Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వతంత్ర భారతావనిలో డాక్టర్ కొఠారి కమిషన్ రిపోర్టు ఆధారంగా 1968లో మొట్టమొదటి విద్యా విధానం అమలు లోకి తెచ్చారు. రెండవ జాతీయ విద్యా విధానం 1986లో అమల్లోకి తెచ్చారు. దీన్ని కొద్ది మార్పులతో 1992 నుంచి అమలు చేశారు. సరిగ్గా 34 సంవత్సరాల తర్వాత మూడవ జాతీయ విద్యా విధానం 2020ను ఇసోమాజీ చైర్మన్ కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో తయారు చేయబడినది. దీనిని కేంద్ర ప్రభుత్వం 29 జూలై 2020న ఆమోదించింది.
జాతీయ విద్యా విధానం 2020 ప్రధాన లక్ష్యం: అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి దోహదపడే భవిష్యత్తును ఊ హించి భారత కేంద్రీకత విద్య వ్యవస్థను రూపొందించడానికి 2020 జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. యుయాన్ఒ 2030 ఎజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నాలుగవ లక్ష్యం ప్రతిబింబించే (క్వాలిటి ఎడ్యుకేషన్) ప్రపంచ విద్యను అభివద్ధి ఎజెండా ప్రయత్నిస్తున్నదని దానికి సమాన మైనటువంటి నాణ్యమైన, ఉత్తమమైన విద్యను ప్రతి విద్యార్థికి అందించాలనే తపనతోనే జాతీయ విద్యా విధానం 2020 రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది.
ప్రస్తుతం ఉన్న 10+2 విధానాన్ని 5+3+3+4 గా మార్చినది. అందులో 1. మూడు సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య, 1,2వ తరగతులు 2. 3, 4, 5 తరగతులు 3. 6, 7, 8 తరగతులు 4. 9, 10, 11, 12, తరగతులు. 3 నుండి ఆరు సంవత్సరాల పిల్లలకి ECCE ఆదర్శంగా సరళమైన, బహుముఖ, బహుళ స్థాయి, ఆట ఆధారిత, కార్యాచరణ, విచారణ ఆధారిత, అభ్యసనం కలిగి ఉంటుంది. భాషలు, వర్ణమాల లెక్కింపు, డ్రాయింగ్, పెయింటింగ్, ఇతర దశ్య కళలు, క్రాఫ్ట్, డ్రామా, తోలుబొమ్మలు, సంగీతం, ఇతర సామాజిక సామర్ధ్యాలు సున్నితత్వం, మంచి ప్రవర్తన, వ్యక్తిగత పరిశుభ్రత మొదలగు అంశాలను విద్యార్థులకు నేర్పే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా విద్యా ర్థులకు కావలసిన బొమ్మల పుస్తకాలు, పెయింటింగ్ పుస్తకాలు, రంగుల పుస్తకాలతో కూడిన ఒక రీడింగ్ రూమ్ (పఠన మందిరం) కూడా ఏర్పాటు చేస్తే విద్యార్ధికి బాల్య దశలోనే పుస్తకాలపై మమకారం, చూడాలనే అభిరుచి, చదవాలని ఆలోచన మొదలవుతుంది. అదేవిధంగా ఒకవేళ మూడవ సంవత్సరం నుండి 5 వసంవత్సరం వరకు ప్రస్తుతం అంగన్వాడి ప్రిపరేటరీ క్లాస్లో లేదా ప్రాథమిక పాఠశాలలో కూడా అందుబాటులో ఉంది కావున, అంగన్వాడీ కేంద్రాలలో లేదా ప్రాథమిక పాఠశాలలో రీడింగ్ రూమ్ (పఠన మందిరం) ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
అదే విధంగా ప్రతి పాఠశాల స్థాయిలో 30:1 విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ( పి టి ఆర్) నిర్ధారిస్తుంది. అంతేకాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధిక సంఖ్యలో కలిగి ఉన్న ప్రాంతాలలో 25:1 లోపు (పిటిఆర్) లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ నిత్యం విద్యార్థులకు కావలసిన పుస్తకాలను, ఉపాధ్యాయులు కావాల్సిన సమాచారాన్ని అందించే గ్రంథపాలకుల నియమాకం, వారి విధానాల గురించి ఇక్కడ చర్చించపోవడం బాధాకరం.
భారతీయ భాషలలో లేదా స్థానిక భాషలలో అన్ని స్థాయిలలో విద్యార్థులకు ఉపయోగపడే, స్ఫూర్తి దాయకమైన పుస్తకాలు పాఠశాల గ్రంథాలయాలలో కానీ, పౌర గ్రంథాలయంలో కానీ అందుబాటులో ఉంచుతాం అని, డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు, పాఠశాల గ్రంథాలయం పాఠశాల లేని సమయంలో సమాజానికి సేవ చేయడానికి గ్రామాలలో పుస్తక క్లబ్బులు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పింది. పుస్తక క్లబ్లు ప్రభుత్వ, పాఠశాల గ్రంథాలయాలలో సమావేశమ వుతామని దీని ప్రధాన ఉద్దేశం పఠనాభి రుచిని విద్యార్థులకు కలిగించడం. జాతీయ పుస్తక ప్రమోషన్ కార్యక్రమం అన్ని స్థాయిలలో, అన్ని భాషలలో, అన్ని ప్రాంతాలలో చేపట్టబడ్డాలి అని జాతీయ విధానం చెబుతుంది. ఇది ఆహ్వానించదగ్గ విషయం కానీ గ్రంథాలయాలకు కావలసిన బడ్జెట్ల గురించి గానీ గ్రంథపాలకుని గురించి గానీ ఎక్కడ చర్చించలేదు.
పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ముసాయిదాను (NCFSE) రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అయిన SCERT కలిపి NCERTగా అభివద్ధి చేయబడిన అధిక నాణ్యత గల పుస్తకాలను విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ పుస్తకాలన్నింటినీ కూడా పాఠశాల గ్రంథాలయంలో, పౌర గ్రంథాలయంలో గాని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు మాధ్యమిక విద్యలో విద్యతో పాటు సైన్స్ సర్కిల్, మ్యూజిక్ సర్కిల్, డాన్స్ పెర్ఫార్మెన్స్, కవితా సర్కిల్, లాంగ్వేజ్ సర్కిల్. డిబేట్ సర్కిల్, స్పోర్ట్స్ సర్కిల్, ఎకో క్లబ్, డ్రామాలతో పాటు రీడర్స్ క్లబ్, స్టోరీ రైటర్ క్లబ్, స్టోరీస్ క్లబ్ కూడా ఏర్పాటు చేసి ఉంటే విద్యార్థులలో పఠణాభిరుచి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థికి విద్యతో పాటు పాఠశాలల్లో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం, సేవా పరిస్థితులు, మంచి శౌచాలయం, తాగునీరు, విద్యుత్, కంప్యూటర్, గ్రంథాలయం, ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్, క్రీడలు విద్యార్థి మానసిక ఉల్లాసానికి, శారీరక పరిస్థితికి, మానసిక పరిపుష్టికి తోడ్పడతాయి. అదేవిధంగా బదిరులు, అంగవైకల్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులకు కావలసినటువంటి పుస్తకాలను గ్రంథాలయాల్లో సమకూర్చాలి. 2025 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు 1. కళలు, సంగీతం, విజ్ఞానం, క్రీడలు, భాషలు, వత్తి పరమైన విషయాలు తగిన సంఖ్యలో బోధకులను నియమించాలని 2. గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, నైపుణ్య ప్రయోగశాలను, ఆటస్థలం, క్రీడా పరికరాలు విద్యాలయాలకు అందుబాటులో ఉండాలని చెప్పింది. కాని వాటిని నిర్వహించే అధికారుల పాత్ర మరిచింది. ఇలాంటి సమస్యలను అధిగమించాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య సహకారం, సానుకూల వాతావరణాన్ని పెంచటానికి ఒక ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేటు పాఠశాల ఒప్పందం ఉండాలని చెప్పింది. దీంతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు వనరులను ముఖ్యంగా డిజిటల్ పాఠ్యాంశాలను, పాఠ్య పుస్తకాలను గ్రంథాలయాలను ప్రభుత్వ విద్యాసంస్థలు ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలి.
ప్రతి రాష్ట్రం విద్యను బలోపేతం చేయడానికి విద్యార్థులను వారానికి ఒకసారి లేదా వారాంతాల్లో ప్రత్యేకంగా పగటిపూట బోర్డింగ్ పాఠశాలలు, కళలకు సంబంధించిన వత్తిలో పాల్గొనడానికి సందర్శించే ''బాల భవన్స్'' ఏర్పాటు చేయాలని చెప్పింది. కాని బాల భవన్లలో, పాఠశాల సముదాయాల్లో, పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. వారిని మానసికంగా పుస్తకాలతో (విజ్ఞాన వర్షంలో తడిసి ముద్ద చేయాలి) బంధించాలి. ఉన్నత విద్య దేశం స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభివద్ధికి గణనీయంగా దోహదం చేస్తుంది. ముఖ్యంగా 21వ శతాబ్దపు అవసరాలను పరిగణలోకి తీసుకొని నాణ్యత కలిగిన, ఉన్నతమైన విద్యను, ఆలోచనాత్మక చక్కటి, సజనాత్మకమైన విద్యను ఈ జాతికి అందించడం అనే ఉద్దేశంతో ఈ విద్యా విధానం రూపొందించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
దాదాపు 40000 పైచిలుకు కళాశాలలు విశ్వ విద్యాలయాల ఈ పరిధిలో పనిచేస్తున్నాయి. కానీ ఈ విధానంలో దాదాపు అన్ని కళాశాల అటానమస్ (స్వయం ప్రతిపత్తి) కళాశాలుగా అభివద్ధి చెందాలని వీటితో పాటు పరిశోధన -ఇంటెన్సివ్, లేదా టీచింగ్-ఇంటెన్సివ్ విశ్వవిద్యాలయంగా అభివద్ధి చెందుతాయని చెప్పారు. మార్గ్ సర్వే 2018 ప్రకారం దేశవ్యాప్తంగా చూసినట్లయితే 42.5 ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలు లేని పరిస్థితి. దాదాపు కళాశాలలో 32 శాతం గ్రంథాలయాలు లేని పరిస్థితి, 50.5 శాతం గ్రంథ పాలకులు లేని సంక్లిష్ట స్థితులు ఉన్నాయి. ఇక ప్రైవేట్ విద్యాసంస్థల పరిస్థితి సరేసరి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఒకటే నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం ఇబ్బందికరమైన విషయం. అదేవిధంగా ప్రైవేట్ కళాశాల కున్నటువంటి వనరులు అవకాశాలు ప్రభుత్వ కళాశాలలో అనుకున్నంత స్థాయిలో లేని సందర్భంలో అటానమస్ (స్వయం ప్రతిపత్తి) మంజూరు చేసినట్లయితే సహజంగా ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ప్రైవేటు కళాశాలలో ఉండవు. అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థ నుండి వచ్చేటువంటి నిధులు ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేట్ కళాశాలలో పొందే అవకాశం ఉన్నది.
నలంద, తక్షశిల విశ్వవిద్యాలయం నుండి వివిధ కళలకు, సాహిత్య రచనలకు సంబంధించిన 64 కళలు లైన గానము, పెయింటింగ్, కెమిస్ట్రీ, గణిత శాస్త్ర రంగాలు, వత్తి రంగాలు (వడ్రంగి) ప్రొఫెషనల్ రంగాలు (ఇంజనీరింగ్, మెడిసిన్) కమ్యూనికేషన్ డిస్కషన్, సాఫ్ట్ స్కిల్స్, విజ్ఞాన శాస్త్రం, వత్తి పరమైన విషయాలను, లిబరల్ ఆర్ట్స్ వంటి నేటి అవసరాలకు ఎలాంటి కోర్సులు అవసరమో అలాంటి వాటిని ప్రారంభించడం జరిగుతుంది అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇదే విశ్వవిద్యాలయాల్లో గొప్పగా పేరెన్నిక గన్న ధర్మగంజ్ గ్రంథాలయం లాంటి గ్రంథాలయాలను అన్ని విశ్వవిద్యాలయాలలో ఏర్పాటు చేయాలని ఎక్కడ చర్చించలేదు.
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ (STEM) వీటితో పాటు మానవీయ శాస్త్రాలను, కళలను అనుసంధానించిన, విద్యా విధానం అంచనాలను సజనాత్మక ఫలితాలు చూపిస్తాయి అని చెప్పింది. పరిశోధన, ఆవిష్కరణ పెట్టుబడులు బారత్ జిడిపిలో ప్రస్తుత సమయంలో 0.69 శాతం మాత్రమే, యుయస్ ఎ 2.8శాతం, ఇజ్రాయిల్ 4.3శాతం, సౌత్ కొరియన్ 4.2శాతం కేటాయింపులు జరిగాయి. నూతన ఆవిష్కరణలు, నూతన ఆలోచనలు, ఉన్నత శ్రేణి ఆలోచనలు, సమస్య పరిష్కార సామర్థ్యాలు, జట్టు కషి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామాజిక, నైతిక, అవగాహన పాఠ్యాంశాల నైపుణ్యం, నూతన అభ్యసనం జరగాలంటే ఖచ్చితంగా విద్యార్థి గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలతో మమేకం కావాల్సిందే అలా మమేకమైన విద్యార్థి మాత్రమే పైన తెలిపిన గుణాలను అలవర్చుకో గలుగుతాడు.
వీటితో పాటు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో దేశవ్యాప్తంగా గ్రంథాలయ శాస్త్రం (లైబ్రరీ అండ ఇన్ఫర్మేషన్ సైన్స్)ను కూడా ప్రవేశపెట్టి విద్యార్థులకు కావలసిన సమాచారాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి, పఠనాభిరుచిని ఎలా పెంచుకోవాలి, సమాచారం ఎలాంటి వనరుల అందిపుచ్చుకోవాలి అనే విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ఇలాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను (లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. కానీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయి. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ యూనివర్సిటీలు అని పిలువబడే ఐఐటీలు, ఐఐయంలకు సమానమైన స్థాయిలో మల్టీ డిసిప్లినరీ విద్య కోసం మోడల్ పబ్లిక్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడతాయని, ఇక్కడ నాణ్యమైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన విద్యను అందించడం అంటే ఇక్కడ అ గ్రంథాలయాలు వాటిలో అందుబాటులో ఉన్న ఆన్లైన్, ఆఫ్లైన్ వనరులను సద్వినియోగ పరచుకుని అప్పుడు మాత్రమే ప్రపంచస్థాయి విద్యను అందించ గలుగుతాం.
గ్రంథాలయాలను, ఆన్లైన్ పుస్తకాల ప్రాముఖ్య తను గుర్తించి డిజిటల్ గ్రంథాలయాలను విస్తత స్థాయిలో అన్ని స్థాయిలలో ముఖ్యంగా విద్యా సంస్థలను, గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయాలని చెప్పింది. గ్రంథాలయ సిబ్బంది అందుబాటులో ఉంచడం అవసరం అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో పఠన గదులు ఏర్పాటు చేయడం, అదే విధంగా భారతీయ భాషల్లో విస్తతస్థాయిలో పుస్తకాలను, పిల్లల గ్రంథాలయాలు, మొబైల్ గ్రంథాలయాలు తిరిగి ప్రారంభించడం, దేశవ్యాప్తంగా జాతీయ పుస్తక ప్రమోషన్ కార్యక్రమం వంటి అంశాలను ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం. వీటితో పాటు గ్రంధపాలకుల నియామకంపై కూడా కచ్చితంగా పరిగణించాల్సిన అవసరం ఉండేను.
విద్యా సాంకేతిక పరిజ్ఞానంతో మేధో, సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించడంలో భాగంగా టీచింగ్ లెర్నింగ్ ఈ కంటెంట్ అన్ని ప్రాంతాల భాషలతో పాటు ఎన్సిఆర్టి, సిఐఈటి, సిబిఎస్ఈ, నియోస్, ఇతర సంస్థలు సంస్థలతో అభివద్ధి చేయబడుతున్న దీక్ష ప్లాట్ ఫాంలో అప్లోడ్ చేయబడతాయి. అదేవిధంగా టెక్నాలజీ ఆధారిత విద్యా వేదికలు, దీక్ష, స్వయం, స్వయం ప్రభ లకు కావలసిన కాంటేంట్ ను గ్రంథాలయాల ద్వారానే సాధ్యమనే సంగతి మరవ కూడదు.
ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో తయారు చేయబడిన జాతీయ విద్యా విధానం 2020 కమిటిలో కనీసం గ్రంథాలయ శాస్త్రంలో ఆచార్యులను కానీ గ్రంథపాలకుని గాని ఒక్కరిని కూడా సభ్యుడిగా తీసుకోకపోవడం దురదష్ట కరం ఒక వేళా తీసుకుని ఉంటే గ్రంథాలయాలు ఈ విద్యా విధానంలో అద్భుత పాత్ర పోషించేవి. గత విద్యా విధానాలలు జిడిపిలో 6శాతం ప్రతిపాదించాయి. 2017-18 లో జిడిపిలో 4.8 శాతం ఖర్చు చేశాం. అభివద్ధి చెందిన దేశాలు జీడిపిలో 10 శాతం వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ విద్యావిదానంలో 6శాతం నిధులు కేటాయిస్తామని చెప్పింది. దానిలో కొటారి కమిషన్ ప్రకారం ప్రతి విద్యాసంస్థలో 6శాతం బడ్జెట్ గ్రంథాలయాలకు కేటాయిస్తాయని ఆశిద్దాం.
- డా.రవికుమార్ చేగొని
98669 28327