Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తగిలితే శబ్దం రావటం సత్యం. తగలకుండా శబ్దం రావటం అబద్దం. దెబ్బ తగలనివ్వని భ్రమల్లో శబ్దాలు చేయడమంటే ఎదుటివారిని మోసం చేయడమే. ఈ కవి ఆ శబ్దాలను లెక్కించే క్రమంలో 'అనాహత'గా మారాడు. అబద్దాన్ని కప్పుకున్న సమాజం నుంచి నిజం వేరవ్వాలంటూ న్యాయం,అన్యాయం వేరనే స్పహను కలిగిస్తూ తన వాక్యాల ద్వారా సమాజానికి కీడు చేసే, ధర్మాన్ని వేటు వేసే మనిషివైపుకు కవిత్వాన్ని ప్రయోగిస్తున్నాడు.
కవిత్వంలో జంటపదాల ప్రయోగం ఈ కవి ప్రత్యేకత.ఇదే కవితలో (ఆత్మ-అంతరాత్మ, మానం-అభిమానం,కూడు-గుడ్డ, వత్తి-ప్రవత్తి) అనే పదాల అమరిక కనబడుతుంది.'సంపదంటే జ్ఞానం' అనే కవితలో( రాత్రి-పగలు,మంచి-చెడు,పాపం-పుణ్యం),
'నడిపోడు' అనే కవితలో (భావాల్ని-గాథల్ని , కథల్ని-వెతల్ని) 'గతానికి తప్ప' అనే కవితలో కాలానికి-తాళానికి,జీతానికి-జీవితానికి) అనే పదాలను సందర్భోచితంగా ప్రయోగించాడు.
వెంటాడే వాక్యాల్లోకి..
1. ''చూడలేని నీలిదశ్యాన్ని / ఆపలేక / గుడ్డివాడైన సూర్యుడు / గుండెపొడుచుకుని / ఆకాశం ఆరేసిన శవమైనప్పుడు / సర్వం ధ్వంసం'' (విధ్వంసం..పేజీ 22)
సమస్యలు ఇంకా ఇంకా పునరావత మవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కళ్ళముందు పదేపదే ఆర్తనాదమై అలజడి సష్టిస్తున్నప్పుడు జాతి మనుగడ ప్రశ్నార్థకం. ఆ సమస్యలను చూసి, ఇప్పటికీ చూస్తూ ఓ స్పందనలా 'విధ్వంసం' ను మొదటి కవితగా తీసుకొచ్చాడు.
ఆడపిల్లలపై జరిగే అత్యాచారాల సంఘటనా నేపథ్యంగా సాగే కవిత ఇది. ఒక్కో కవి ఒక్కోలా ఈ సందర్భానికి కవిత్వాన్ని రాస్తుంటారు. ఈ కవిదో ప్రత్యేకమైన శైలి. ఇందులో కవి వాక్యాల్లోకి సూర్యున్ని, ఆకాశాన్ని, ఇంధ్రధనుస్సును పట్టుకొచ్చి కొత్త వ్యక్తీకరణ చేశాడు. ప్రకతంటే ఎవరో కాదు మనిషే. మనిషే ప్రకతి.ఇక్కడ సూర్యుడన్నా మనిషే.ఆకాశమన్నా మానవసమూహమే.
2. ''ఆకాశం / సముద్రం / భూమి / అక్కడే కూర్చుంటారు..నాలాగా / కూర్చుని ఉండటమంటే / చలనం ఆగినట్టా..? / సం'చలనం' కోసమే..'' (సం'చలనం' కోసమే..పేజీ 28)
కవి సంపదంటే డబ్బు కూడబెట్టడం కాదు జ్ఞానాన్ని కూడబెట్టడమంటాడు.సం'చలనం' కోసం అనే కవిత శ్రీశ్రీ కవితాపాదాలు'' కుదిరితే పరిగెత్తు,లేకుంటే నడువు 'లను గుర్తుకు తెస్తుంది.కానీ ఈ రెండు ఒకదానికొకటి విరోధాభాస.ఈ కవితలో ఆగిపోవటమంటే చలనంలోకి ప్రవహించటమని చెప్పటంలో ఆ ధర్మం కనిపిస్తుంది.
3. ''మొక్కవోయిన గీస కత్తి / కుప్పకూలిన కుమ్మరాము
కుక్కపండిన కమ్మరి కొలిమి / అటకెక్కిన ఆయుధాలు
ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయం'' (కాలానికి చూపు రవి..పేజీ 55)
కవి ఎలా ఉండాలి,కవి దారేమిటి ,వేటికి స్పందించాలన్న ఎరుకతో కవి వేరు,ఆయనలో జీవించే వ్యక్తి వేరుకాదన్న దక్పథంతో అతనిలోని కవిని, అతన్ని ''కాలానికి చూపు రవి'' అనే కవితలో పరిచయం చేశాడు.ఈ కవితలో వివిధ వత్తుల వెనుకబాటుతనాన్ని, చేయూతనివ్వని రాజకీయ లబ్ధిదారులపై ప్రశ్నలతో కురవాల్సిన ఆకాశం లాంటి కవిని పట్టుకొచ్చాడు. మొదట్లో కవి అనుభూతి చెందే అంశాల ప్రస్తావన తీసుకొస్తూ పండువెన్నెలను,
సముద్రతీరపు నురగలను వెతుకుతున్నట్టుగా చూపించి కవి ఏ వైపుగా సాగాలో మధ్యలో కొన్ని వాక్యాల్లో బయటపెడతాడు. పల్లె జీవితానుభవం గల వ్యక్తి దష్టికోణమంతా చితికిపోతున్న పల్లెపై తప్పని సరిగా ఉంటుంది.అది రవీంద్రసూరి కవిత్వంలో ఎక్కువ పాళ్ళు కనిపిస్తుంది.
4. ''నేను కంటున్న కల / తీరని అలల తాకిడికి ముక్కలైతే
చీకటిని దాటేస్తూ అతికించుకుంటున్నాను
నేను ఏనాడో రాత్రి అనే పదానికి =×ూ చెప్పేశాను
ఒళ్ళు తెరిచే నిద్రపోతున్నాను'' (ఇంకా నేనేమౌతానో..పేజీ143)
ఈ కవి గాయాలకు లేపనాలను వెతుకుతాడు.జీవిత నిర్వచనాన్ని తెలుసుకోవాల నుకుంటాడు. స్వప్నాలు సర్పాలు కాని కొత్త సష్టి కోసం ఆరాటపడతాడు.
ముక్కలవుతున్న కలలకు సముద్రతీరంలో ప్రాణం పోయాలను కుంటాడు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జాగురుకతతో నిద్రపోతాడు. అలాంటి గమనమార్గంలో దారిని వెతుకుతూ సాగుతున్నాడు. అలా దారిని పట్టి చూపించే కవితే ''ఇంకా నేనేమౌతానో''. ఇందులోనే కవి ఓ దారిని ఆవిష్కరించుకోవా లనుకుంటాడు.ఈ కవి వెతుకులాటలోనే మనకో స్పష్టమైన దారిని చూపిస్తున్నాడు.
ఇంకా ఈ కవి కవిత్వంలో
బాల్యస్మతులు, మానవత్వపు పరిమళం, మనుషులపై మాధ్యమాల ప్రభావం, సినిమా రంగంపై తనకున్న ఆసక్తి, స్వంత ఊరు విశేషాలు, సందర్భానుసారంగా మనిషి తత్వం, విజయాలు-అపజయాలు-లక్ష్యాలు, స్త్రీల దుఃఖం ఎన్నో కలబోసుకుని ఉన్నాయి.
''జీవితం దుఃఖాల కూడిక సంతోషాల తీసివేత'' అన్న కవికి ఇంకేం చెప్తాం... అభినందనలు తప్ప.
- తండ హరీష్ గౌడ్
8978439551