గ్రామ, సంఘ పెద్దల ఏకపక్ష తప్పుడు నిర్ణ యాలు ఇప్పటికీ కుటుంబాలలో కుల చి చ్చు రేపుతున్నాయి. అమాయక కుటుంబాలు వారి తీ ర్పులకు బలవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో ఇంకా కుల దురహంకారం మాయని మచ్చలా మారుతోంది. నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కొరిటికల్ గ్రామంలో ఓ కుటుంబం ఆధిపత్యకులస్తుల ఆగ్రహానికి బలైంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం మెండోరా గ్రామం నుండి 34 ఏండ్ల క్రితం కొరిటికల్ గ్రామానికి రెడ్డి కులస్తుడైన నోముల శంకర్ వచ్చి స్థిరపడ్డాడు. వ్యవ సాయాన్నే నమ్ముకున్న శంకర్ ఎంతో కష్టపడి గ్రామంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఆయనకు భార్య రత్నవ్వ, ఇద్దరు కూమర్తెలు, కొడుకు ఉన్నారు. కొన్నేండ్ల క్రితం ఇద్దరు కూతుళ్ల వివాహం జరి పించాడు. తన పని తాను చేసుకుంటూ గ్రామంలోనే ఎంతో వినయంగా ఉంటూ బతుకుతున్నాడు. అయితే అదే గ్రామంలో 45 రెడ్డి కుటుంబాలు ఉండడంతో ఆ గ్రామంలో ఎక్కువ శాతం ఆ వర్గానికి చెందిన పెద్దలు చెప్పిందే అక్కడ నడుస్తుంది. కుల సంఘంలోని పలు కార్యకలాపాల్లో నోముల శంకర్ ఆసక్తి చూపకపోవ డంతో కుల పెద్దలు శంకర్పై కక్ష పెంచుకున్నారు. ఎలా గైనా శంకర్ను తప్పులో ఇరికించాలని వేచి చూడసా గారు. దీంతో ఆ కుల సంఘంలోని ఓ కుల పెద్ద ఏలేటి చిన్న లింగారెడ్డి వద్ద ఒప్పందం ప్రకారం పని చేస్తున్న ఓ దళిత మహిళ బర్కుంట రాజవ్వ రెండు నెలల క్రితం శంకర్ పొలంలోకి కూలిపనికి వెళ్లింది. దీన్ని గుర్తించిన కుల పెద్దలు ఒకరి వద్ద ఒప్పందం ప్రకారం పనిలో కొనసాగుతున్న వారిని నోముల శంకర్ ఎలా పనిలోకి తీసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు దళిత మహిళ బర్కుంట రాజవ్వకు రూ.లక్ష, పనిలోకి తీసుకు న్నందుకు శంకర్కు రూ.లక్ష జరిమానా విధించారు. దళిత మహిళ తాను లక్ష రూపాయలు అప్పు లేనని, తనకు అంత డబ్బులు చెల్లించే స్థోమత లేదని దళిత సంఘాలను ఆశ్రయించింది. వారి విన్నపం మేరకు రెడ్డి కులస్తులు ఆమెకు సంబంధించిన జరిమానా కూడా శంకర్ చెల్లించాలని, ఇందుకు రూ.2లక్షల జరిమానా శంకర్ చెల్లించాలని పంచాయితీలో తీర్పుచెప్పారు.
కట్టనందుకు కులం నుండి వెలివేత...
తన తప్పేమీ లేదని అన్యాయంగా జరిమానా విధిస్తే కట్టేది లేదని శంకర్ కుల సంఘాల పెద్దల తప్పుడు నిర్ణయాన్ని ప్రశ్నించాడు. కుల పెద్దలు సంఘ నిర్ణయాన్ని ధిక్కరించాడని శంకర్ కుటుంబాన్ని సంఘం నుండి బహిష్కరించారు. ఆ గ్రామంలోని ఆ కులానికి చెందిన వారు శంకర్ కుటుంబంతో మాట్లావద్దని, వారికి పనుల్లో సహకరించొద్దని షరతు పెట్టారు. ఎవరైనా మాట్లాడినా, సహకరించినా వారికి రూ.3లక్ష లు జరిమానా విధిస్తామని ఆంక్షలు విధించారు. దీంతో ఆ గ్రామంలో ఉన్న కులస్తులు రెండు నెలలుగా శంకర్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు శంకర్ దగ్గర ఉన్న ట్రాక్టర్తో వీరి పొలాలను గతంలో పనికి తీసుకెళ్లిన వారు రూ.40వేలు ఇవ్వాల్సి ఉన్నా వారు ఇవ్వడం లేదు. అంతేకాకుండా చివరికి శంకర్కు తన చెల్లి రత్నవ్వను ఇచ్చినందుకు ఆదే గ్రామానికి చెందిన రాజారెడ్డి.. శంకర్ కుటుంబంతో బంధుత్వం కొనసాగిస్తున్నాడని, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని రాజారెడ్డిని కులసంఘం నాయకులు హెచ్చరించారు. గత్యంతరం లేక జులై 4న పలువురు కుల పెద్దలపై శంకర్తో పాటు తన కుమారుడు సుగుణాకర్రెడ్డి మామడ పీఎస్ పరిధిలో ఫిర్యాదు చేశారు.
న్యాయం చేయడంలో అధికారులు విఫలం
కుల సంఘంలోని పలువురి పెద్దలపై ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ శివ ప్రసాద్, సీఐ రమేష్బాబు, ఎస్ఐ ఆసిఫ్ ఆలీ ఆగస్టు 21న గ్రామంలో కుల పెద్దలు, బాధిత శంకర్ కుటుం బాన్ని పిలిచి విచారించారు. ఇరువైపులా వివరాలు తెలు సుకున్న అధికారులు కుల పెద్దల నిర్ణయం సరికాదని వెల్లడించారు. సదరు కుల పెద్దలు బాధిత కుటుంబ స భ్యులతో కలిసి ఉండాలని, అందుకు కొంత గడువు ఇస్తు న్నామని పేర్కొన్నారు. లేనిపక్షంలో తీవ్రంగా వ్యవహరిం చాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు.
మనోవేదనలో బాధిత కుటుంబం
కులం నుండి శంకర్ కుటుంబాన్ని వెలివేయడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురవుతు న్నారు. పండుగలకు, కులం వారితో కలువకుండా దూర ముండాల్సి రావడంతో వారు మానిసికక్షోభను అనుభవి స్తున్నారు. కుల సభ్యులతో పాటు గ్రామంలోని ఇతర వ్యక్తులు సైతం వీరికి సహకారం ఇవ్వరాదనే నిబంధన తో వ్యవసాయాన్నే నమ్ముకున్న శంకర్ కుటుంబం వ్యవ సాయ పనులకు గ్రామంలోని కూలీలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఎవరికీ అప్పులేం
నేను ఎవరి వద్ద అప్పు చేయలేదు. బతుకుదెరువు కోసం కూలి పనికి వెళ్తే పెద్దోళ్లు పంచాయితీ పెట్టి రూ.లక్ష జరిమానా విధించారు. నాకు అంత చెల్లించే స్థోమత లేదు. దీంతో పైసలు కట్టనని తేల్చిచెప్పా.
- బర్కుంట రాజవ్వ, కూలీ
మా కుటుంబానికి న్యాయం చేయాలి
నాకు తెలిసి ఎవరికి అ న్యాయం చేయలేదు. నా బ తుకు నేను బతుకుతున్నా. కు లపెద్దలు కక్ష గట్టి తప్పులో ఇ రికించి జరిమానా విధించారు. చెల్లించనందుకు కుల బహిష్కరణ చేశారు. గతం లో నాకు ఉన్న ట్రాక్టర్తో వారి పొలాలు దున్ని నా. వాటి డబ్బులు రూ.40వేలు కూడా ఇవ్వట్లే దు. అధికారులొచ్చి చెప్పినా న్యాయం జరగడం లేదు. నా కుటుంబానికి న్యాయం చేయాలి.
- నోముల శంకర్, బాధితుడు
- గుడిమల్ల మహేష్
సెల్:8309645959
Authorization