వడ్డీ రేటు క్రెడిట్ సదుపాయాన్ని ఏ మేరకు స్వీకరించవచ్చు అనేదాన్ని నిర్ణయించే కీలక అంశం లెక్క కట్టినా సగటు వార్షిక వడ్డీ రేటు ముస్లింలు తీసుకునే అన్ని లోన్లకు రాష్ట్రంలో 16.30శాతంగా ఉంది. ముస్లింలకు ఇచ్చే లోన్లకు వ్యక్తిగత వడ్డీ వ్యాపారస్తులు అత్యధిక వడ్డీ రేటు (28శాతం) వసూలు చేస్తారు. తర్వాత స్థానంలో ఇన్ఫుట్ సప్లైర్స్ (24శాతం) వ్యవసాయ రుణ దాతలు (24శాతం) ఉంటారు. వ్యవస్థీకృత ఏజెన్సీ బ్యాంకులు (10.8శాతం) సహకార సంస్థలు 13శాతం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ 6.5శాతం మాత్రమే వడ్డీ వసూలు చేస్తాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ), డేటా ప్రకారం బ్యాంకుల వారీగా లబ్దిదారుల వివరాలు తెలియచేస్తుంది ఏమిటంటే వివిధ బ్యాంకులనుండి లబ్ది పొందిన వారిలో ముస్లింలు అందరికన్నా దిగువస్థాయిలో ఉన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు (3.07శాతం) మాత్రమే లోన్లలో వాటా కలిగి ఉన్నారు. దీన్నిబట్టి ముస్లింలకు చాలా తక్కువ మొత్తంలో లోన్లు మంజూరయ్యాయని తెలుస్తోంది. ముస్లింలు లోన్లను ఎక్కువగా ఇంటి ఖర్చుల నిమిత్తం (15శాతం), మెడికల్ ఖర్చులకు (11శాతం) ఇంటి నిర్మాణ ఖర్చులకు (11శాతం) వారి సాంప్రదాయ వృత్తులైన ఆటోమొబైల్, మోటార్ డ్రైవింగ్, బండి దుకాణాలు, చిల్లర కొట్లు, తోలు పరిశ్రమ, దర్జీ పని, అల్లికలు, బైన్డింగ్ (12 శాతం) వంటి వాటికి వినియోగిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ముస్లింల విద్య కోసం లోన్లు చాలా తక్కువగా (2 శాతం) తీసుకుంటున్నారు.
జియాఉద్దీన్ ముహమ్మద్
తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 1,030 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు మాత్రం 307.86 కోట్లు. అంటే 29శాతం మాత్ర మే. దీన్ని బట్టే కేసీఆర్కు ముస్లింలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1,160 కోట్లు కేటాయించారు. దీనిలో 491.52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే 42శాతం మాత్రమే. 2016-17లో 1,200 కోట్లు కేటాయించారు. దీనిలో 863.36 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే 70శాతం ఖర్చు అయినది. 2017-18లో 1,226 కోట్లు కేటాయించారు. దీనిలో 962.71 కోట్లు ఖర్చు చేశారు. అంటే 78శాతం మాత్రమే. 2018-19లో 1,973 కోట్లు కేటాయించారు. దీనిలో 703.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే 35శాతం మాత్రమే. తెలంగాణ రాష్ట్ర గత ఐదేండ్ల మొత్తం బడ్జెట్ దాదాపుగా 6.7 లక్షల కోట్లు కాగా దానిలో మైనారిటీ సంక్షేమ శాఖకు 6,589 కోట్లు కేటాయించా రు. ఇది మొత్తం బడ్జెట్లో సుమారు 1శాతంగా ఉంది. దీనిలో 3,328.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కేటాయించిన దాంట్లో 50 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న షాదీ ముబారక్ పథకం ముస్లిం మహిళల సాధి కారతకు ఏమాత్రం ఉపయోగప డటం లేదు. ముస్లింలలో చాలా బీదరికం ఉంది. కాబట్టి షాదీ ముబారక్ని కొనసాగిస్తూ ప్రభు త్వమే నేరుగా సబ్సిడీ రుణాలను భరిస్తూ ముస్లిం మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పడాలి.
బ్యాంకులు కానీ ఇతర రు ణ సంస్థలు కానీ ముస్లిం కుటు ంబాలకు ఇచ్చే రుణ సదుపా యం చాలా తక్కువ స్థాయిలో ఉంది. తెలంగాణ ముస్లిం కుటుంబాలు అప్పు చేసే సగటు మొత్తం లెక్కల్లో అప్పు ఇచ్చే సంస్థలు ప్రధానంగా బ్యాంకుల తర్వాతి స్థానాలలో వడ్డీ వ్యాపా రస్తులు, సహకార సంస్థలు, వ్యక్తిగత రుణ దాతలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎన్బీఎఫ్సీ సంస్థలు వస్తాయి. ముస్లింలు వడ్డీ వ్యాపారస్తుల నుండి తీసుకున్న లోన్ల మొత్తాలు జాతీయ సగటుతో పోలిస్తే చా లా అధికం. తెలంగాణలో ము స్లిం కుటుంబాలు భారత స్థాయి తో పోలిస్తే వ్యవస్థీకృత కేంద్రా లు అనగా బ్యాంకులు, సహకార సంఘాలు ఎస్హెచ్జీ నుండి తక్కువ మొత్తాలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుండి ఇతర రుణ దాతల నుండి ఎక్కువ మొత్తాల ను అప్పుగా తీసుకుంటున్నారు. తరువాత వడ్డీ విష వలయంలో చిక్కుకుపోతున్నారు. వివిధ క్రెడి ట్ ఏజెన్సీల నుండి తీసుకున్న లోన్లు వాటా లెక్కల్లో చూస్తే ఇతర గ్రూపులాగానే ముస్లింలు బ్యాంకుల నుండి పొందుతున్నది 9 శాతం మాత్రమే. ఇది ఇతర ఏజెన్సీల నుండి పొందేదాని కన్నా చాలా తక్కువ. ఫలితంగా దేశ స్థాయిలో పోలిస్తే తెలంగాణలో ముస్లింలు వడ్డీ వ్యాపారస్తులు ఇన్ ఫుట్ సప్లైయర్స్ (47%) పైన, మిత్రులు ఎస్హెచ్జీపైన అధికంగా ఆధారపడుతున్నారు (14.5శాతం).
సీజీజీ నిర్వహించిన శాంపిల్ సర్వే ప్రకారం 43.3 శాతం తెలంగాణ కుటుంబాలు బంధువుల నుండి మిత్రుల నుండి అప్పు తీసుకుంటున్నాయి. ముస్లిం కుటుంబాలలో 45.1శాతం మిత్రులు, చుట్టాలనుండి అప్పు తీసుకుంటున్నారు. వీరికి అప్పు లభించే ప్రధాన మూలం వడ్డీ వ్యాపారస్తులు. ముస్లిం కుటుంబాలలో 37.7శాతం వడ్డీ వ్యాపారస్తుల నుండి అప్పు పొందుతున్నారు. 17.1శాతం కుటుంబాలకు, సహకార సంస్థ లు, 34.7శాతం కుటుంబాలకు ఎస్హెచ్జీ రుణాలు ఇస్తున్నా యి. ముస్లింలు తీసుకునే లోన్లలో బెనిఫిషీయల్, కన్సెషనల్ స్కీములైన పీఎంఆర్వై, ఎస్జీఎస్వై, ఎస్జేయూ, ఎస్ఆర్వై, రాష్ట్ర ప్రభుత్వ పథకం గ్రూప్ లోన్, మైనారిటీల స్కీములవంటి వాటి కిందకి రావు. ప్రత్యేకంగా చెప్పాలంటే మైనారిటీ స్కీముల కింద ఇచ్చే లోన్లు రాష్ట్ర స్థాయిలో దేశస్థాయిలో ముస్లింలకు అందేది శూన్యమని అర్థమవుతోంది. ఇతర మతాలూ వర్గాల్లాగే రాష్ట్రంలో ముస్లింలు మీడియం టర్మ్ (44శాతం) ఎక్కువ వంతు లోన్లు తీసుకుంటున్నారు. తర్వాతి స్థానాల్లో షార్ట్ టర్మ్ నాన్ ఫ్లెడ్జెడ్ (24శాతం) లాంగ్ టర్మ్ (21శాతం) లోన్లు ఉన్నాయి.
వడ్డీ రేటు క్రెడిట్ సదుపాయాన్ని ఏ మేరకు స్వీకరిం చవచ్చు అనేదాన్ని నిర్ణ యించే కీలక అం శం లెక్క కట్టి న సగటు వార్షిక వడ్డీ రేటు ముస్లింలు తీసుకునే అన్ని లోన్లకు రాష్ట్రంలో 16.30శాతంగా ఉంది. ము స్లింలకు ఇచ్చే లోన్లకు వ్యక్తిగత వడ్డీ వ్యాపారస్తులు అత్యధిక వడ్డీ రేటు (28 శాతం) వసూలు చేస్తారు. తర్వాత స్థానం లో ఇన్ఫుట్ సప్లైర్స్ (24 శాతం) వ్యవసాయ రుణ దాతలు (24శాతం) ఉంటారు. వ్యవస్థీకృత ఏజెన్సీ బ్యాంకులు (10.8శాతం) సహకార సంస్థలు 13శాతం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ 6.5శాతం మాత్రమే వడ్డీ వసూలు చేస్తాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ), డేటా ప్రకారం బ్యాంకుల వారిగా లబ్దిదారుల వివరాలు తెలియచేస్తుంది ఏమిటంటే వివిధ బ్యాంకులనుండి లబ్ది పొందిన వారిలో ముస్లింలు అందరికన్నా దిగువస్థాయిలో ఉన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు (3.07శాతం) మాత్రమే లోన్లలో వాటా కలిగి ఉన్నారు. దీన్నిబట్టి ముస్లింలకు చాల తక్కువ మొత్తంలో లోన్లు మంజూరయ్యాయని తెలుస్తుంది. ముస్లింలు లోన్లను ఎక్కువగా ఇంటి ఖర్చుల నిమిత్తం (15శాతం), మెడికల్ ఖర్చులకు (11శాతం) ఇంటి నిర్మాణ ఖర్చులకు (11శాతం) వారి సాంప్రదాయ వృత్తులైన ఆటోమొబైల్, మోటార్ డ్రైవింగ్, బండి దుకాణాలు, చిల్లర కొట్లు, తోలు పరిశ్రమ, దర్జీ పని, అల్లికలు, బైన్డింగ్ (12 శాతం). రాష్ట్ర స్థాయిలో ముస్లింల విద్య కో సం లోన్లు చాలా తక్కు వగా (2 శాతం) తీసుకుంటున్నారు.
నేషనల్ మై నారిటీస్ డెవల ప్మెంట్ ఫైనాన్స్ కార్పొ రేషన్ (ఎన్ఎంఎఫ్డీసీ) రాష్ట్ర స్థాయి శాఖలున్నా కేంద్ర ప్రభుత్వ సంస్థ. మైనారిటీల స్వయం ఉపాధి, ఆదాయ వనరుల కార్యకలాపాలకు రాయితీతో కూడిన లోన్లు అందించే ఉద్దేశ్యంతో 1994లో స్థాపించారు. ప్రైమ్ మినిస్టర్ న్యూ 15 పాయింట్ ప్రోగ్రాం ఫర్ ది వెల్ఫేర్ అఫ్ మైనారిటీస్ 9వ పాయింట్ కింద క్రెడిట్ సపోర్ట్ గురించి నొక్కి చెప్పింది. ఆర్థిక కార్యకలాపాలకు రుణాల రూపంలో మద్దతు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని నిర్దేశించడంతో అధిక ఈక్విటీ సపొర్టులో ఎన్ఎండీఎఫ్సీని బలోపేతం చేశారు. ఫలితంగా బ్యాంకులు ప్రియార్టీ సెక్టార్ లెండింగ్ (పీఎస్ఎల్) కింద తగు మొత్తాల్లో మైనారిటీ కమ్యూనిటీలకు ఆర్థిక సహాయం అందించడానికి పూనుకున్నాయి. పీఎస్ఎల్ కింద ఋణం సదుపాయం లక్షిత వర్గాలకు కచ్చితంగా అందేలా చేయడానికి ఆర్బీఐ అప్పుడప్పుడు కమర్షియల్ బ్యాంకులకు మార్గదర్శాకలు జారీ చేస్తుంది.
ముస్లింలు సమ్మిళిత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావాలంటే ప్రభు త్వాలు వీరి ఆర్థికాభివృధికి తోడ్పడే పాలసీలు, స్కీమ్స్, ప్రణాళికలు, ఆర్థికాక్షరాస్యత పెంచే కార్యక్రమాలు కాగితాలపై మాత్రమే కాకుండా వివక్ష చూపకుం డా, చిత్తశుద్దితో ప్రణాళికలు అ మలు చేయాలి. అప్పుడే భా రతదేశంలో రెండవ అతి పెద్ద జనసముదాయమైన ముస్లింలు భారత ఆర్థికాభివృద్ధిలో భాగం కావటం వల న పేదరికం తగ్గి దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ముస్లింలు కూడా తమకోసం ప్రభుత్వం ఎలాంటి పాలసీలు, స్కీమ్స్, ప్ర ణాళికలు అమలు చేస్తున్న దో వాటి వివరాలు తెలుసుకొని ఉప యోగి ంచు కున్నప్పుడే ఆర్థికాభివృద్ధిలో భాగం కాగలరు. పై కారణాలను అధి గమించినప్పుడే సమ్మిళిత ఆర్థిక వ్యవస్థలో ముస్లింలు భాగ స్వామ్యం కాగలరు. అప్పుడే ప్రపంచ దేశాలలో మన దేశ ఆర్థిక పరపతి, ఖ్యాతీ పెరుగుతుంది. దీనివల్ల దేశం సుసంపన్నంగా ఎదుగుతుందనటంలోఎలాంటి సందేహంలేదు.
సెల్ : 9989236393
Authorization