- కుటుంబాన్ని బహిష్కరించిన వీడీసీ
మంచిర్యాల్ నరేందర్
రెవెన్యూ అధికారుల తప్పిదం ఓ కుటుంబం గ్రామ బహిష్కరణకు కారణమైంది. పొరపాటుగా రెండెకరాల భూమి బాధిత కుటుంబానికి పట్టా కావడంతో ఈ పొర పాటుకు కారణాలను గుర్తించని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (వీడీసీ) అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబం రూ.50 వేలు జరిమానా కట్టాలని హుకూం జారీ చేసింది. ఆ భూమి పొరపాటుగా తమ పేరుపై పట్టా అయ్యిందనీ, కానీ సంబంధిత భూమి లో తాము ఇప్పటి వరకు సాగు చేయలేదని బాధిత కుటుబం పేర్కొంది. అంత డబ్బు కట్టలేమని ప్రాధేయపడిం ది. అయినా వినిపించుకోని వీడీసీ.. ఆ కుటుంబంపై డ బ్బు కట్టే వరకు గ్రామ బహిష్కరణ చేస్తున్నట్టు ప్రకటించిం ది. దీంతో గ్రామంలో కనీసం పాలు కూడా పోయడం లేద నీ, కూలి పనికి రానివ్వడం లేదని వాపోతూ.. పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుజూసింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భూమన్న భార్య కుమ్మరి శారద పేరుమీద పన్నెండేడ్ల క్రితం 2 ఎకరా ల భూమి పట్టా అయ్యింది. కా నీ ఈ విషయం బాధిత కుటుబానికి తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఇటీవల భూ ప్రక్షాళనతో ఈ విషయం వెలుగుజూసింది. అధికారుల త ప్పిదం వల్లే పొరపాటుగా పట్టా అయ్యింది. అయినప్పటికీ వారు ఆ భూమిలో సాగు చేయడం లేదు. ఆ భూమిలో ఎటువంటి పనులూ చేయలేదు. అసలు ఆ భూమి తమ పేరున ఉన్న సంగతే వారికి తెలియదు. కాగా ఇటీవల రైతుబంధు డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యాయి. ఈ విషయం తె లుసుకున్న గ్రామ వీడీసీ సభ్యులు గ్రామంలో ఉన్న ప్రభు త్వ భూమిని అక్రమంగా పట్టా మార్పిడి చేయిం చుకున్నా రని ఆరోపించారు. కావాలనే ఆ భూమిని కాజే యాలని కుట్ర పన్నారని కక్షపెంచుకున్నారు. ఈ తప్పి దానికి గాను వెంటనే వీడీసీకి రూ.50 వేలు జరిమానా కట్టాలని హుకుం జారీ చేశారు. ఆ పొరపాటులో తమ ప్రమేయం ఏమీ లేదని బాధితులు ఎంత మొత్తుకున్నా వీడీసీ స భ్యులు వినిపించుకోలేదు. ఆ భూమిలో తాము ఇప్పటి వర కు సాగు చేయలేదనీ, తమకు రూ.50 వేలు కట్టేంత స్థో మత లేదని బాధిత కుటుంబం వీడీసీ ముందు వాపోయిది. వారి బాధను ఏ కోశానా వినిపించుకోని వీడీసీ సభ్యు లు ఆ కుటుంబాన్ని గత నెల 28న గ్రామ బహిష్కరణ చే స్తున్నట్టు ప్రకటించింది. ఇక అప్పటి నుంచి బాధిత కుటుం బానికి ప్రత్యక్ష నరకం చూపించడం ప్రారంభించారు.
రకరకాలుగా వేధింపులు
గ్రామంలోని కిరాణా దుకాణాల్లో బాధితులకు పాలు, కిరాణా సామగ్రి అమ్మొద్దని వీడీసీ సభ్యులు ఆదేశించారు. వారి పొలం పనులకు కూలీలు వెళ్లొద్దని హుకుం జారీ చే శారు. బాధిత కుటుంబాన్ని ఎవరూ పనులకు పిలవొద్దని తీర్మానించారు. ఇలా రకరకాలుగా అనేక విధాలుగా వేధిం పులకు గురి చేశారు. కిరాణా దుకాణంలో సామాన్లు అమ్మ డం లేదు. కనీసం పాలు కూడా లభించని పరిస్థితుల్లో బతుకు వెల్లదీయాల్సిన పరిస్థితిని వీడీసీ సభ్యులు సృష్టించారు. వారితో ఎవరూ మాట్లాడటం లేదు. చుట్టు పక్కల ప్రజల నుంచి ఎటువంటి సహకారం అందకుండా చేశారు. తమ బాధను ఇతరులతో పంచుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. గ్రామంలోనే ఉన్నా ఎక్కడో చిట్ట డవిలో బతుకుతున్న తీరును తలపించేలా చేశారు. మాన సికంగా అన్ని రకాలుగా వేధింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితులు విధిలేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు.
వీడీసీకి పోలీసుల హెచ్చరిక
బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ రాణా ప్రతాప్సింగ్, వీఆర్వో లింబాద్రి సమ క్షంలో సీఐ రాఘవేందర్ పోలీస్స్టేషన్లో విచారణ చేప ట్టారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దనీ, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వీడీసీ సభ్యులను హెచ్చరిం చారు. వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. గ్రామ బహిష్కరణ అనేది రాజ్యాంగబ ద్దమైనది కాదనీ, ఇలాంటి చర్యలకు పాల్పడేవారు ఎంతటివారైనా సహించేది లేదని హెచ్చరించారు. వీడీసీ సభ్యులు ఇలాంటి చర్యలకు స్వస్తి పలికి బాధిత కుటుంబం పై విధించిన గ్రామ బహిష్కరణను ఎత్తివేయాలని తెలి పారు. లేకుంటే చట్ట పరంగా శిక్షార్హులు అవుతారని తెలి పారు. అయినా ఈ గ్రామ బహిష్కరణపై వీడీసీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఇంకా బహిష్కరణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
సెల్ : 9666406336
Authorization