ఈసారి మన దేశం నుంచి ఒక్క సినిమా కూడా ప్రదర్శనకు ఎంపిక కాకపోవడం గమనార్హం. గతేడాది నందితా దాస్ రూపొందించిన 'మంటో' చిత్రం అన్ సర్టెన్ రిగార్డ్ సెక్షన్లో ఎంపికైంది. అలాగే మనోజ్ బాజ్పాయి నటించిన 'బోంన్ల్సే' చిత్రం ప్రీమియర్ వేశారు. ధనుష్ నటించిన 'ది ఎక్స్టార్డినరీ ఆఫ్ ఫకీర్' పోస్టర్ని విడుదల చేశారు. అయితే ఈసారి కేవలం హీనాఖాన్ నటించిన తొలి చిత్రం 'లైన్స్' ఫస్ట్లుక్ని విడుదల చేశారు. బాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్ ఎన్నో వచ్చాయి. తెలుగులోనూ 'రంగస్థలం', 'మహానటి' లాంటి రికార్డ్స్ని బ్రేక్ చేసిన సినిమాలున్నా కేన్స్ వరకు వెళ్ళలేకపోయాయి. ఇదిలా ఉంటే, కోల్కతాకి చెందిన మహిళా కెమెరామెన్ మోధురా పాలిత్కి పియరే యంగ్ నెక్స్ అవార్డు దక్కింది. ప్రముఖ కెమెరామెన్లు రాజీవ్ మీనన్, నటుడు అమీరా కాసర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డునందుకున్నారు. సినిమాలు కాకుండా బాలీవుడ్ నటీమణుల ఫ్యాషన్ పెరేడ్కి మాత్రమే కేన్స్ నిలవడం బాధాకరమంటూ పలువురు సినీ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.