Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆచార్య బన్న అయిలమ్మ, అంపశయ్య నవీన్ గారలు చక్కటి ముందు మాటలతో ఈ నవలల్లోని గొప్ప విషయాలను పాఠకులముందు ఉంచారు. 2019 సం|| అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు వరంగల్ వారి నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.
ఈ నవలలో వస్తువు దళిత జీవితం. తెలంగాణలోని దళిత స్త్రీ రాసిన తొలి దళిత నవల 'కెరటం'. రచయిత్రి ఏ వర్గానికైతే చెందిందో ఆ వర్గం వారిని గురించి ముఖ్యంగా మన సమాజంలో వారు ఎదుర్కొనే అన్ని రకాలైన వివక్ష గురించి, అణచివేత గురించి, హింస గురించి అద్భుతంగా అక్షరీకరించిన రచయిత్రి అభినందనీయురాలు. ఈమె 'మమతల మల్లెలు' కథా సంపుటితో సృజన ప్రపంచంలోకి అడుగిడారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డొల్లతనాన్ని, గ్రామాల్లో దళితుల, ముస్లింల మధ్య గల సామాజిక సంబంధాలు, ప్రేమా ఆప్యాయాలుండడానికి బలమైన కారణాలు; పేదరికాన్ని నష్ట సుకాల్ని పాలు పంచుకొనే చక్కటి సన్నివేశాల బలంతో మల్లమ్మ, యాకుబ్ మియా కుటుంబ సంబంధాలే నిదర్శనంగా చక్కటి సాంస్కృతిక మత ఐక్యత చొప్పించి రాసిన తీరు బాగుంది. చాకలి (పాలకుర్తి) ఐలమ్మ పంటను విసునూరు దేశ్ముఖ్ కాజేయపోతే ఆనాడు బి.ఎన్.రెడ్డి ఆంధ్ర మహాసభ నేతలు పొంటను ఐలమ్మ ఇల్లు చేర్చిన సంఘటనను ఈ నవల్లో ముదిరాజ్ బుచ్చయ్య కథానాయకి మల్లమ్మ పంట పొలాన్ని కోసుకొని వడ్లు బస్తాల్లోకి ఎక్కిస్తే అతి సాహసంతో బుచ్చయ్యను ఎదిరించి పంటను దక్కించుకొంటుంది. తెలంగాణ పోరాట గాథను గుర్తు చేస్తుంది. మల్లమ్మ-మల్లయ్య దంపతులు గ్రామంలో బతుకు దెరువు లేక మరో వూరికి వలస వెళ్ళడం అక్కడ ఉండలేక మరో ఊరికి వలస వెళ్ళడం.. పిల్లల్ని బాగా చదివించి కులాంతర పెళ్ళిళ్ళు వారికి చేయడం.. జీవన క్రమంలో మల్లమ్మ చదవడం రాయడం నేర్చుకొని పంచాయతీ రాజకీయాల నుండి శాసనసభ సభ్యుఉసరాలిగా ఎదగడంతో వనల ముగుస్తుంది.
ప్రసవ సందర్భంలో బిడ్డ అడ్డం తిరిగి తల్లి (మల్లమ్మ) చనిపోయిందని త్రిప్పి పంపితే.. ఆమెను చూచి కొన ఊపిరితో ఉందని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించి మల్లమ్మను కాపాడిన పాత్రలో డా|| సుశీల పాత్ర అద్భుతంగా మలచారు రచయిత్రి.. ప్రజా గాయకుడు గద్దర్ను గుర్తుకు తెచ్చే పాత్ర ఉప్పలయ్య. ఆయన మల్లమ్మకు రాజకీయ మీటింగ్కు తీసుకెళ్ళి ఆమెతో అక్షరాస్యత-చైతన్యం- సామాజిక స్పృహ కలిగించి ఎమ్మెల్యే స్థాయికి తెచ్చిన తీరు బాగుంది.. కళ్ళం ఊడ్పులో పామును ప్రతిఘటించడం- పామును చంపడి, భూస్వాముల్ని గ్రామాల్లో మట్టుబెట్టాల్సిందే అన్న పరోక్ష సంకేతం బాగుంది. పోరులోనే శ్రమ ఫలితం దక్కించుకొవడం ప్రతీకాత్మకం. ఓ మంచి నవల ద్వారా చైతన్యం పొందాం అని అనిపిస్తుంది.
(కెరటం (దళిత నవల), రచయిత : డా|| తాళ్ళపల్లి యాకమ్మ, పేజీలు : 140, వెల : రూ.100/-, ప్రతులకు : సోమారపు వీరస్వామి, ఇ.నెం. 1-6-64, నర్సంపేట రోడ్డు, మహబూబ్బాద్ - 506101. సెల్ : 9704226681)
- తంగిరాల చక్రవర్తి, 9393804472
అందుకున్నాం
సుమధుర గీతాలు, జాబిలమ్మ పదాలు రచయిత : జి.కోటేష్, పేజీలు : 64, వెల : 110/-, ప్రతులకు : జి.కోటేష్, కోమటి గూడెం (గ్రామం), త్రిపురారం మండలం, నల్లగొండ జిల్లా - 508278, సెల్ : 9951213860, 7013395090
ప్రేమ మొగ్గలు, రచయిత : డా|| భీంపల్లి శ్రీకాంత్, పేజీలు :54, వెల : రూ. 30/-, ప్రతులకు : డా|| భీంపల్లి శ్రీకాంత్, ఇ.నెం.8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్
సెల్ : 9032844017
అడుగులు (కథల సంపుటి), రచయిత : ఎం.దేవేంద్ర, పేజీలు : 110, వెల : రూ. 120/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
ఐసోలేషన్ వాడ (దళిత కవితా సంకలనం 2020), సంపాదకుడు : నేతల ప్రతాప్ కుమార్, పేజీలు : 148, వెల : రూ. 150/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
సెల్ : 9550436286
9182262655