''నేను మానవిని మహా ఆది అవ్వను ముళ్లను విరిచినదాన్ని మొసళ్లను పట్టినదాన్ని కొండలు ఎక్కినదాన్ని కోనలు దాటినదాన్ని అమాస మబ్బున అడివి షికారు చేసినదాన్ని రాతి కత్తితో కట్టె ఈటెతో ఇనుప బరిసెతో రాజ్యం చేసినదానను నేను మానవిని మహా ఆది అవ్వను కళ్లతో ఉరిమినదాన్ని కేకల పిడుగులైనదాన్ని అంబరాన్ని కప్పుకున్నదిగంబరిని ఋతువుల్ని చుట్టుకు
తిరిగినదాన్ని అరణ్యాలను విహార వనాలుగా పర్వతాలను గులకరాళ్లుగా నదులను పిల్ల కల్వలుగా మలిచి, గెలిచిన శ్రమ నాది నేను మానవిని మహా ఆది అవ్వను సూర్యుణ్ణి ఒక కన్నుగా చంద్రున్ని రెండో కన్నుగా తెలివిని మూడో కన్నుగా ధరించిన ముక్కంటిని ఒక చేత్తో పాడి పంటల్ని మరొక చేత్తో ఆయుధాల్ని పట్టుకు తిరిగినదాన్ని రాత్రీ పగలూ ఎరగని ప్రయాణాన్ని నదితో సంగమించిన సముద్రాన్ని నేను మానవిని మహా ఆది అవ్వను
చూపులతో శాసించినదాన్ని మునివేళ్లతో ఛేదించినదాన్నిఅవయవాలను ఆయుధాలుగా మలిచినదాన్ని ఊపిర్లూది ఉగ్గుదాపి ఊయలలూపి తరాలను నడిపించినదాన్ని నాగరికతలకు పాదిని,పునాదిని నేను మానవిని మహా ఆది అవ్వను మూడో కంటిని పీకడం మానాలను దోయడంమగతనమా?జంతు కామాలు,నెత్తుటి దాహాలూ వాడివే, మగవారివే స్వేచ్ఛా సంచారం స్త్రీలకు నిషిద్దమైన చోట స్వేచ్ఛా మకుటధారిని సంకల్ప నిశిరాత్రిని నేను మానవిని మహా ఆది అవ్వను సౌహార్ద్రత లేని మృగాళ్లు మానవత్వాన్నీ, ప్రేమతత్వాన్నీ నడి రోడ్లమీద పారేసుకున్నారు ఇనుప గునపాలుగా మార్చేసుకున్నారు అయినా సరే నిర్భీతిగా ప్రతిఘటించాను ఆడబిడ్డలు ఫూలన్ దేవులవ్వాలని ప్రకటించాను అర్ధరాత్రి నా సొత్తే
ఆపరాత్రీ నా సొత్తే పోశవ్వను మైసవ్వను అంకవ్వను నేనే పొలిమేరల కాచే పోలేరిని నేనే
నేను మానవిని మహా ఆది అవ్వను స్వేచ్ఛ విహరిని కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ సామాజికోద్యమాల కార్యకర్త కృపాకర్ పొనుగోటి గారి 'నిర్భయ' కవిత ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. నిజంగా స్వతంత్రత అంటే ఏమిటి? అసలు ఎవరిది? ఎలా ఉంటది అని ఆలోచింపచేసింది. సమసమాజంలోని అసమాన తలను తట్టి లేపినట్టు ఉంది. ప్రతి సాధారణ స్త్రీ పక్షంలో నిలిచింది. ''నేను మానవిని మహా ఆది అవ్వను'', అంటూ ఎత్తుగడతో మొదలై ప్రకృతి అంతా తానై పంచభూతాలతో మమేకమై చివరికి సమస్త దేవతలు నేనే స్వేచ్ఛ విహారిని'' అంటూ మా నవిగా ఆది అవ్వగా నిర్భయగా స్త్రీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. స్త్రీ గళంతో ప్రతి చోటా నాదే అంటూ స్త్రీ స్వేచ్ఛ ఉద్యమిస్తున్నట్లుంది కవిగళం. సౌహర్ధత లేని ''మృగాలు'' అంటూ నేడు జరుగు తున్న ఛండాలను ఏరి పాడేసారు. పదం పదం ఆ కవికి సమాజం ఎడల జరుగు తున్న అన్యాయాల ఎడల, సమాజ రీతుల ఎడల ఉన్న సంపూర్ణ అవగాహనను అర్ధత్రను తెలియ జేస్తున్నాయి. స్త్రీ యొక్క ఱఅసవజ్ూష్ట్ర ఱఅఅa్వ సఅశీషశ్రీవసస్త్రవ ని సూచించేలా ''మూడో కన్నుగా ధరించిన ముక్కంటిని'' అంటారు కవి. అంతే కాక ఈ నా మూడో కన్ను పీకడం (మానం తీయడం) మగతనమారా? అని ప్రశ్నిస్తాడు కవి. కామదాహంతో మృగాళ్లై ఆకృ త్యాలు చేస్తున్న వారిని చీల్చి చెండాడారు. స్త్రీల కోసం, స్త్రీ స్వాతంత్య్రం కోసం పురుష గళం నుంచి పొగిలి వచ్చిన స్వేచ్ఛాగీతం ఇది. ఒక గొప్ప కవితను ఆవిష్కరించారు కృపాకర్!
- రమాదేవి కులకర్ణి
సెల్ : 8985613123
Authorization