యండి.ఉస్మాన్ ఖాన్
దేశాన్ని బానిస బంధనాల నుండి విముక్తి కల్పించే ఈ మహత్ పోరాటంలో అనేకమంది ముస్లిం మహిళలు కూడా అనుపమాన త్యాగాలు చేశారు. బేగం హజ్రత్ మహల్, ఆబాదీబానో, బేగం అజీజున్, ముందర్, హమీదాబేగం, బేగం రహీమా, బేగం హబీబా, బేగం అజీజున్, అజ్గరీబేగం లాంటి ఎందరో వీరవనితలు తమ జీవితాలను ధారపోశారు. బ్రిటిష్ ముష్కరుల కబంధ హస్తాలనుండి దేశాన్ని రక్షించడానికి కదనరంగంలోకి దూకిన ధీరవనిత బేగం హజ్రత్ మహల్. స్వయంగా ఏనుగు అంబారీపై స్వారీ చేస్తూ, యుద్ధరంగంలో ఆంగ్లేయులపై శివంగిలా విరుచుకు పడిన వీరనారి. పాతికేండ్ల పడుచు ప్రాయంలోనే ఇద్దరు బిడ్డలను కలిగి, భర్త మరణించినా పునర్వివాహం చేసుకోకుండా భారతమాత సంకెళ్లు తెంచడానికి దేశసేవకు అంకితమైన మహిళ ఆబాదీబానూ. తన ఇద్దరు కొడుకులకూ ఉగ్గుపాలతోనే విప్లవభావాలు రంగరించి పోసి సమర రంగానికి పంపిన ధీశాలి ఆమె. మౌలానా ముహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీల మాతృమూర్తి. ఈ అలీ సోదరులు ఆబాదీబాను ముద్దు బిడ్డలే కాదు, భారతమాత ముద్దుబిడ్డలు కూడా. స్వాతంత్య్రోద్యమంలో ఈ ఇద్దరు అలీల పాత్ర అజరామరం. ఉద్యమ ప్రస్థానంలో మహాత్మాగాంధీ ఆబాదీబానూను అనేకసార్లు కలుసుకున్నారు. గాంధీజీ ఆమెను అమ్మా అని పిలిచేవారు. ఉద్యమానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా ఆమె గాంధీజీకి అందించేవారు. స్వయంగా గాంధీజీయే ఆమెను అమ్మా అని సంబోధించడంతో ప్రజలంతా ఆమెను అమ్మా అని పిలిచుకునేవారు. దీంతో ఆమె బీబీ అమ్మాన్గా ప్రసిద్ధిగాంచారు. వయసు మీదపడినా, అనారోగ్యం వేధించినా ఆమె స్వాతంత్య్ర పోరాటం నుండి వీసమెత్తు కూడా వెనక్కి తగ్గలేదు. 'హోమ్ రూల్' ఉద్యమంలో ఈమె కీలకపాత్ర పోషించారు. ఆబాదీబాను పోరాట పటిమను, మొక్కవోని ధైర్యసాహసాలను చూసి ఆంగ్లేయులు ఈమె చాలా ప్రమాదకరమైన మహిళ అని ప్రకటించారు. కాని ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, దేశ స్వాతంత్య్రం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసి, ఇన్ని త్యాగాలు చేసిన ముస్లింలను ఈనాడు అనుమానితులుగా కొన్ని శక్తులు చూపుతున్నాయి. సొంతగడ్డపైనే పరాయి వారుగా పరిగణించబడుతున్నారు. దేశద్రోహ ముద్ర వారి తలపై కత్తిలా వేలాడుతోంది. స్వతంత్ర భారతావనిలో వారి హక్కులు అతి దారుణంగా హరించబడుతున్నాయి. విదేశీయులనీ, విదేశీ ఏజెంట్లనీ నిందించబడుతున్నారు. వారిని దేశం విడిచి వెళ్లమని కూడా బెదిరిస్తున్నారు. ప్రాణాలను ధారపోసి సాధించుకున్న స్వతంత్ర స్వేచ్ఛా భారతంలో, స్వాతంత్య్రోద్యమంతో నామమాత్రపు సంబంధం కూడా లేని 'పరివార్' శక్తులు ముస్లింల దేశభక్తిని శంకించడం అతి పెద్ద విషాదం.
అందాలు జాలువారే మన సుందర భారతావని ఈనాడు సర్వ స్వతంత్ర దేశం. ప్రతి యేటా గుండెలనిండా సంతోషంతో, కన్నుల పండువగా మనమంతా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. కానీ స్వాతంత్య్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అనేక మంది త్యాగధనులను మర్చిపోతున్నాం. హిందూ, ముస్లిం మత భేదాలు పక్కనబెట్టి తెల్ల దొరలను ప్రజలంతా సమైక్యంగా ప్రతిఘటించిన చరిత్ర మనది. స్వాతంత్య్ర కాంక్షకు బీజంవేసి, స్వాతంత్య్ర సమరానికి నాంది పలికి, దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని పక్కకు నెట్టి, ఈ ఘనతంతా కేవలం కొందరిదే అన్నట్టుగా కొన్ని శక్తులు ఒక ప్రణాళికాబద్ద ప్రచారం చేస్తూ వస్తున్నాయి. నిజానికిది అందరూ కలసి సాధించుకున్న సమిష్టి విజయం.
1757లో బెంగాల్ పాలకుడైన నవాబ్ సిరాజుద్దౌలా బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడాడు. కాని విచారకరమైన విషయం ఏమిటంటే, మీర్ జాఫర్ ఈ స్వతంత్ర పోరాటయోధుడికి ద్రోహం తలపెట్టి ఆంగ్లేయులతో చేతులు కలిపాడు. ద్రోహపూరితమైన కుట్ర ఫలితంగా సిరాజుద్దౌలా అమరుడయ్యాడు. తరువాత ఆంగ్లమూక మైసూరుపై దృష్టిపెట్టింది. మైసూరును వశం చేసుకోవాలని మాయోపాయాలు పన్నింది. అప్పటి మైసూరు పాలకుడు సయ్యద్ హైదర్ అలీ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఆంగ్లబలగాలను అడ్డుకున్నాడు. ఈయన మరణం తరువాత, అతని కుమారుడు, వీరశూర పరాక్రమవంతుడైన టిప్పు సుల్తాన్ 1799లో చెల్లాచెదురైన ముత్యాలను ఒకేదారంలో దండగుచ్చే ప్రయత్నం చేశాడు. స్వదేశీ పాలకులందరికీ లేఖలు రాస్తూ, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తనతో కలసిరావాలని పిలుపునిచ్చాడు. 'వారుగనక టిప్పు మాటను గౌరవించి ఉంటే మేము ఈనాడు భారతదేశంలో పాలకులుగా ఉండేవాళ్లమే కాదు' అని స్వయంగా బ్రిటీష్ అధికారులే ప్రకటించారు. ఆంగ్లమూకలకు సింహ స్వప్నమై నిలిచిన మైసూరు పులి ఆంగ్ల బలగాలతో అరివీరభయంకరుడిగా పోరాడుతూ అమరుడయ్యాడు. టిప్పుసుల్తాన్ మృతదేహాన్ని స్వయంగా చూసి, అమరుడయ్యాడని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే ఆంగ్ల అధికారి జనరల్ హారీ 'ఈరోజునుండి భారతదేశం మాది' అని ప్రకటించే సాహసం చేశాడంటే టిప్పు తెల్లవాడిగుండెల్లో ఏవిధంగా రైళ్లు పరిగెత్తించాడో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ బలగాలతో వీరోచితంగా పోరాడుతూ, రణరంగంలోనే దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుడిగా టిప్పూ చరిత్ర అజరామరంగా నిలిచిపోయింది. 1817లో సయ్యద్ అహ్మద్ షహీద్ (రహ్మ), అల్లామా ఇస్మాయీల్ షహీద్లు దేశానికి బానిస సంకెళ్లనుండి విముక్తి కల్పించడానికి కంకణబద్దులయ్యారు. ఈ యోధులిద్దరూ దేశ స్వాతంత్య్రం కోసం, ఆంగ్లమూకల బానిసత్వం నుండి దేశానికి విముక్తి కల్పించడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతూ 1831లో బాలాకోట్ అనే ప్రాంతంలో అమరులయ్యారు. స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతూ స్వేచ్ఛా పతాకను చేబూని అగ్రభాగంలో నిలిచినవారిలో మౌలానా ఇనాయతుల్లాహ్ సాదిక్ పూర్, మౌలానా ఖాసిం నానోత్లు అగ్రగణ్యులు. ఈ త్యాగధనులు రగిలించిన స్ఫూర్తితో సాదిక్ పూర్ వీధులు దేశ ప్రేమికులైన అమరవీరుల రుధిరంతో ఎరుపెక్కాయి. చివరికి 1857లోనే ఈస్వాతంత్య్ర సమర యోధులు అమరులయ్యారు.
ఆ తరువాత ఈ మహత్తర ఉద్యమ బాధ్యతను మౌలానా అబ్దుల్లాహ్ కసూరి భుజాలకెత్తుకొని 40 ఏండ్లపాటు అనుపమానమైన రీతిలో బలోపేతం చేస్తూ ముందుకు నడిపించారు. 1885లో మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశం కొంతమంది మేధావులు, ఆలోచనాపరుల ఆధ్వర్యంలో జరిగింది. తరువాత నాల్గవ సమావేశం 1887లో సయ్యద్ బద్రుద్దీన్ తయ్యబ్ జీ అధ్యక్షతన మద్రాసులో జరిగింది. ఆనాటి కాంగ్రెస్ ప్రముఖుల్లో జౌహర్ అలీ, షౌకత్ అలీ (అలీ బ్రదర్స్) హస్రత్ మొహానీ, డా.రఫీఅహ్మద్ కిద్వారు మౌలానా సయ్యద్ హుసైన్ అహ్మద్ మదనీ, మౌలానా అబుల్ ఖాసిం సైఫ్ బనారసీ మొదలగువారు ముఖ్యులు. ఈవిధంగా అనేకమంది భారతీయ ముస్లింలు తమ దేశస్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో నిరంతరం పోరాడుతూ, దేశ మాత బానిస సంకెళ్లను తునాతునకలు చేసేక్రమంలో తమ సర్వస్వాన్నీ త్యాగం చేయడానికి సంతోషంగా సిద్ధపడి, అసామాన్యమైన ఆదర్శాలను నెలకొల్పారు. బెంగాల్ మొదలు, కాశ్మీరు వరకు విస్తరించిన భూభాగమంతా వారి రుధిరంతో ఎరుపెక్కింది.
మనం చరిత్ర పుటల్ని పరిశీలిస్తే భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లింలు ఏ విధంగా ముందుండి పోరాడారో, ఆంగ్లమూకల ఫిరంగులకు, వారి తుపాకీ గుండ్లకు ఏ విధంగా తమ గుండెల్ని అడ్డుపెట్టి ప్రాణ త్యాగం చేశారో, ఉరికంబాలపైకి ఎలా ఎక్కించబడ్డారో, ఉరితాళ్లను పూలదండ లుగా ఎలా స్వీకరించారో మనకు అర్థమవుతుంది. దేశ స్వాతంత్య్రం కోసం ఉరితాడును ముద్దాడుతూ, భారతదేశ ముద్దుబిడ్డ, అమరజీవి అష్ఫాఖుల్లాహ్ ఖాన్ పలికిన మాటలు ఈ సందర్భంగా గమనార్హమైనవి. 'ఒకే ఒక్క కోరిక. అది తప్ప నాకు మరే కోరికా లేదు. నా కఫన్లో నా జన్మభూమి మట్టిని కాస్త ఉంచండి, అంతేచాలు' అన్నాడా దేశభక్తుడు. ఈ దేశాన్ని, ఈ మట్టిని ముస్లింలు ఎంతగా ప్రేమిస్తారో తెలుసుకోడానికి ఇదో చిన్న ఉదాహరణ. నిజానికి ముస్లింలు కూడా దేశస్వాతంత్య్రం కోసం అనుపమానమైన, అసాధారణ పాత్రను పోషించారు. దేశం కోసం పోరాడారు. ఇల్లు, వాకిళ్లు వదిలిపెట్టారు. దేశ బహిష్కారం గావించబడ్డారు. చెరసాలల పాలయ్యారు. ఉరికంబాలపైకి ఎక్కించబడ్డారు. చీకటి గుయ్యారాల్లో నిర్బంధించబడ్డారు. 'కాలాపానీ' లాంటి భయంకరమైన శిక్షలు చవిచూశారు. రకరకాలుగా హింసించబడ్డారు. కుటుంబాలను, అసంఖ్యాక మంది బంధుమిత్రుల్ని త్యాగం చేశారు. ఈ విధంగా తమ సర్వస్వాన్నీ తృణ ప్రాయంగా ధారపోసిన ఫలితంగా ఎట్టకేలకు స్వాతంత్య్రం లభించింది. దేశం ఆంగ్లేయుల బానిసత్వం నుండి విముక్తి పొందింది. అమరవీరుల త్యాగాలు ఫలించి, వారి కలలు సాకారమయ్యాయి.
దేశాన్ని బానిస బంధనాల నుండి విముక్తి కల్పించే ఈ మహత్ పోరాటంలో అనేకమంది ముస్లిం మహిళలు కూడా అనుపమాన త్యాగాలు చేశారు. బేగం హజ్రత్ మహల్, ఆబాదీబానో, బేగం అజీజున్, ముందర్, హమీదాబేగం, బేగం రహీమా, బేగం హబీబా, బేగం అజీజున్, అజ్గరీబేగం లాంటి ఎందరో వీరవనితలు తమ జీవితాలను ధారపోశారు. బ్రిటిష్ ముష్కరుల కబంధ హస్తాలనుండి దేశాన్ని రక్షించడానికి కదనరంగంలోకి దూకిన ధీరవనిత బేగం హజ్రత్ మహల్. స్వయంగా ఏనుగు అంబారీపై స్వారీ చేస్తూ, యుద్ధరంగంలో ఆంగ్లేయులపై శివంగిలా విరుచుకు పడిన వీరనారి. పాతికేండ్ల పడుచు ప్రాయంలోనే ఇద్దరు బిడ్డలను కలిగి, భర్త మరణించినా పునర్వివాహం చేసుకోకుండా భారతమాత సంకెళ్లు తెంచడా నికి దేశసేవకు అంకితమైన మహిళ ఆబాదీబానూ. తన ఇద్దరు కొడుకులకూ ఉగ్గుపాలతోనే విప్లవభావాలు రంగరించి పోసి సమర రంగానికి పంపిన ధీశాలి ఆమె. మౌలానా ముహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీల మాతృ మూర్తి. ఈ అలీ సోదరులు ఆబాదీబాను ముద్దు బిడ్డలే కాదు, భారతమాత ముద్దుబిడ్డలు కూడా. స్వాతంత్య్రోద్యమంలో ఈ ఇద్దరు అలీల పాత్ర అజరామరం. ఉద్యమ ప్రస్థానంలో మహాత్మాగాంధీ ఆబాదీబానూను అనేకసార్లు కలుసుకున్నారు. గాంధీజీ ఆమెను అమ్మా అని పిలిచేవారు. ఉద్యమానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా ఆమె గాంధీజీకి అందించేవారు. స్వయంగా గాంధీజీయే ఆమెను అమ్మా అని సంబో ధించడంతో ప్రజలంతా ఆమెను అమ్మా అని పిలిచుకునేవారు. దీంతో ఆమె బీబీ అమ్మాన్గా ప్రసిద్ధిగాంచారు. వయసు మీదపడినా, అనారోగ్యం వేధించినా ఆమె స్వాతంత్య్ర పోరాటం నుండి వీసమెత్తు కూడా వెనక్కి తగ్గలేదు. 'హోమ్ రూల్' ఉద్యమంలో ఈమె కీలకపాత్ర పోషించారు. ఆబాదీబాను పోరాట పటిమను, మొక్కవోని ధైర్యసా హసాలను చూసి ఆంగ్లేయులు ఈమె చాలా ప్రమాదకరమైన మహిళ అని ప్రకటించారు. కాని ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, దేశ స్వాతం త్య్రం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసి, ఇన్ని త్యాగాలు చేసిన ముస్లింల ను ఈనాడు అనుమానితులుగా కొన్ని శక్తులు చూపుతున్నాయి. సొంతగడ్డపైనే పరాయి వారుగా పరిగణించబడుతున్నారు. దేశద్రోహ ముద్ర వారి తలపై కత్తిలా వేలాడుతోంది. స్వతంత్ర భారతావనిలో వారి హక్కులు అతి దారుణంగా హరించబడుతున్నాయి. విదేశీయులనీ, విదేశీ ఏజెంట్లనీ నిందించబడుతున్నారు. వారిని దేశం విడిచి వెళ్లమని కూడా బెదిరిస్తున్నారు. ప్రాణాలను ధారపోసి సాధించుకున్న స్వతంత్ర స్వేచ్ఛా భారతంలో, స్వాతంత్య్రోద్యమంతో నామమాత్రపు సంబంధం కూడా లేని 'పరివార్' శక్తులు ముస్లింల దేశభక్తిని శంకించడం అతి పెద్ద విషాదం. కనీసం ముందు తరాలకైనా వాస్తవ చరిత్రను పరిచయం చేయడం ఇప్పుడు మనముందున్న కర్తవ్యం.
mdokhan645@gmail.com
Authorization