Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లయ బద్దంగా సాగే ద్విపదలు పిల్లలకు హాయిగా పాడుకొవడానిక అను గుణంగా ఉన్నాయి. బాలసాహితీవేత్తగా, ఎన్.బీ.టి.ఐ సహ సంపాదకులు డా.పత్తిపాక మోహన్ కలం చేసిన వ్యవసాయంతో పండిన పంటే 'అఆఇఈ బాల లయలు. అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు ,ఇ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ ఇట్లా ఒక్కొ అక్షరానికి ఒక్కొక్క పదం మాత్రం సాధారణంగా పిల్లలకు నేర్పిస్తాం. ఆంగ్లమాద్యమాలు వచ్చిన తరువాత అది కూడా తగ్గిపోయిన ఈ తరుణంలో పత్తిపాక మోహన్ రాసిన బాల లయలు పిల్లలకు పద సంపదను అందిస్తాయి. లయాత్మకంగా పాడుకోవాడానికి అనుగుణంగా ద్విపదల రూపంలో రాయడంతో వీటికి మరింత సోగసు వచ్చింది. తేటతేట తెలుగు పదాలతో 54 పేజీలలో 54 అక్షరాలను అంత్యప్రాసలతో పిల్లలకు మక్కువ అయ్యేవిధంగా రాశారు.
'అమ్మ' మొదటి దైవం/...../'అన్నదాత'యే ఘనం అని పిల్లలకు అమ్మతో పాటు రైతును పరిచయం చేశారు. ఇ అంటే ఇల్లే కాదు ఇ అంటే ఇరుగుపొరుగు అని తెలిపారు. ఐ అంటే ఐదే కాదు ఐకమత్యం అని తెలియజేశారు. ఓ అంటే ఓడ , ఓనమాలు అని మ అంటే మర్యాద అని,స అంటే సంఘం అని, హ అంటే హక్కు అని నేర్పుతారు. ఇలాంటి పద సంపద మెండుగా ఉన్న చిట్టిపొట్టి చిన్నారి లాంటి ఈ పుస్తకం పిల్లలున్న ప్రతి ఇంటిలో ఉండాలి. పిల్లలకు అమ్మ భాషను నేర్పడంలో ఒక కరపత్రంలా ఉపయోగపడే పుస్తకమే ' అఆఇఈ బాల లయలు'.
(అఆఇఈ (బాల లయలు), రచయిత : డా|| పత్తిపాక మోహన్, పేజీలు : 54, వెల : రూ.75/-, ప్రతులకు : గంగ పబ్లికేషన్స్, 5-4-47, పత్తిపాక వీధి, సిరిసిల్ల - 505301, సెల్ : 9811239219, 9966229548)
- అనంతోజు మోహన్ కష్ణ,
8897765417