రి లైంగికదాడి, జగద్గిరిగుట్టలో 55 ఏండ్ల వ్యక్తి ఆరేండ్ల బాలికపై అత్యాచారయత్నం ఇది మరువకముందే ఆంధ్రాలో ఓ బాలికపై ఆరుగురు వ్యక్తుల లైంగికదాడి ఇట్లా చెప్పుకుంటూ పోతే బయటి ప్రపంచానికి తెలియని ఇంకా ఎన్నో సంఘటనలు సమాజంలో నిత్యం జరుగు తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వ్యక్తుల మానసిక స్థితికంటే సమా జంలో స్తిరీకతమైన సామాజిక, సాంస్కతిక, సాంప్రదాయిక విలువల పేరుతో పేరుకుపోయిన సామాజిక రుగ్మతలు కారణం కావచ్చు. ఇలాంటి మానసి క రుగ్మతలతో, మానసిక వైకల్యంతో కూడిన నేరస్తులను మినహాయిస్తే సమాజంలోని సగటు మనిషి జీవన విధానం ఆలోచనలలోనే మానసిక వైకల్యం ఉంది. అయితే మొత్తంగా సమాజంలో ప్రేమ పేరుతో మహిళలపై దాడులు, లైంగికదాడులు తరచుగా ఎందుకు జరుగుతున్నా యి? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానంగా స్త్రీని సొంత ఆస్తిగా చూడటం, భోగ లేదా అనుభవ వస్తువుగా చూడటం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో పురుషుడు తాను ప్రేమించిన స్త్రీ తనకు దక్కదని భావించినప్పుడు తన పురుష అహంకారంతో ఆ ప్రేమించిన స్త్రీని తోటి మనిషిగా చూడకుండా ఒక ఆస్తిగా భావించి తనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదనే ఆధిపత్య భావజాల ప్రభావం చేత దాడులు జరుగుతున్నాయి. ఆ స్త్రీ కూడా మనిషేననీ తన జీవితాన్ని నిర్ణయించుకునే అధికారం ఆ స్త్రీకి ఉందని గుర్తించలేని పురుషాధిపత్య సమాజం వల్ల జరుగుతున్నవి.
ఇక అత్యాచారాల విషయానికి వచ్చేసరికి స్త్రీ ఒక భోగ లేదా అనుభవైక వస్తువుగా చూసే సమాజపు విలువల వల్ల జరుగుతున్నవి. సినిమాలలో హీరోలు నిండైన దుస్తులతో ఉంటే వారి పక్కన పొట్టి దుస్తులతో అర్ధనగంగా హీరోయిన్లు ఉంటే ఆ సినిమాలకు కుటుంబ సమేతంగా వెళ్లి వారి అర్ధనగ ప్రదర్శనను వినోదంగా భావించి ఆస్వాదించే ఆమోద పు సంస్కృతి సమాజంలో ఉంది. స్త్రీలకు సంబంధిం చిన సౌందర్య ఉత్పత్తి సాధనాలకు స్త్రీలతో ప్రకటనలు ఇప్పిస్తే సరే అనుకోవచ్చునెమో కానీ పురుషులకు సంబంధించిన సౌందర్య ఉత్పత్తి సాధనాలకు సైతం అర్ధనగంగా స్త్రీలతో ప్రకటనలు ఇస్తే తేరగా కండ్లప్ప గించి చూస్తున్నామే తప్ప.. అరే.. హీరో నిండుగా బట్టలు వేసుకున్నప్పుడు ఆ హీరోయిన్కి మాత్రం పొట్టి దుస్తులు ఎందుకు వేశారు? సౌందర్యసాధనాల ఉత్పత్తులకు స్త్రీలతో ప్రకటనలు ఇచ్చుకుంటే ఇచ్చుకోవ చ్చు గానీ అర్ధనగంగా ఇవ్వాల్సిన అవసరం ఏముం ది? అనే ప్రశ్న మన మెదళ్లలోకి రాకుండా ఆ స్త్రీలను, వారి అవయవాల ప్రదర్శనని వినోదంగా అంగీకరిస్తు న్నది అంటే మన సమాజం ఏ సంస్కృతి అంగీకరిస్తుం దో, ఆమోదిస్తున్నదో, ఆచరిస్తున్నదో ఆలోచించుకోవా లి. మన సంస్కృతి పరాయి స్త్రీల దేహాలను అర్ధనగం గా నేరుగా పరదా మీద, పరదాల వెనుక చాటుగా చూడటానికి ఆమోదం తెలుపుతుంది ఇట్లా పరాయి స్త్రీల దేహాల్ని వినోద వస్తువుగా అనుభవ వస్తువుగా చూసే సంస్కృతికి ఆమోదం ఈ సమాజంలో ఉంది కాబట్టే అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే కొన్ని ప్రత్యేక సందర్భాల లో మినహాయిస్తే.. అత్యాచారాలన్నీ సొంత కుటుంబీకుల పై కాకుండా పరాయి స్త్రీల మీద జరుగుతాయి ఎందుకు? తమ కుటుంబీకులను చూసినప్పుడు కలగని కోరికలు లేదా కోరికలను అదుపు చేసుకోగలిగినప్పుడు పరాయి స్త్రీలను చూడగానే తమ కోరికలు తీర్చుకోవ డానికి వికృతంగా ప్రవర్తించడానికి ప్రధాన కారణం ఏమిటి? మన కుటుంబంలోని మహిళలు పొట్టి దుస్తులు వేసుకుంటే ఊరుకోని, మనం మన కుటుంబంలోని స్త్రీలని అనుకోకుండా కూడా అర్ధనగంగా చూడటాన్ని ఊహించుకోవడానికి కూడా ఇష్టపడని మనం పరాయి వ్యక్తులను అట్లా చూసి ఆనందిస్తున్నామంటే కారణం ఏమిటి? ఏమిటంటే.. మనం నివసిస్తున్న సమాజపు దృష్టిలోనే సమానంగా చూడలేని వైకల్యం ఉంది. స్త్రీలని అర్థం చేసుకునే విషయంలో వైకల్యంతో కూడిన దృష్టి మన సంస్కృతిలో ఉంది. స్త్రీని సమానంగా చూడలేని వైకల్యంతో కూడిన దృష్టి మన మతంలో ఉంది. స్త్రీలను చూసే విధానంలో మన ఆలోచనలు వైకల్యంతో ఉన్నవి. ఇన్ని వైకల్యాలతో కూడిన సమాజంలో స్త్రీ స్వేచ్ఛగా ఎట్లా బతకగలుగుతుంది. ఇన్ని వైఫల్యాలు వైకల్యాలు గల ఈ సామాజిక జీవనంలో ఆమోదనీయ సంస్కృతిగా స్త్రీని అనుభవించే వస్తువుగా చూసే దృష్టి ఉంది కాబట్టే నిరంతరం స్త్రీలపై ఏదో ఒక రూపేణా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీని అనుభవ వస్తువుగా చూస్తే ఈ సమాజంలో పోర్న్ సైట్లు కూడా అత్యాచారాలకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నా యి. ఇట్లాంటి అంతర్జాల అశ్లీల సైట్లను చైనా లాంటి దేశాల్లో నిషేధిస్తే మన ప్రభుత్వాలు మాత్రం తాత్సారం చేస్తున్నాయి ఎందుకు? ఎందుకంటే.. మన ప్రభుత్వాల ఆలోచనలు కూడా ఆ వైకల్యాల వరుసలో ఉండటమే కారణం.
సమాజంలో అత్యాచారాలకు పాల కుల పాలనా విధానాలూ కారణమే.. అంతేకాక స్త్రీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కూడా ఈ అత్యాచా రాలకు ఊతమిస్తున్నాయి. బాలికలు, స్త్రీల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు, వారు చేసే కార్యక్రమాలకు స్త్రీల హక్కుల రక్షణ విషయంలో ప్రభుత్వ ఆచరణకు సంబం ధమే లేదు. ఇదే విధానం స్వాతంత్రం సిద్ధించినప్పటి నుండి మొదలు నేటికీ కొనసాగుతున్నది. మహిళా సాధికారత సాధిస్తామని చెప్పుకునే ప్రభుత్వాలు రోజురోజుకి చాలా హీనమైన స్థితికి దానిని దిగజార్చుతున్నాయి. మహిళా సాధికారత సాధించడానికి మహిళలు ఉన్నతంగా ఎదగడానికి ఆ రోజులలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహిళల హక్కుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును అంగీకరించలేదు. ఇప్పుడు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లబిల్లు కూడా పాలకులు పట్టించుకోవడం లేదు. పార్లమెంటులో పూర్తి మెజార్టీ ఉన్న ప్రస్తుత బీజేపీ పాలకులు ఆ ఊసే ఎత్త డానికి సిద్ధంగా లేరు. ఇప్పుడున్న మెజార్టీ రాజకీయ పార్టీలు తమ అధికారాన్ని మహిళలతో సమానంగా పంచుకోవటా నికి సిద్ధంగా లేవు. ఒకవేళ పంచుకున్న ప్పటికీ నిర్ణయ అధికారం మాత్రం పురుషుల చేతిలోనే ఉంటుంది. ఎన్నికైన వేలమంది మహిళా సర్పంచులు, ఎన్నికై న మహిళా ఎమ్మెల్యేలు రాజకీయంగా వారు స్వతంత్రంగా వ్యవహరించకుండా వారి భర్తలే అధి కారం చెలాయించడం మన కండ్లెదుట కనపడతూనే ఉన్నది. ఈ అత్యాచారాలను, వీటన్నిటిని నివారిం చాలంటే చట్ట సభలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తే.. వారికి వారు నిర్ణయాల ను ప్రభావితం చేయగలిగే స్థితి రావాలి. స్త్రీలను వ్యాపార సరుకుగా చూడటాన్ని నిషేధించాలి. వ్యాపార ప్రకటనల ను నియంత్రించాలి. అన్ని రంగాలలో మహిళలకు సమాన హ క్కులు కల్పించాలి. అధికారాన్ని సమానంగా మహిళలతో పంచు కోవాలి. అప్పుడు సమాజంలో స్త్రీల పట్ల ఒక గౌరవప్రదమైన దృష్టి, అభిప్రాయం కలుగుతుంది. మన సంస్కృ తిలో కూడా స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. పురుషులకు కూడా మహిళ లు మాతోపాటు సమానమే అనే గౌరవప్రదమైన దృష్టితో చూడటా నికి మార్గం ఏ ర్పడుతుంది. అట్లా జరిగినప్పుడే మన ఆలోచనలో సంస్కృతిలో మార్పు వచ్చి స్త్రీలపై దాడులు, అత్యా చారాలు జ రగకుండా స్త్రీని గౌరవంగా చూసే సమాజం నిర్మిత మౌతుంది. దీని కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
సెల్:94949 22492
Authorization