షేక్ కరిముల్లా
గత మూడు దశాబ్దాల కాలంగా మతోన్మాదం ప్రమాదకరమైన స్థాయికి చేరింది. ఇది నేడు మరింత కోరలు చాచి భారతీయ లౌకికతత్వానికి సవాలు విసురుతోంది. భారత జాతీయోద్యమం అందించిన లౌకిక, ప్రజాస్వామ్య భావన, వేల సంవత్సరాల మన ప్రజా సంస్కృతిలో లౌకిక విధానం చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. ఇది ప్రజలకు శ్రేయస్కరమైది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో 25 నుంచి 28 వరకుగల అధికరణలు మన లౌకికతత్వాన్ని ధృవపరుస్తున్నాయి. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని ప్రజాస్వామిక రాజ్యం అని అర్థం. అంటే మతానికీ రాజ్యానికీ సంబంధం ఉండరాదు. ఎటువంటి వివక్షతలు ప్రదర్శించదు. పాలన మత సంబంధమైనదిగా ఉండరాదు. మత రహితంగా ఉండాలి.
ఈ జంబూ ద్విపంలో వేలాది సంవత్సరాలుగా అనేక దేశా లుండేవి. ఆంగ్లేయుల పాలనలో మన దేశం పేరు ఇండియాగా ఆవిర్భవించింది. ఈ ఇండియాలో నివసించే ప్రజలే భారతీయు లు. ఈ హిందూ అనే పదమే విదేశీ పదం. ఇది మతపరమైన అర్థంలో ఆవిర్భవించలేదు. సింధునది పరివాహ ప్రాంతంలోకి ప్రవేశించిన అరబ్బులు అక్కడి వారిని హిందువులు అన్నారు. వారు సింధూ అని పలుకలేక హిందూ అని పిలిచారు. ఈ పదం క్రీ.శ.5వ శతాబ్దంలో ఆవిర్భవించింది. ఈ దేశం భిన్న సంస్కృతుల సమ్మేళనం. పలు మతాల వారున్నారు. ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు ఉన్నారు. ఈ దేశంలో వేలాది సంస్కృతులు కూడా ఉన్నాయి. వాటికి పేర్లు లేవు. అవి వివిధ ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాల రూపాలలో ఉన్నాయి. వాటిని మతాలుగా ప్రజలు ఏనాడూ భావించలేదు. వాస్తవానికి భారత ప్రాచీన, మధ్యయుగ దశలలో మతతత్వ గుర్తింపు లేదు. ఒకప్పుడు మనం మిగతా ప్రపంచానికి మత సామరస్యాన్ని, రాజకీయాలను, కళలలను, విజ్ఞాన శాస్త్రాలను నేర్పుతూ ఉండేవాళ్లం. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే విలువలు అందించాము. ఇంత సుభిక్షమె ౖన చరిత్ర, నాగరికత గల మన దేశంలో సమానత్వ భావనల మీద, మన సాంస్కృతిక వైవిధ్యం మీద ఆధిపత్య భావాజాలాన్ని బలవంతంగా రుద్దుతున్న ఘటనలు, ఈ దేశంలోని సౌభ్రాతృత్వ భావనను, భారత లౌకిక జాతీయవాదాన్ని నిట్టనిలువునా చీలుస్తున్న ఘటనలు నేడు కొనసాగుతున్నాయి.
ప్రమాదంలో భారత లౌకికతత్వం
ఒక స్వయం సేవకుడు మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జరుగుతున్న వరుస సంఘటనలు లౌకికవాదానికి ప్రమాద ఘంటికలుగా చెప్పవచ్చు. దేశంలో హిందూ సంస్కృతిని పునరుద్ధరిస్తామని 12వ శతాబ్దంలో రాజపుత్ర రాజు పృద్విరాజ్ చౌహాన్ ఢిల్లీ సింహాసనాన్ని కోల్పోయిన తరువాత ఇప్పుడు 800 ఏండ్ల తరువాత మళ్లీ హిందువులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చారని కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కటాన్ని ప్రస్తావిస్తూ వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్ అన్నారు. ఈ మధ్యలో పాలించిన వారు ఎవరో ఈ చరిత్ర పండితుడే చెప్పాలి. ఇంకా బీజేపీ ఎంపీలు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు భారత లౌకికతత్వానికి సవాలు విసురుతు న్నాయి. ఎన్నికల సమయంలో మోడీ అ ంటే ఇష్టం లేనివారు పాకిస్థాన్కు పోవాల ంటూ వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్సింగ్ తరువాత కేంద్రంలో మంత్రి అయ్యారు. ఒక కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి ఢిల్లీలో పాలించాల్సింది రాముడి సంతా నమా? అక్రమ సంతానమా? తేల్చుకోవా లంటూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు పి లుపునిచ్చారు. మరో ఎంపీ సాక్షి మహారా జ్ గాంధీజీని హత్య చేసిన హంతకుడు నాథురాం గాడ్సే దేశభక్తుడని సంభోదిం చారు. ఈ వ్యాఖ్యపై గాడ్సే పొరపాటున ఏమైనా చేసి ఉండొచ్చు గానీ దేశ ద్రోహి మాత్రం కాదంటూ పార్లమెంటులో బీజేపీ వారు సమర్థించుకున్నారు. జాతిపితగా ఈ దేశ ప్రజల గౌరవం పొందిన గాంధీజీని కాల్చి చంపటం ఈయన దృష్టిలో నేరం కాదు. కేవలం పొరపాటు మాత్రమే. అయోధ్యలో సాధ్యమైనంత త్వరగా రామ మందిరం నిర్మించాలని ఈ దేశ పౌరులు కోరుకుం టున్నారని యూపీ గవర్నర్ రామ్నాయక్ ప్రకటన ఆశ్చర్యకరం. కోర్టు పరిధిలో ఉన్న ఒక వివాదాస్పద, సున్నిత అంశంపై రాజ్యాంగ పదవిలోనున్న రామ్నాయక్ వ్యాఖ్య రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. మోడీ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేస్తారని గోవా మ ంత్రి దీపాంకర్ దవాలికర్ వ్యాఖ్య కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ వరుస సంఘ టనలు దేశ లౌకికవాదం ప్రమాదంలో పడిందనటానికి సంకేతాలు.
మత మార్పిడి- ఘర్ వాపసి
లౌకికవాద స్పృహకు గొడ్డలిపెట్టు ఈ మత మార్పిళ్లు. ఇది సంఫ్ు పరివార్ శక్తులు ప్రజల మధ్య చిచ్చుపెట్టి, మత విధ్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని అతలాకుతలం చేసే చర్య. 2014 డిసెంబర్ 10లో ఆగ్రాలో జరిగిన బలవంతపు మత మార్పిడి, 2014 డిసెంబర్ 25 అలీఘడ్లో 5వేల మంది ముస్లింలు, క్రైస్తవులను ఘర్ వాపసీ అనే తప్పుడు నినాదంతో మత మార్పిడులకు పాల్పడారు. ముస్లింలకు రూ.5లక్షలు, క్రైస్తవులకు రూ.2లక్షలతో ప్రలోభపెట్టి మత మార్పిడి కార్యక్రమం కొనసాగిస్తున్నట్టు ధర్మజాగరణ్ మంచ్ బాహాటంగా ప్రకటిస్తుం ది. అలాగే గుజరాత్లోని వల్సాద్ పట్టణానికి దగ్గరలో ఓ గిరిజ న తండాలోని క్రైస్తవ కుటుంబాలను గంపగుత్తాగా హిందూ మతంలోకి మార్పిడి చేశారు. అయితే ఇవి మత మార్పిడులు కావని, తొలుత హిందువులుగా ఉన్న వారు తరువాత క్రైస్తవం స్వీకరించాని వారు తిరిగి హిందూమతంలోకి మారటాన్ని మత మార్పిడులు అనకూడదని హిందూ సంస్థలు భాష్యం చెబుతు న్నాయి. ఇలాంటి మత మార్పిడులను ఘర్ వాపసిగానే చూడా లనటం శోచనీయం. ఇలా బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతూ మరోవైపు మత మార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొస్తామని బీజేపీ మాట్లాడుతున్నది. ఎన్నికలలో సబ్కా సాత్- సబ్కా వికాస్ అంటూ ఊదరగొట్టిన బీజేపీ దీనిని గాలికి వదిలి ఈ చర్యలతో ఐక్యంగా ఉన్న ప్రజలలో చిచ్చుపెట్టి దేశాన్ని రావణ కాష్టంగా మార్చాలని చూస్తున్నది.
మతం ఆర్థిక దోపిడీకి సాధనం
ఈ సంఘటనలను మతం చట్రంలో నుంచి చూస్తే సమాధానం ఎప్పటికీ దొరకదు. పరిష్కారం లభించదు. ఇవాళ మనముందున్న సవాళ్లకు సమాధానాలను వెతకాలంటే ఒక వ్యవస్థీకృత పరిశోధన చట్రం అవసరం. ప్రపంచ చారిత్రక దృక్ప థంతో ఒక బలమైన అవగాహన మనకుండాలి. ఏ మతాన్నైనా నిశితంగా పరిశీలిస్తే మతం ఒక దోపిడీ, పీడన సాధనంగా పాలకులకు లాభం చేకూర్చిందనేది చారిత్రక వాస్తవం. చరిత్రలోకి వెళ్లి దీని తాలూకు మూలాలు చూడాల్సి ఉంటుంది. పూర్తిగా మతం దోపిడీ శక్తుల చేతుల్లో దోపిడీకి సాధనంగా ఉపయోగపడింది. ఏ రాజ్యానికైనా దోపిడీ రాజ్యంగా కొనసాగాలంటే దోపిడీకి గురయ్యేవారు, అనైక్యంగా, బలహీనంగా, అజ్ఞానంగా, మూఢ విశ్వాసాలతో, పరస్పర కలహాలతో ప్రజలు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మన దేశంలో రాజకీయాలన్నీ జాతి, మతాల పునాదుల మీద ఏర్పడి ఉన్నాయనీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలనే ప్రజాస్వామిక విలువలను, సామాజిక న్యాయాన్ని పాతాళంలోకి నెడుతున్నాయ ని మనకు తెలుసు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని దుర్వినియోగపరిచిన సంఘటనలు ప్రపంచంలో మొదటిసారి గా అమెరికాలో 19వ శతాబ్దంలో జరిగాయి. తరువాత యూరప్లో కూడా నాజీ నియంతలు జాతి సిద్ధాంతం పేరిట దారుణ హత్యాకాండకు పాల్పడ్డారు. ఈ చర్యలను సామ్రాజ్య వాద విస్తరణ, ఆర్థిక దోపిడీలో భాగంగానే చూడాల్సి ఉంటుంది.
ఇక 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం అనం తరం భారతదేశంలో మతతత్వ రాజకీయాలు (హిందూ- ముస్లిం) మొదటిసారిగా రంగం మీదకు వచ్చాయి. పరస్పర వ్యతిరేకమైన రెండు మతతత్వ సంస్థలు ఆవిర్భవించాయి. ఒకటి ఇస్లాం మత పునాదిపై ముస్లిం లీగ్ (1925), రెండవది హిందూ మత పునాదిపై ఏర్పడిన హిందూ మహాసభ (1907), ఆర్ఎస్ఎస్ (1925)ల నిర్మాణం ముస్లిం మతతత్వానికి ముస్లిం లీగ్ ప్రాతినిధ్యం వహించింది. అలాగే హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్లోని ఒక వర్గం కూడా హిందూ మతతత్వ రాజకీయాల పక్షాన పని చేశాయి. ముస్లిం లీగ్ ఎప్పుడూ ముస్లింలలోని ధనిక వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా ఉన్నది. ఈ ధనికులు దేశ విభజనానంతరం పాకిస్తాన్లో స్థిరపడ్డారు. అయి తే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, హకిం అజ్మల్ ఖాన్, డా|| అన్సారి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ముస్లిం మేధావులు మాత్రం లౌకికవాద భారతీయ హిందూ-ముస్లిం ఐక్యతతో స్వాతంత్య్రం కోసం పోరాడాలన్న విశ్వాసంతో పని చేశారు. దేశ విభజనానంతరం భారతదేశంలోనే మిగిలిపోయిన అత్యధిక శాతం ముస్లిం పేదవాళ్లు, భూమి లేని వాళ్లు, చేతి వృత్తుల వాళ్లు ఈ దేశం మీద ప్రేమ ఉన్న లౌకికవాదులు. వీరు అల్ప సంఖ్యాక వర్గంగా రెండవ తరగతి పౌరులుగా బతుకుతూ కూడా దేశ విభజనకు కారకులన్న నిందను భరిస్తున్న అభాగ్యులు. మరోవైపు నాజీల నుండి హిట్లర్ నియంతృత్వం నుండి ప్రేరణ పొందిన ఆర్ఎస్ఎస్ ప్రారంభంలో దీని మద్దతుదారులందరూ భూస్వాములు, వ్యాపారవేత్తలు, బ్రాహ్మణ తదితర ధనిక వర్గాలు. ఈ సంస్థ జాతీయోద్యమంలో ఏ పాత్ర పోషించలేదు. పైగా క్విట్ ఇండియా (1942) ఉద్యమాన్ని బహిష్కరించింది. వ్యతిరేకించింది కూడా. కాగా దేశ నిర్మాణంలో తను ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా సంఫ్ు పరివార్ చెప్పుకుంటుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోని చరిత్ర పాఠ్య పుస్తకాలలో ఎన్నో వక్రీకరణలు చేర్చారు. భారత జాతీయోద్యమంలో హిందుత్వ శక్తులు గొప్ప పాత్ర పోషించాయనీ హెడ్గేవార్ను బ్రిటిష్ ప్రభు త్వం జైల్లో పెట్టిందని అబద్దాలు రాశారు. నిజానికి హెడ్గేవార్ సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నది చాలా తక్కువ కాలం. ఆ సమయంలో కొద్దికాలం పాటు జైల్లో ఉన్నాడే తప్ప ఆ తరువాత ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జాతీయోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు. అంటే బ్రిటీష్ సామ్రాజ్యవాదుల ఆర్థిక దోపిడీని, పీడనను ఈ అపర దేశభక్తులు ఎక్కడా వ్యతిరేకించలేదనేది గమ నార్హం. హెడ్గేవార్ 1931నుంచి ఉద్యమంలో సంబంధాలు తెం చుకున్నాడని లాలాలజపతిరారు కూడా నిర్ధారించారు. జాతీ యోద్యమానికి దూరంగా ఉండటమనేది సరైన చర్యే అని గోవాల్కర్ సిద్ధాంతీకరించాడు. ఈ దృక్పథంతో సంఫ్ు పరివార్ శక్తులు బ్రిటీష్ వాళ్లను వ్యతిరేకించలేదు. ఆర్ఎస్ఎస్ జాతీయ వాదం పని అంతా ముస్లింలను వ్యతిరేకించటం, ముస్లింలను సమర్థిస్తున్నారంటూ జాతీయ నాయకులను తిట్టడం మాత్రమే. ఈ పైత్యం బాగా నెత్తికెక్కించుకున్న నాథూరాం వినాయక్ గాడ్సే చివరకు గాంధీజీని పొట్టనపెట్టుకున్నాడు (1948). నేడు ఈ గాంధీ హంతకునికి గుడి కట్టేందుకు యూపీ రాష్ట్రం మీరట్లోని శారదా రోడ్డులో హిందూ మహాసభ భూమి పూజ చేయడం సంచలనమైంది. ఈ వికృత చర్యపై స్థానిక మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. బ్రిటిష్ వాళ్ల మీద సాయుధ తిరుగుబాటు చేసిన నాయకులను కూడా ఆర్ఎస్ఎస్ తప్పు పట్టింది. అంటే వీరి దృష్టిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం అన్నది వినాశకరం. అభివృద్ధి నిరోధకం. ఈ పరంప ర నేటికీ కొనసాగుతుంది. మోడీ దూకుడుగా కొనసాగిస్తున్న ప్రపంచీకరణ ఆర్థిక విధానాలను ఈ సంస్థ ఎక్కడా వ్యతిరే కించిన పాపాన పోలేదు. పైన వివరించిన విధంగా రెండు మతాలకు చెందిన ఈ మతతత్వ సంస్థలు ఏనాడూ బ్రిటిష్ విధానాలను వ్యతిరేకించలేదు. అందువల్ల ఆనాడు వాటి కార్యకలాపాలకు బ్రిటిష్ వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. దీన్ని ఆసరాగా వాడుకున్న బ్రిటిష్ వారు విభజిం చు- పాలించు విధానం కొనసాగించి పూర్తి లబ్ది పొందారు. హిందూ, ముస్లింలలోని ఉన్నత వర్గాలలో పెరిగిన విభేదాలను బ్రిటిష్ ప్రభుత్వం తన సామ్రాజ్యవాద దోపిడీ ప్రయోజనాలకు వాడుకున్నది. సామాన్య ప్రజలు బలయ్యారు. ఇక వర్తమానం చూస్తే ఏ రాజ్యానికైనా తన ఆర్థిక దోపిడీ నిరంతరం కొనసాగ టానికి ఒక మతంలాంటి భావాజాలం అవసరం. ఆ మత్తు మతం అని చరిత్ర నిరూపించింది. ఈ వెలుగులో ప్రపంచీకరణ కు- మతోన్మాదానికి గల పరస్పర సంబంధాన్ని పరిశీలించాలి.
ప్రపంచీకరణ- మతోన్మాదం- పరస్పర సంబంధం
ఉత్తర భారతదేశంలో 1980 చివర ఒక్కసారిగా హిందూత్వ పేరుతో పెల్లుబికిన మతోన్మాదం 1990-2000లలో తన క్రూరమైన ప్రస్థానాన్ని సాగిప్తూ క్రమంగా దేశం మొత్తం విస్తరించింది. అయితే 1990 దశకంలో దేశం పూర్తిస్థాయిలో ప్రపంచీకరణ ఊబిలోకి ప్రవేశిం చటానికి హిందూత్వం పెచ్చరిల్లటానికి (1992 బాబ్రి ఘటన తో) మధ్యగల సంబంధాన్ని చూస్తే ఇక్కడ దొంగ దొరికిపోయా డు. ప్రపంచీకరణ కారణంగా విపరీతంగా పెరిగిపోతున్న దారి ద్య్రం, పేదరికం, నిరుద్యోగం, ఆకలి, రైతుల ఆత్మహత్యలు ప్రజల కు వ్యవస్థపై దీనికి మూలమైన ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పౌర ఉద్యమాలు, పోరాటాలు ఉద్భవించి సోషలిస్టు ఆర్థిక వ్యవ స్థలు ఏర్పడే పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులు రాకుండా దీనిని నిలువరించడానికే హిందూత్వ శక్తులు అతి సున్నిత అంశమైన మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రక్తపాతం సృష్టించాయి. తద్వారా ప్రజల ఆలోచనా దృక్పథాన్ని పక్కదారి పట్టించవచ్చు. దోపిడీకి, పీడనకు గురయ్యే అశేష ప్రజానీకాన్ని, అనైక్యంగా బల హీనంగా మూఢ విశ్వాసాలతో పరస్పర కలహాలతో ఉండేటట్టు చేసి తమ పబ్బం గడుపుకోవటంతోపాటు దేశ ప్రజలను, వనరు లను దేశీ, విదేశీ కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు దోచి పెట్టవ చ్చు. ఈ కుట్ర దేశంలో యథేచ్ఛగా కొనసాగటంలో భాగ మే నేటి ఈ హిందూ మతోన్మాద చర్యలు. దీనికి అమెరికా సామ్రాజ్య వాదం తన స్వార్థం కోసం భారతదేశంలో హిందూ మతోన్మాదా నికి మద్దతునిస్తున్నది. ప్రపంచమంతా మతం మత్తులో మునిగిపోతే సామ్రాజ్యవాదం తన దోపిడీని యథేచ్ఛగా కొనసాగించగలదు. ఇందుకు మత రాజ్యం ఏర్పడాలి. నియంతల పాలన కావాలి. దీనికిగాను అమెరికా ఆర్ఎస్ఎస్కు మిలియన్ల డాలర్ల ఆర్థిక సా యం అందిస్తున్నది. ఈ విషయాన్ని బిజు మాథ్యూ తన పరిశోధ న ద్వారా బయటపెట్టాడు. 'ది ప్రోటీన్ ఫార్మ్స్ ఆఫ్ యాంటీ హిందూత్వ'' (అమెరికా హిందూత్వపు పౌష్టిక రూపాలు) అనే పుస్తకంలో, ఆయనే రాసిన మరో రచన ''టాక్సీకాబ్స్ ఎండ్ కాపిటలిజం ఇన్ న్యూయార్క్'' (కార్నెల్ యూనివర్సిటీ ప్రచురణ 2008)లలో ఈ విషయాలను చక్కగా వివరించాడు. ఈ చట్రంలో నుంచి హిందూత్వాన్ని సైద్ధాంతికంగా విశ్లేషణ చేసుకుటే విషయం క్షుణ్ణంగా బోధపడుతుంది. ఈ అవగాహనలో నుంచి రాబోయే దశాబ్దాలలో జరిగే పరిణామాలను అంచనా వేసుకొని వామపక్ష లౌకిక కార్యకర్తలు, మేధావులు, పౌర సమాజం ఈ అంశాలను అర్థం చేసుకోవాలి. పరిశీలించాలి. ముందు ముందు రాబోయే పెను సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇది అత్యవసరం. తద్వారా మతోన్మాదాన్ని ధీటుగా ఎదుర్కొని సుందర భారతావనిని నిర్మించాలి.
సెల్ :9705450705
Authorization