Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరాఖండ్.. మనదేశంలోని ఒక రాష్ట్రం. దేవ భూమిగా పిలువబడే ఈ ప్రాంతంలో అనేక రకాల క్రూరమృగాలు, పక్షులు, జంతువులకు నిలయం. హిమాల యాలకు దగ్గరగా... అడవులు, కొండ ప్రాంతాలను ఎక్కువగా కలిగిన రాష్ట్రం. ఇక్కడి అనేక ప్రాంతాలలో చెప్పుకోదగినది నైనిటాల్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్.. మలుపులు, లోయలు, పర్వత శ్రేణులతో ప్రయాణం మొత్తం ఆధ్యంతం ఆహ్లాదభరితంగా ఉంటుంది. వైల్డ్ సఫారి కోరుకునేవారు ఈ ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఒక్కడ జీప్ సఫారికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే స్నేహితులతో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శిం చేందుకు వెళ్లాను. మరి ఈ పార్క్ విశిష్టతలేంటో ఓసారి తెలుసుకుందామా...
1936లో హేలీ నేషనల్ పార్క్గా స్థాపించిన ఈ పార్క్కు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్ నగర్ జిల్లాలో ఉంది. 1955 -56 మధ్య కార్బెట్ నేషనల్ పార్క్గా పేరు మార్చారు. 1973లో ఈ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ ఆఫ్ టైగర్ జైన్గా ఏర్పాటు చేశారు. అప్పటి నుండి పులుల అభయారణ్యం గా ప్రసిద్ధి గాంచింది. అంతే కాదు ఇది మన దేశ పురాతన జాతీయ ఉద్యానవనం. దాదాపు 520 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనంలో అనేక రకాల చెట్లు, 650కిపైగా అంతరించి పోతున్న పక్షి జాతులు, జంతువులు, పులులు, నాలుగైదు రకాల జింకలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొండలు, చిత్తడి భూమి, గడ్డి భూములు ఎక్కువగా ఉన్నాయి. రాత్రి పూట విశ్రాంతికి ఈ ప్రాంతంలో అనుమతి ఉంది. హిమాలయ పర్వతం నుండి పుట్టిన అనేక వంకలు ఈ పార్క్ నుండి ప్రవహిస్తున్నాయి. ఈ నీరు చాలా స్వచ్ఛంగా స్పటిక శుద్ధితో ఉంటాయి. దేశ, విదేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఒక్కడ జీప్ సఫారి, కాంటర్ సఫారి, ఏనుగు సఫారి ప్రసిద్ధి. ఉదయం 6:30 నుండి సాయంత్రం 5:30 వరకు పార్క్లోకి అనుమతి ఉంటుంది.
గుర్తింపు పొందిన జీప్ సఫారి
ఈ పార్క్ కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటంతో తిరిగి చూసేందుకు జీప్లో ప్రయాణం తప్పనిసరి. సొంత వాహనాలకు అనుమతి ఉండదు. పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ, పక్షుల కిలకిలా రావల మధ్య సాగే ఈ ప్రయాణం చాలా ఉత్సాహభరితంగా, ఉల్లాసంగా అనిపించింది. మన దేశంలోని ప్రసిద్ధ పార్కులు, అభయారణ్యాలలో జంగల్ సఫారి, జీప్ సఫారి, అనిమల్ సఫారి ఉన్నాయి. మున్నార్, లడాఖ్, బండీపుర్, దాండేలి, వాటికి ఉత్తమ ఉదాహరణలు. అలాగే కొన్ని పార్కులు తన సహజ సస్య సౌందర్యం, మొక్కల, చెట్ల ఆకుపచ్చ రంగుతో నెమలి ఈకలలాగే కనిపిస్తాయి. లక్షలాది సంఖ్యలో పర్యాటకులు జీప్ సఫారి కోసమే ఈ పార్క్ను ఎక్కు వగా సందర్శిస్తారు.
ఈ ప్రయాణం ఒకందుకు సురక్షిత మైనదే.. అనుకోని ఆటంకాలు ఎదురు కాకుండా, క్రూర మృగాలు దాడులు చేయ కుండా కాపాడు తుంది. ప్రమాదం ఎదుర యినా త్వరగా బయట పడేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ పార్క్లో కాలి నడకకు అనుమతి లేదు. పక్షులు, జంతువులు, మొక్కలు, చెట్లకు సంబంధించి ఏ చిన్న సందేహం వచ్చినా జీప్ డ్రైవర్లే గైడ్లుగా అన్ని వివరిస్తారు. ఈ పార్క్లో అరు ముఖ్యమైన ప్రాంతాలు (వలయాలు) ఉన్నాయి. అవి
1. బిజ్రాని జోన్
ప్రాకతిక అందం, పచ్చిక బయళ్ళు బిజ్రాని జోన్ ప్రముఖ ఆకర్షణ. రామ్నగర్ నుంచి 4 కి.మీల దూరంలో ఉన్న బిజ్రాని వలయంలో బెంగాల్ పులులు ఉంటాయి. ఈ వలయంలో జీప్ సఫారి కాకుండా ఏనుగుల సఫారి కూడా ఉంది. అక్టోబర్ మధ్య నుండి జూన్ వరకు పర్యాటకుల కోసం ఈ ప్రాంతాన్ని అందుబాటులో ఉంచుతారు. అంతేకాదు లోపల తక్కువ ఖర్చుతోనే వసతి సౌక ర్యాలకు అరణ్య విశ్రాంతి గహలు అందుబాటులో ఉన్నాయి.
2. జిర్నా జోన్
జిర్నా వలయం రాంనగర్ నుంచి 16 కి.మీల దూరంలో ఉంది. ఈ వలయం ఏడాదంతా తెరిచే ఉంటుంది. పచ్చిక బయళ్ళు, ఆకురాల్చే అడవులు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇది పక్షుల వీక్షణ (బర్డ్ వాచింగ్ జోన్)కు కేటాయించిన ప్రదేశం.
3. ధికాల జోన్
జిమ్ కార్బెట్ ఉద్యాన వనంలో ఉన్న అతిపెద్ద జోన్ ఇదే. ఫారెస్ట్ లాడ్జీ లు ఉన్నాయి. అంతేకాదు ఇది అడవి మధ్యలో ఉండడంతో యాత్రికులు పచ్చని, చల్లని వాతావరణంలో సేద తీరుతారు. ఉరుకుల పరుగుల జీవితం, నగర వాతావరణంలో అలిసిన వారికి ఈ ప్రాంతం బాగా సేదతీర్చుతుంది. ఈ జోన్లో బెంగాల్ పులులు, జింకలు, ఏనుగులు, లంగూర్ చీతాల్, ాములు ఉన్నాయి. అయితే ఈ ధికాల జోన్లో రాత్రి ఉండడానికి మాత్రమే అనుమతి ఇస్తారు.
4. దుర్గాదేవి జోన్
దుర్గాదేవి జోన్ రాంనగర్ నుంచి 28 కి.మీల దూరంలో ఉన్న వలయంలో రామగంగా నది ప్రవహిస్తుంది. జిమ్కార్బెట్ పార్క్ పూర్వోత్తర సీమలో ఉన్న ఈ జోన్, జంతువులకు నిలయం. ఈ ప్రాంతం మొత్తం చూడాలంటే మాత్రం తప్పనిసరి ఒక రాత్రి మొత్తం అక్కడ ఉండాలి.
5. సీతావాణి జోన్
రాంనగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోపల ఉన్న ఈ జోన్, జిమ్ కార్బెట్లో అద్భుతమైన మొక్కలకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలోని పురాతన 'సీతామాతా' దేవాలయానికి ప్రతిఒక్కరూ తప్పనిసరి వెళుతుంటారు. ఇది బఫర్ జోన్లో రావడంతో ప్రత్యేకమైన అనుమతి పొందవలసిన అవసరం లేదు.
6. సోనానది జోన్
ఈ వలయంలోకి మాత్రం పర్యాటకుల ప్రవేశం నిషిద్ధం. పాక్రో దీనికి ఎంట్రి గేట్.
ఈ వలయాలను సందర్శించాలంటే అనుమతి పత్రం కావాలి. ఇది పార్క్ వెబ్సైట్లో ఉంటుంది. ఉద్యానవనంలో స్వంత వాహనాలకు ప్రవేశం ఉండదు. అక్కడ నమోదు చేసిన వాహనాలకు మాత్రమే అనుమతి. రాంనగర్ కాకుండా ధిక్లా, గైరాల్, లోహచార్లో వసతి సౌలభ్యాలు ఉన్నాయి. ఉదయం 5: 30 నుండి 8:00 వరకు, మధ్యాహ్నం 3:00 నుండి 6:00 వరకు జీప్ సఫారి అందుబాటులో ఉంటుంది. ఎంచుకునే ఎంట్రీ గేటులను బట్టి జీప్ సఫారి ధరలు కూడా ఉంటాయి.
ఎలా వెళ్లాలి?
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కు వెళ్ళడానికి హైదరాబాదు నుండి 1600 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 1800 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 1900 కిలోమీటర్లు, బెంగుళూరు నుండి 2200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ నుండి రాంనగర్ వరకు రైళ్లు కూడా ఉన్నాయి. డెహ్రా డూన్ నుంచి వెళ్తారంటే బస్సు, ట్రైన్లు కూడా ఉన్నాయి. రాంనగర్ రైల్వే స్టేషన్ నుండి రిక్షాలు అందుబాటులో ఉంటాయి. వేసవికాలం జిమ్ కార్బెట్ సందర్శించడానికి సరైన సమయం.
- సుభాస్ మంచి, 9663135413