Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేమన పద్యాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ప్రసిద్ధి పొందాయి. డా|| ఎన్.గోపి వేమన పరిశోధకుల్లో అగ్రగణ్యులు. వేమన గోపిగా ప్రసిద్ధులు. 1980 సం||లో వారి పి.హెచ్.డి పరిశోథన గ్రంథం ప్రజాకవి వేమన 6 పునర్ముద్రణలు పొంది నేటికీ వన్నె తరగని ప్రామాణిక గ్రంథంగా కొనసాగుతున్నది. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఖండాంతరాలకు వెళ్ళిన అపురూపమైన పారిస్ ప్రతి ఇది. దీన్ని 1990లో గోపిగారు పుస్తక రూపంలో తెచ్చారు. వేమన పద్యాలు అతి ప్రాచీన ప్రతుల్లో రెండోది ఇది. వేమన పద్యాల పరిష్కరణకూ భవిష్యత్పరిశోధనలకూ తిరుగులేని ఆకర గ్రంథంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. 1974లో గోపి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ డిగ్రీ ఆరంభించారు. మహాకవి ఆరుద్ర, ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారల ముందు మాటలు ఈ పుస్తకానికి నిండుతనం ఇచ్చాయి. ఈ పారిస్ ప్రతిని డా|| గోపిగారు దిగవల్లి వెంకట శివరావు, బంగోరె (బండి గోపాల్రెడ్డి) గారలకు అంకితం ఇవ్వడం ఎంతో సముచితంగా ఉంది. పారిస్ ప్రతిలో సవరించి చదువుకోవాల్సిన మాటల లిస్ట్ (పేజి 48)ని డా||గోపిగారు ఇచ్చారు. ''వేమన 7 కొత్త పద్యాలు పారిస్ ప్రతిలో లభ్యం'' అనే శీర్షికతో 30-8-1981 ఆంధ్రపత్రికలో గోపిగారి వ్యాసం ఎంతో ప్రామాణికమైనది. వేమన పద్యాలలో సుమారు 1167 పద్యాలను బ్రౌన్ దొర ముద్రించారు. కింగ్స్ లైబ్రరీలో ప్రాచీన ప్రతుల పట్టిక (పేజి 65) ఎంతో ప్రామాణికత సంతరించుకుంది. దాదాపు 170 పేజిల్లో 361ప ద్యాలు ఈ పుస్తకంలో ప్రచురించారు. ఆకారాది క్రమంలో పద్య సూచి చివర ప్రచురించారు. శుభారంభం ... అనే ఆరుద్ర అభిప్రాయం బాగుంది.
క్రీ.శ. 1730లో జెసూట్ మిషనరీలు పారిస్కు పంపిన వేమన పద్యాల రాత ప్రతిని కింగ్స్ లైబ్రరీ నుంచి తెప్పించి, సముద్ధరించి, పరిశోధించి 7 కొత్త పద్యాలు వెలికి తీసి చూపిన గోపి గారి కృషి అనన్య సామాన్యం. కోలారు అనెకల్లు ప్రాంతాల్లో వేమన వదినగారు వేమారెడ్డి మల్లమ్మ పేరుతో పూజలందుకొంటున్నది. ధార్వడ్ విశ్వ విద్యాలయంలో వేమన పీఠం నెలకొల్పారు. ఇలా వేమన పద్యాలు పారిస్ ప్రతి విశేషాలు, 42 ఏళ్ళ క్రిందటే ఓ.యు నుండి పి.హెచ్.డి పొందిన వైనం - లాంటి ఎన్నో విషయాలు ప్రామాణికతతో పాఠకులకు అందించిన డా|| గోపి గారూఈ పుస్తక ముద్రాపకులైన నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారు ఎంతో అభినందనీయులు. ప్రతి ఇంటా ఉండాల్సిన చారిత్రక ప్రామాణిక గ్రంథం ఇది.
(వేమన పద్యాలు, సముద్ధరణ : డా|| ఎన్. గోపి, పేజీలు : 176, వెల : రూ.175/-, ప్రతులకు : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్, ఎం.హెచ్.భవన్ - ప్లాట్ -21/1, అజామాబాద్, ఆర్.టి.సి. కళ్యాణ మండపం వద్ధ హైదరాబాద్-20. ఫోన్ : 9490099378/373/350)
- తంగిరాల చక్రవర్తి, 9393804472
మనసుకు మనసుకూ మధ్య (కథా సంపుటి), రచయిత : నెల్లుట్ల రమాదేవి, పేజీలు : 272, వెల : రూ.120/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
'పొట్టా'భిషేకం, రచయిత : హాస్యబ్రహ్మ, విశ్వవిఖ్యాత హాస్యరస సార్వభౌమ డా|| శంకర నారాయణ, పేజీలు : 96, వెల : రూ. 81, ప్రతులకు : శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్, 11-25-119, మెయిన్ బజారు, విజయవాడ-1, సెల్ : 9849181712
రసాయన మూలకాల రహస్యాలు, రచయిత : ఎల్.వ్లాసొవ్, డి.త్రీఫొనోవ్, పేజీలు : 320, వెల : రూ. 200/-, ప్రతులకు : నవతెలంగాణ, ప్రజాశక్తి బుకహేౌస్లలో...
నాలుగు మెతుకులు (కథల సంపుటి), రచయిత : ఎనుగంటి వేణుగోపాల్, పేజీలు : 160, వెల : రూ. 150/-, ప్రతులకు : ఎ. అంజలి, ఇం.నెం. 1-3-168/1, క్రిష్ణ నగర్, జగిత్యాల్-505327, సెల్ : 9440236055
గునుగు పూలు (కవిత్వం), రచయిత : ఉదయశ్రీ ప్రభాకర్, పేజీలు : 144, వెల : రూ. 150, ప్రతులకు : ఉదయశ్రీ ప్రభాకర్, ఫ్లాట్ నెం.203, పద్మాక్షి హైట్స్, పద్మాక్షి కాలనీ, హన్మకొండ, వరంగల్ అర్బన్ - 500601, సెల్ : 9866687134. అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో..
నీటి నీడ (కథా సంపుటాలు-3), రచయిత : కూర చిదంబరం, పేజీలు : 166, వెల : రూ. 150/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో..