పి.నాగరాజురెడ్డి
గణతంత్ర, ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్య దేశం అన్నాక ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుంది. రాజ్యాంగంలో ఈ దేశ పౌరులందరికీ వాక్ స్వాతంత్య్ర స్వేచ్ఛను కల్పించారు. మాట్లాడే స్వేచ్ఛ అంటే అన్ని వర్గాల ప్రజలు కుల, ధన తారతమ్యం లేకుండా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కలిగి ఉండాలి. కానీ నేడు దేశంలో అణగారిన వర్గాలకు చెందిన దళిత, మైనార్టీలకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోతోంది. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన దళిత ప్రజాప్రతినిధులు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పం తంగి గ్రామంలో ఆగస్టు 24న గ్రామ సమస్యలపై చర్చించ డానికి గ్రామ సర్పంచ్ బాత రాజు సత్యం అధ్యక్షతన గ్రామస భ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెంది న ఎంపీటీసీ సభ్యురాలు బోయ ఇందిరా మాట్లాడుతూ గ్రా మంలో అనేక సమస్యలున్నాయని గ్రామ సభ దృష్టికి తీసు కెళ్లింది. హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి అంటూ జీఎంఆర్ సంస్థ వారి వాటర్ ట్యాంకర్తో సర్పంచ్ సత్యం ఒక్కరోజు గంటసేపు నీళ్లు పోసి ఫొటో దిగి మిగతా రో జులు పోయకపోవడం ఏమి టని ప్రశ్నించారు. ఇది విన్న గ్రామ సర్పంచ్ 'మీరు హరి తహారం చేసినప్పుడు సమా చారం ఇచ్చారా?' అని నిలదీ శారు. స్పందించిన ఎంపీటీసీ సభ్యురాలు గ్రామ కార్యదర్శికి ఆ కార్యక్రమాన్ని చెప్పామని అయినా ఆ కార్యక్రమానికి రాలేదని తెలిపారు. ఇంతలోనే ఎంపీటీసీ సభ్యురాలు భర్త సంజీవ మాట్లాడుతూ గ్రామం లోని రైతులు కాలుష్యం వల్ల పంటలు పండించులేకపో తున్నారు. కంపెనీల కాలుష్యం ఎక్కువైంది. అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోసే విధంగా చూడాలని కోరారు. దీనికి సర్పంచ్ 'మీ సలహాలు అవసరం లేదని' ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే 'మీ గ్రామ అభివృద్ధి కో సం సలహాలు ఇస్తున్న వ్యక్తులపై అలా మాట్లాడటం తగదని' ఎంపీటీసీ సభ్యురాలు అన్నారు. ఈ మాటకు వెంటనే అ సహనం వ్యక్తం చేస్తూ 'ఏంది ఎప్పుడు మీ మాదిగోళ్ల గోల ఇదేనా' అంటూ సమావేశం ముగిసినట్లే అన్ని గ్రామ పంచా యతీ కార్యదర్శి శ్రీనివాస్కు చెప్పి గ్రామ పంచాయతీ కార్యా లయానికి వెళ్లారు. అసహనంతో వెళ్లిన సర్పంచ్, దళితుల మధ్య చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో దళిత ఉపసర్పంచ్ అయిన లింగస్వామిని పురమాయించి ఎంపీటీసీ సభ్యురా లిపై దాడి చేయించే ప్రయత్నం చేశారు. అసభ్య పదజాలం తో దుర్భాషలాడాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న దళిత యువకులు దళిత మహిళను అవమానపరచడం తగదని నిరసన వ్యక్తం చేశారు. దీంతో దళిత యువకులతో కలిసి ఎంపీటీసీ ఇందిరా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. దళితులను మాట్లాడని వ్వకపోవడం దారుణమని, ఒక ప్రజాప్రతినిధిగా గ్రామ సమస్యలపై మాట్లాడుతుండగానే చర్చించకుండా మధ్యలోనే సమావేశం ముగిసినట్టు ప్రకటించి అవమానపరచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
తమకు జరిగిన అవమానంపై చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో ఎంపీటీసీ ఇందిరా సర్పంచ్, తదితరులపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సర్పంచ్ బాత రాజు సత్యం, పంచాయతీ కార్యదర్శి దాచేపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ బోయ లింగస్వామిలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
సర్పంచ్పై గతంలోనూ..
గ్రామ సర్పంచ్ గాక ముందు కూడా సత్యంపై ఎస్సీ, ఎస్టీ కేసు చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో నమోదైంది. పంతంగి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఒక వర్గం యువతను రెచ్చగొట్టి దళిత యువతపై దాడులు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో దళిత యువకులకు గాయాలయ్యాయి. గాయపడ్డ యువకుల ఫిర్యాదు మేరకు బాత రాజు సత్యం అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.
సెల్ : 9491595579
దళిత మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా...?
మహిళా ప్రజాప్రతినిధినని కూడా చూడకుండా గ్రామస భలో దళితులను అవమానించడం దారుణం. గతంలోనూ బాత రాజు సత్యం దళితులపై దుర్భాషలాడారు. దాడులు చే యించారు. నేను గ్రామ సమస్యలపై మాట్లాడేందుకు మాత్ర మే గ్రామ సభకు వెళ్లాను. ఇక గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గాని, గ్రామ పంచాయతీ సమావేశాలకు కానీ సమాచారం ఇవ్వడం లేదు. ఒకవేళ సమాచారం ఇచ్చిన గ్రామ కరోబార్తో ఫోన్ చేయిస్తారు. కేవలం దళితురాలిననే ఇలాంటి చిన్నచూపు చూస్తున్నారు. దళితులను అవమానపరిచిన వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.
- బోయ ఇందిర, ఎంపీటీసీ
దళితులను అవమానిస్తే ఉపేక్షించేది లేదు
దళితుల పట్ల అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. పంతంగి ఎంపీటీసీ సభ్యురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను విచారిస్తున్నాము. ఆ రోజు సంఘటన జరిగిన తీరుపై అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నాము. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి, బాధితులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం...
- పి.సత్తయ్య, చౌటుప్పల్ ఏసీపీ
సర్పంచ్ పదవి నుండి తొలగించాలి
ఎంపీటీసీ బోయ ఇందిరను అవమానప రిచిన సర్పంచ్ సత్యంను పదవి నుంచి తొలగించాలి. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు ఎక్కువయ్యాయి. అందులో భాగంగానే దళిత మహిళా ఎంపీటీసీపై దాడి చేయించే ప్రయత్నం చేశారు. మహిళ అని చూడకుండా అవమానపరిచే పద్ధతిలో ప్రవర్తించడం సిగ్గుచేటు. కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి.
- సిర్పంగి స్వామి, కేవీపీఎస్ యాదాద్రి జిల్లా కార్యదర్శి
Authorization