యం.వి.రమణ
మొఘల్ చక్రవర్తుల పాలనలో రాజ్యాధికారం కోసం కుట్రలు, హత్యలు, అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్న తరుణంలో గ్రామాధికారులుగా ఉన్న పౌజుదార్లు, అధికారులు ప్రజలను ఎన్నో విధాలుగా పీడించేవారు. ఈ ప్రాంతంలో అణగారిన వర్గాల జీవనం దుర్భరంగా మారింది. పన్నులు, వెట్టి చాకిరీ విధానంతో అణగారిన వర్గాల శ్రమదోపిడీ నిరంతరం సాగుతూ వచ్చింది. ఈ పరిణామాలన్ని పాపన్నపై ప్రభావం చూపాయి. తన కుటుంబ జీవన విధానం, ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు పాపన్నను రాజ్యకాంక్షవైపు నెట్టి వేశాయి. తన దోస్తులైన చాకలి సర్వన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు దూదేకుల పీరు, కోత్వాల్ మీరు సాహెబ్ వంటి ప్రధాన అనుచరులతో సమాలోచనలు చేశాడు. సమరానికి పూనుకున్నాడు. తన తల్లి దాచిన సొమ్ముతో ఆయుధాలను సమకూర్చుకున్నాడు. తన సైన్యాన్ని పెంచుకోవడానికి ధనవంతుల దగ్గర ఉన్న ధనాన్ని కొల్లగొట్టి రాజ్యవిస్తరణ గావించాడు. తాటికొండ నుంచి ప్రారంభమైన పాపన్న ప్రస్థానం ఖిల్లాషాపురం కోటను కేంద్రంగా చేసుకుని తెలంగాణ అంతా విస్తరించాడు. 30 ఏండ్లపాటు పాలన కొనసాగించాడు. 1675లో సర్వాయిపేట గ్రామాన్ని నెలకొల్పాడు. 12 మందితో ప్రారంభమైన తన సైన్యాన్ని 12 వేలకు పెంచుకున్నాడు. 1708లో వరంగల్ కోటను, భువనగిరి కోటలను ఆక్రమించి గోల్కొండ కోటను జయించాడు. ఇది సహించలేని మొగలులు తిరిగి వేలాది సైన్యంతో గోల్కొండకు వచ్చి యుద్ధం చేస్తున్న క్రమంలో పాపన్న వాళ్లని ఎదుర్కోలేకపోయాడు. శత్రువుల చేతికి చిక్కి చనిపోవడంకంటే హీనం మరొకటి ఉండదని భావించిన పాపన్న తన చేతిలోని బళ్లేన్ని తన బలమంతా ప్రయోగించి ఆకాశంపైకి విసిరి తన ఎదను చూపించాడు. బళ్లెం గుండెలో గుచ్చుకొని ప్రాణాలు వదిలాడు. పాపన్న పులిబిడ్డ కాబట్టి శత్రువు చేతికి చిక్కకుండా వీరమరణం చెందాడని ముగింపునిచ్చారు జానపదులు.
సర్వాయి పాపన్న అతి సామాన్యమైన గీత కార్మిక కుటుంబంలో పుట్టాడు. కల్లుగీసే కత్తిని పక్కకు పెట్టి ఖడ్గం చేత బట్టి ఏకంగా మొగల్ రాజుల ఏలుబడిలో ఉన్న గోల్కొండపై యుద్ధభేరి మోగించాడు. క్షత్రీయుడే కత్తి పట్టాలనే సూత్రాన్ని ఈ యోధుడు మార్చాడు. 16వ శతాబ్ధంలోనే రాజ్యాన్ని స్థాపించి చూపించాడు. కుల, మతాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాట పటిమతోపాటు లౌకిక, సమానత్వ చైతన్యాన్ని ప్రదర్శించాడు.
జానపదుల కథల్లో సర్వాయి పాపన్న చరిత్ర బహుళ ప్రచారంలో ఉన్నది. బుడగ జంగాలు, శారద కథల వాళ్లు ఇతర జానపదులు పాపన్న చరిత్రను కథలు, పాటల రూపంలో వినిపిస్తున్నారు. వీరి నోటినుంచి వెలువడే కథల ఆధారంగానే పాపన్న చరిత్ర వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతంలో ఒక బోయవాడి పాట ఆధారంగా ప్రముఖ జానపద పరిశోధకుడు ఏజే బోయల్ ద్వారా పాపన్న చరిత్ర ప్రాచుర్యం పొందింది. అనేకమంది పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేసి ఆధారాలను సేకరించారు. లండన్లోని విక్టోరియా - అల్బర్ట్ మ్యూజియంలో సర్వాయి పాపన్న ఒక చేతిలో రామచిలుక, మరో చేతిలో పొడువాటి బల్లెంతో సేదతీరుతున్న చిత్రం ప్రరర్శిస్తున్నారు. లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ రిచార్డ్ ఎం.ఈటన్ రాసిన 'ఎ సోషల్ హిస్టరి ఆఫ్ ద దక్కన్ ఎట్ ఇండియన్ లీవ్స్' అనే పుస్తకం కవర్పేజిపై పాపన్న చిత్రాన్ని ప్రచురించారు.
మొఘల్ చక్రవర్తులు ఆనాడు తెలంగాణలో జరిగిన పోరాటాల గురించి పరిశోధన చేసి తీసుకురమ్మని ఇనామత్ జంగ్ని ఇక్కడకు పంపారు. ఆయన ఇక్కడివన్ని రికార్డు చేసి వారికి సమర్పించారు. ఇప్పుడవి నేషనల్ ఆర్కమ్స్లో ఉన్నాయి. వీటిని ఇనామత్ జంగ్ కలెక్షన్స్గా పిలువబడుతున్నాయి. దీనిలో పాపన్న విప్లవకారుడిగా, సమాజాన్ని ప్రభావితం చేసేవాడుగా, మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వాడిగా చెప్పబడింది. నిజంగా వీరుడే. లేకపోతే తొలి చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ, జానపద పరిశోధకుడు బిరుదురాజు రామరాజు, ప్రఖ్యాత శాసన పరిశోధకుడు బి.ఎన్.శాస్త్రి, పాశ్చాత్య పరిశోధకుడు జె.ఎ.బోయల్ కీర్తించేవారే కాదు. సర్వాయి పాపన్న నిర్మించిన, ఆక్రమించిన కోటలు సర్వాయిపేట, తాటికొండ, ఖిలాషాపురం, ఓరుగల్లు కోట, భువనగిరి కోట లాంటివి నేటికీ సజీవ సాక్ష్యాలుగా మన కండ్ల ముందున్నాయి.
కాకతీయుల పాలన అంతమైన 300 ఏండ్ల తర్వాత క్రీ.శ.1650 నుంచి 1709 వరకు పాపన్న ప్రస్థానం కొనసాగింది. నాటి నైజం ప్రాంత పరిపాలనలోని కర్ణాటక ప్రాంతం బెల్గాంలో పాపన్న 1650లో జన్మించాడు. తల్లి సర్వాయమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుతం జనగామ జిల్లా) స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ వాసి. ఈమెకు బెల్గాం ప్రాంత వాసితో పెండ్లి జరిగింది. పాపన్న బాల్యమంతా బెల్గాంలోనే గడిచింది. పాపన్నకు పదిహేడేండ్లు వచ్చేసరికి తండ్రి హత్యకు గురయ్యాడు. అక్కడి పరిస్థితులు బాగాలేక సర్వాయమ్మ తన కొడుకు పాపన్నను తీసుకుని పుట్టినిల్లు తాటికొండకు చేరుకుంది. బతుకుదెరువు కోసం పాపన్న పశువులనుగాస్తూ, కల్లుగీస్తూ ఉండేవాడు.
మొఘల్ చక్రవర్తుల పాలనలో రాజ్యాధికారం కోసం కుట్రలు, హత్యలు, అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్న తరుణంలో గ్రామాధికారులుగా ఉన్న పౌజుదార్లు, అధికారులు ప్రజలను ఎన్నో విధాలుగా పీడించేవారు. ఈ ప్రాంతంలో అణగారిన వర్గాల జీవనం దుర్భరంగా మారింది. పన్నులు, వెట్టి చాకిరీ విధానంతో అణగారిన వర్గాల శ్రమదోపిడీ నిరంతరం సాగుతూ వచ్చింది. ఈ పరిణామాలన్ని పాపన్నపై ప్రభావం చూపాయి. తన కుటుంబ జీవన విధానం, ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు పాపన్నను రాజ్యకాంక్షవైపు నెట్టి వేశాయి. తన దోస్తులైన చాకలి సర్వన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమా ళ్లు దూదేకుల పీరు, కోత్వాల్ మీరు సాహెబ్ వంటి ప్రధాన అనుచరులతో సమాలోచనలు చేశాడు. సమరానికి పూనుకున్నాడు. తన తల్లి దాచిన సొమ్ముతో ఆయుధాలను సమకూర్చుకున్నాడు. తన సైన్యాన్ని పెంచుకోవడానికి ధనవంతుల దగ్గర ఉన్న ధనాన్ని కొల్లగొట్టి రాజ్యవిస్తరణ గావించాడు. తాటికొండ నుంచి ప్రారంభమైన పాపన్న ప్రస్థానం ఖిల్లాషాపురం కోటను కేంద్రంగా చేసుకుని తెలంగాణ అంతా విస్తరించాడు. 30 ఏండ్లపాటు పాలన కొనసాగించాడు. 1675లో సర్వాయిపేట గ్రామాన్ని నెలకొల్పాడు. 12 మందితో ప్రారంభమైన తన సైన్యాన్ని 12 వేలకు పెంచుకున్నాడు. 1708లో వరంగల్ కోటను భువనగిరి కోటలను ఆక్రమించి గోల్కొండ కోటను జయించాడు. ఇది సహించలేని మొగలులు తిరిగి వేలాది సైన్యంతో గోల్కొండకు వచ్చి యుద్ధం చేస్తున్న క్రమంలో పాపన్న వాళ్లని ఎదుర్కోలేకపోయా డు. శత్రువుల చేతికి చిక్కి చనిపోవడంకంటే హీనం మరొకటి ఉండదని భావించి న పాపన్న తన చేతిలోని బళ్లేన్ని తన బలమంతా ప్రయోగించి ఆకాశంపైకి విసిరి తన ఎదను చూపిం చాడు బళ్లెం గుండెలో గుచ్చుకొని ప్రాణాలు వదిలాడు. పాపన్న పులిబిడ్డ కాబట్టి శత్రువు చేతికి చిక్కకుండా వీర మరణం చెందాడని ముగింపునిచ్చారు జానపదులు.
సర్వాయి పాపన్నగా మారిన క్రమం...
పాపన్న తన తల్లి సర్వాయమ్మను హింసించే వాడనే అపవాదు వైరి వర్గాలు రాసే చరిత్రలో ఉంది. కాని వాస్తవాలను గమనిస్తే తన తల్లి పేరున సర్వాయిపేట గ్రామాన్ని నెలకొల్పాడు. ఇది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి పంచాయతీ పరిధిలో ఉంది. ఇక్కడ బురుజు, సర్వాయి చెరువు, గుట్టలపై ఎత్తైన కోట దానిపైన కోనేరు, బయ్యన్న విగ్రహం, పాపన్న పచ్చీస్ ఆడిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తల్లిపై ఎంతో ప్రేమ, గౌరవం కలిగివుండటం వల్లనే ఆమె పేరుతో ఊరుని, చెరువుని నిర్మాణం చేశాడు. తన పేరుకు ముందు తల్లి పేరు పెట్టుకుని సర్వాయి పాపన్నగా మారాడు. జానపద గాధలో మరో కథనం కూడా ఉంది. సైన్యాధ్యక్షుడు సర్వాయి అనే తన మిత్రుడు శత్రువుల దాడిలో మరణించడం వలన తన సహచరుని ఙ్ఞాపకాలలో భాగంగా సర్వాయి పాపన్నగా మారాడు. ఈ కథనాల్లో తన ఇంటి పేరును తొలగించుకొని తల్లి పేరు, మిత్రునిపేరు పెట్టుకున్నాడు తప్ప కులం పేరు పెట్టుకున్నట్టు జానపదుల గాదల్లో, రచనల్లో ఎక్కడా కనిపించదు. దీనిలో పాపన్నలోని మానవీయ కోణం, సామాజిక చైతన్యం అవగతమవుతుంది.
భువనగిరి, కొలనుపాక, ఆలేరు, జనగామ ప్రాంతాలలో మొగలు అనుయాయులను తురుక సర్దార్లని పిలిచేవారు. మొగల్ ప్రభుత్వానికి గ్రామాలలో ప్రతినిధులుగా చెలామని అవుతూ అట్టడుగు వర్గాలవారిని ముఖ్యంగా చేతివృత్తిదారులను అనేక ఇక్కట్లకు గురిచేసేవారు. వీరి ఆగడాలను ఎదిరిస్తూ మొదట కొలనుపాకలోని బలమైన తురుక సర్దార్లపై దాడి చేయగా కొంతమంది చనిపోయారు. మరికొంతమంది అక్కడినుండి పారిపోయారు. చక్రవర్తుల అనుయాయులపెనేౖ దాడి చేయడం వలన అక్కడి ప్రజలు పాపన్నకు జేజేలు పలికారు. అప్పటి నుండి ప్రజల నోట సర్దార్ పాపన్నగా పేరొందాడు.
ఇంతటి గొప్ప వీరుని చరిత్రను వెలికితీసి నేటి తరానికి అందించేందుకు చొరవచూపాలి. అందుకు ప్రభుత్వం, పరిశోధకులు పూనుకోవాలి. ప్రభుత్వం అధికారికంగా పాపన్న చరిత్రకు పట్టం కడుతూ నవతరానికి ఆయన చరిత్రను అందిస్తూ జయంతి సభలు జరపాల్సిన అవసరమున్నది. పాపన్న విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించి ఆయన నిర్మించిన కోటలు, ఆక్రమించిన కోటలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి పర్చాలి. కులవృత్తి చేసి కుంటుంబానికి పరిమితం కాకుండా రాజ్యాన్ని ఏలి సమాజం కోసం పనిచేసిన పాపన్న స్ఫూర్తితో నేటితరం ముందుకు సాగాలి. శ్రామికుల రాజ్య సాధనకు నడుం బిగించాలి. అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
సెల్ : 9490098485
Authorization