Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పగడపు దీవులనగానే చాలా మందికి 'బాలమిత్ర కథలో చదివా.. పగడపు దీవులు ఉంటాయని' అనే పాట గుర్తు వస్తుందేమో కదా.. కానీ పగడపు దీవులు నిజంగానే ఉన్నాయని ఎంత మందికి గుర్తుందో... అవి మన దేశంలోనే భాగమైన లక్షద్వీప్లు.. కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడి కవరట్టి రాజధానిగా కొనసాగుతున్న ఈ ప్రాంతంలో చిన్న చిన్న దిబ్బలాంటి ద్వీపాలు చాలానే ఉన్నాయి. పేరుకు లక్ష అని అంటారు కాని అన్ని చిన్న చిన్నవే. కాస్త పెద్దగా ఉండేవి 36 ఉన్నప్పటికీ జనావాసం పదింటిలోనే.. జనావాసం లేని ద్వీపాలలోకి కేవలం పగడాల వేటగాళ్ళు మాత్రమే అడుగు పెడుతుంటారు. ఇప్పటివరకు ఎంతమందికి పగడాలు దొరికాయో, లేదో తెలియదు కానీ.. లక్షద్వీప్ ద్వీపాలు మాత్రం ప్రశాంత వాతావరణంలో ఉంటాయి. పర్యావరణ పరంగా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు కొబ్బరి సాగు, కొబ్బరి పీచు ఉత్పత్తి ప్రధాన ఆధారం. తరువాత చేపల వేట.. ఈ ప్రాంతం నుంచి అత్యంత ఖరీదైన ''ట్యూనా ఫిష్'' ఎగుమతి చేస్తుంటారు. కేరళలోని కొచ్చిన్ నుంచి నేరుగా విమాన సౌకర్యం ఉంది. ఈ ప్రాంత ప్రజలు మళయాళ మాండలీకము మాట్లాడతారు. ఎక్కువ శాతం ముస్లిములే ఉన్నారు. దీవులు మొత్తం కూడా 32 చదరపు మైళ్ళలోనే విస్తరించి ఉన్నాయి.