Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లుకుపోవటం తెలిసిన మనిషి తప్పక చెట్టవుతాడు. కొన్ని కవిత్వ పక్షులకు ఆవాసంగా మారుతాడు. కొన్ని ఫలాల మధురానుభూతులను వొలిచి నోటికందిస్తాడు. కవిత్వాన్ని పచ్చగా పూయిస్తాడు. నలుగురు పూయించేలా చేస్తాడు. ఇలా తీగల చింతలా పెనవేసుకుంటాడు. నిజంగా కవితలో చెప్పినట్టుగా 'ఆయన తీగలచింతే'. ఇంకా చెప్పాలంటే 'కవిత్వచింత'.
'తీగలచింత' అనే పేరులోనే కవి బాధామయ జీవితం, అస్తిత్వ పోరాట నేపథ్యం, ప్రపంచాన్ని తాను తానుగా చూస్తూ ప్రవాహంగా సాగుతున్న కలగొలుపు దష్టి కనిపిస్తాయి.
ఇందులో కవి కొన్ని స్పందనలను చుట్ట చుట్టుకున్న కవితలా మారిపోతాడు. బతుకుమార్గాలను చూపుతాడు. అమానవీయతను ప్రశ్నిస్తాడు. మనిషి యొక్క వివిధ రూపాలను కవిత్వంలో చూపుతాడు.చీకటిబతుకుల గురించి మాట్లాడుతాడు. తత్వాన్ని మూటకడుతాడు. కొన్ని స్మతులు, పాదయాత్రలకు సంఘీభావం. మనుషులు మనుషులుగా గుర్తించబడే లోకం కోసం ఎదురుచూస్తాడు. కులం, మతంతో సంబంధంలేని మనుషులు కావాలంటాడు. మొత్తంగా, కవిత్వ అంత:సూత్రంగా చూస్తే ఈ కవి మనిషి, మానవ సంబంధాలపై ఎక్కువ కవిత్వం రాస్తారు.
వెంటాడే వాక్యాల్లోకి..
1. చివరకు ఇలానే మిగులుతారు
ఇంతే మిగులుతుంది,ఇంకేమి మిగలదు
అబద్దం అబద్దంలానే
నిజం నిజంలానే(గుఫ్తగూ-1..పేజీ..44)
ఈ వాక్యాలు మనిషి అంతి మంగా ఏమవుతాడో, ఏ స్థాయిలో నిలబడతాడో తెలుపుతాయి. చివరకు మిగిలేది చేసిన మంచి పని మాత్రమే అని, ఎప్పటికీ నిజమే గెలుస్తుందని కవి రాసిన ఈ వాక్యాలు ఎవరికీ మినహాయింపు కావు. ఎన్ని చేసినా, ఏ తీరం చేరినా నిజం నిజమే, అబద్దం అబద్దమే.
2. కీ ఇచ్చిన మరబొమ్మలలోకం
మనిషిగా ఏడ్చేవాళ్ళంతా
నెంబర్లను లేనివాళ్ళే
నెంబరు లేకపోతే
కాలికింది నేల జారిపోతుంది
(పౌరసత్వం..పేజీ51)
ఇప్పుడున్న ప్రపంచమంతా కత్రిమమైనదని, సాంకేతికంగా ముందుకు వెళ్తుంది కానీ మనుషులు మాత్రం మరబొమ్మల వుతున్నారని ఇక్కడ బతకటం కోసం, మనుషులుగా గుర్తింపబడటం కోసం నెంబర్లు కావాలని ఇప్పటి దుస్థితిని కవి నిరసిస్తున్న విధానం ఈ వాక్యాల్లో కనబడుతుంది.ఇక్కడ కవి అన్నట్టుగా ఏడ్చేవాడే ఇంకా ఇంకా పీడింపబడు తున్నాడు.తను పుట్టిన నేలలో తను నిల్చున్న నేలపైనే ప్రశ్నగా మిగిలి పోతున్నాడు.
3. అతడి చేతిలో కవిత్వం
రెపరెపలాడింది
అతడు జెండాలా
నిత్యం ఎగురుతూనే ఉంటాడు(కవి నిర్మాణం..పేజీ..150)
కవిత్వమనేది గొప్ప విద్య.గొప్ప కళాకతి.కొన్ని పదాలనో, వాక్యాలనో పేర్చి కవిత్వమని నమ్మేవాళ్ళు ఈ వాక్యాలను దష్టిలో ఉంచుకోవాలి.
వాళ్ళను కాపు కాసే వాళ్ళు ఈ వాక్యాలను గమనింపులోకి తెచ్చుకోవాలి.కవి అన్నట్టుగా కవిత్వమనేది ఉన్నచోట ఎవరైనా జెండాలా మారి రెపరెపలాడుతారు.కవిత్వమే అయితే అది ఖచ్చితంగా బ్రతుకుతుందన్న విశ్వాసాన్ని కవి ఈ వాక్యాల్లో వెలిబుచ్చారు.
4. అమ్మ వర్షంలా కురిసి
కొన్ని చినుకుల్ని నాలోపలికి ఒంపి
ఫోన్ పెట్టేసింది(కొన్ని చినుకులు..పేజీ..155)
అమ్మను ఎంతో ఆత్మీయంగా కవి ఈ వాక్యాల్లో చూపించాడు. ప్రకతినే పరవశింపజేసే వానచినుకుల్లో ఓ దశ్యంగా చూపిస్తూ అమ్మ జ్ఞాపకాల్లోకి తీసుకెళతాడు.కవి అన్నట్టుగా అమ్మ ఎక్కడున్నా రోజుకోసారి వర్షంలా కురుస్తూనే ఉంటుంది.అమ్మను మరవటమంటే జన్మను మరవటమే.
'తీగలచింత' నిండా ఇలా ఎన్నో వాక్యాలు వెంటాడుతూనే ఉంటాయి.ఇక్కడ మచ్చుకు కొన్ని ఉదాహరణలే తీసుకున్నాను. కవిగానే కాదు,కవిసంగమంతో అందరిని కలుపుకుంటూ చక్కని కవిత్వ సజన చేస్తూ,చేయిస్తున్న కవికి జయహౌలు.
- తండ హరీష్ గౌడ్,
8978439551