Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రాజు మరణించే నొక తార రాలిపోయే
కవియు మరణించే నొక తార గగన మెక్కె
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు''
ఫిరదౌసిలో జాషువా చెప్పిన మాటలు అక్షర సత్యాలై నిలిచాయి.. నిలుస్తాయి. ఈ సంవత్సర కాలంలో చాలా మంది సాహితీవేత్తలు మనకు దూరమయ్యారు. ముఖ్యంగా తెలుగునాట ప్రముఖులైన సాహిత్య, సాంస్కతిక, కళా రంగాలకు చెందిన ప్రముఖులు కరోనా కారణంగా, అనారోగ్యాల కారణంగా మరణించారు. వారంతా భౌతికంగా మన మధ్యలేరు. కానీ, వారందించిన సాహిత్యం - కళా సేవాలు జాషువా చెప్పినట్లు ప్రజల నాలుకలపై ఉంటాయి. అలాంటి మహనీయులకు మరోసారి నివాళులు.
మార్క్సిస్టు విశ్లేషకులు - డా.ఎ.పి.విఠల్
డా.ఎ.పి.విఠల్ సుప్రసిద్ద మార్క్సిస్టు విశ్లేషకులు, సీపీఐ(ఎం) నేతత్వం లోని విద్యార్థి, యువజన, కళా సాంస్కతిక సంఘాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక కార్య నిర్వాహక భాద్యతలు నిర్వహించారు. ప్రజా వైద్యులుగా సూర్యపేటలో పేదలకు ప్రజలకు రూ. 3కే వైద్యం అందించి మూడు రూపాయల డాక్టర్గా పేరు పొందారు. సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్తగా విజయవాడలో ఉంటూ సుందరయ్య జీవిత చరిత్రను రచించారు. జర్నలిస్టుగా, రచయితగా, అనువాదకులుగా, ఉపాన్యాసకులుగా సేవలు అందించారు. పౌరహక్కుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పని చేశారు. చివరి వరకు మార్క్సిజం - లెనినిజం పట్ల అంకితమై పనిచేశారు. జనవరిలో తీవ్ర అస్వస్థతకు గురై కన్ను మూశారు.
ప్రసిద్ధ కవి దేవిప్రియ
షేక్ ఖాజా హుస్సేన్గా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సరిగ్గా రెండేళ్ళకు 15 ఆగస్టు 1949లో జన్మించిన దేవిప్రియ విద్యాభ్యాసం గుంటూరులో జరిగింది. విద్యార్థి దశలోనే కవితలు రాశారు. సినిమాలకు స్క్రిప్టులూ, పాటలూ రాయాలనే అభిలాషతో మద్రాసు వెళ్ళారు. 'ప్రజాతంత్ర' పత్రికకు చిన్న వయస్సులోనే సంపాదకుడిగా పని చేశారు. అందులోనే మహాకవి శ్రీశ్రీ ఆత్మకథను 'అనంతం' పేరుతో ప్రచురించారు. సమాజానందస్వామి పేరుతో సామాజికాంశాల పైన కవితలు రాసేవారు. రన్నింగ్ కామెంట్రీ కవిగా దేవిప్రియ సుప్రసిద్ధుడు. దేవిప్రియకు 2017లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 'గాలిరంగు' కవితా సంకలనంకు అవార్డు ఇచ్చారు.
అనువాద భారతి శాంత సుందరి
ప్రముఖ రచయిత్రి, అనువాద కురాలు ఆర్.శాంత సుందరి ప్రముఖ రచయిత కొడవటి గంటి కుటుంబరావు గారి కుమార్తె. చెన్నైలో పుట్టి పెరిగారు. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేశారు. గణేశ్వరరావుతో వివాహా నంతరం చాలాకాలం ఢిల్లీలో ఉన్నారు. హిందీ భాషోపాధ్యాయినిగా పనిచేసిన శాంతసుందరి... రిటైర్మెంటు అనంతరం హైదరాబాదులో స్థిరపడ్డారు. దాదాపు 75 ప్రముఖ తెలుగు, హిందీ గ్రంథాలను అనువదించారు. ''ఇంట్లో ప్రేమ్చంద్'' పేరిట ఆమె చేసిన అనువాద గ్రంథానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. 79 సంవత్సరాల వయసులో నవంబర్11న మెదడులో కణితి కారణంగా హైదరాబాదులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.
తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర
ప్రముఖ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86) మార్చి 5న క్యాన్సర్తో కన్నుమూశారు. పత్రికా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలందించారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు 1957లో ఆంధ్రజనత పత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో పనిచేశారు. సాహిత్యం, సాంస్కతికం, రాజకీయం అంశాలపై అనేక రచనలు చేశారు. 2000 సంవత్సరంలో రచించిన నాటి పత్రికల మేటి విలువలు పుస్తకం, 2001లో రచించిన చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. పీవీ గురించి రాసిన ఇయర్స్ ఆఫ్ పవర్ణలో సహరచయితగా ఉన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, విధి నా సారధి, పారమార్థిక పదకోశం పుస్తకాలు రచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా పనిచేశారు.
ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊ.సా.
ఉద్యమాల ఉపాధ్యాయుడు, బహుజన సాహితీవేత్త, సామాజిక కార్యకర్త ఊ.సాంబశివరావు. తెలుగు నేలపై పురుడు పోసుకున్న అస్తిత్వ ఉద్యమాలకు పెద్ద దిక్కు ఊసా. దళిత, బహుజనులపై వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా బహుజన రాజ్యాధికార సాధనకై ఆయన నిరంతరం పనిచేస్తూ వస్తున్నారు. విప్లవోద్యమంతో మొదలైన ఆయన ప్రస్థానం ఆ తర్వాత లాల్-నీల్ సిద్దాంతంతో కుల వర్గ నిర్మూలన పోరాటం వైపు సాగింది. అరవై ఏళ్ల వయసులోనూ.. యువతతో మమేకం అవుతూ ఎన్నో సిద్దాంతాలను వివరించేవారు. కరోనాతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 24న తుది శ్వాస విడిచారు.
గాన గంధర్వుడు
పండిత పామరుల హదయాలను రంజింప చేసిన స్వర చక్రవర్తి.. సంగీత ప్రపంచంలో స్వర తరంగం.. సుశ్రుతి శిఖరం.. రూపుకట్టిన స్వరామతం.. 16 భాషలకు ప్రాణ మయ్యాడు.. నిదురలో కూడా మరవలేని మధురమైన గానమయ్యాడు. 50 వసంతాలుగా అమతాన్ని పంచుతున్న అతని స్వరపేటిక అక్షరాల ఆస్వర భారతి కొలువుదీరిన రత్నపీఠిక. ప్రపంచ సంగీతానికే ఆయన స్వరం ఓ వరం. అతనే తెలుగు వారి ఆరాధ్య స్వరం.. వేల పాటలు పాడిన మధుర గాయకుడు బాలు అని పిలవబడే పద్మశ్రీ, పద్మభూషణ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. నలభైవేల పాటలు అందిచి..సంగీతమే ఊపిరిగా జీవించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) సెప్టెంబర్ 24న కరోనాతో కన్నుమూశారు.
అరుణ గీతం... వంగపండు
తెలుగు నేలపైన అరుణ గీతానికి ఒక అధ్యాయాన్ని లిఖించి ప్రజల, పీడి తుల, శ్రామికుల, ఆదివాసీల, దళితుల జీవితాలలోని దారుణ బీభత్సాలని, దు:ఖాలని తన గొంతులో నింపుకుని కన్నీటి గీతాలుగా వొదిలిన వాడు వంగ పండు. ప్రజా విముక్తి విప్లవో ద్యమానికి లాంగ్మార్చ్ గీతాన్ని 'జజ్జనకర జనారే జనకు జనా జనారే' అంటూ కవాతు చేయించిన వాడు. 'యంత్రమెట్లా నడుస్తున్నదంటే..' అని ఉత్పత్తి చలనాలకు శ్రామికుడి చెమట ఎలా కారణమవుతున్నదో వివరించినవాడు వంగపండు. పైసా మహత్యాన్ని విప్పి చెప్పినవాడు. ప్రజల భాషను, యాసను, జానపదుల నుడికారాలను రాగాలను పట్టుకుని విప్లవ ఆశయం కోసం తన గొంతును అంకితం చేసిన వంగపండు నిజంగా అమరుడు. కళను ప్రజాపరం చేసిన ధీరుడు. అనారోగ్యంతో ఆగస్టు 4వ తేదిన మరణించారు.
విజయ చంద్రిక ' జీడిగుంట'
ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, నిడదవోలు. విద్యార్థి దశలోనే ఆయన 'విజయ చంద్రిక' పేరుతో చేతిరాత పత్రికను నిర్వహించారు. 1959లో వరంగల్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో క్లర్క్గా ఉద్యోగం పొందారు. 1960 నుంచి కథారచన ప్రారంభించారు. సుమారు 400 కథలు రాశారు. 'తరంగిణి', 'గుడిలో పువ్వు', 'తాతా ధితై తథిగిణతోం' తదితర నవలలు, పలు నాటకాలతో మొత్తం 19 పుస్తకాలు రచించారు. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన 'అమెరికా అబ్బాయి'తో సినిమా కథా రచయితగా వెండితెరకు పరిచయమయ్యారు. 1971లో ఆలిండియా రేడియోలో చేరి 1997లో పదవీ విరమణ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో హంస అవార్డుతో సత్కరించింది. ఆయన రాసిన పలు రేడియో నాటికలకు ఐదు నంది అవార్డులు వచ్చాయి. 2018లో రావూరి భరద్వాజ పురస్కారాన్ని అందుకున్నారు.కరోనాతో ఆయన నవంబర్ 9న కన్నుమూశారు.
ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు
'ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు' అంటూ తెలుగు శ్రోతలకు వార్తలు వినిపించిన చిరపరిచిత స్వరం మూగ బోయింది. మూడు దశాబ్దాల పాటు ఢిల్లీ, ఆకాశవాణి తెలుగు విభాగంలో 1966 నుంచి 1996 వరకూ న్యూస్ రీడర్గా పనిచేసిన ఏడిద గోపాలరావు (83) నవంబర్ 12న కన్నుమూశారు. సోషలిస్టు రష్యాలోని మాస్కో రేడియోలోనూ నాలుగేళ్లు పనిచేశారు. పన్నెండు గంటలపాటు నిర్విరామంగా వార్తలు చదివి 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్'కెక్కారు. 'కరుణామయుడు' సినిమాలోనూ ఆయన నటించారు. గోపాలరావు స్వస్థలం పశ్చిమగోదావరి. గోపాలరావుకు రంగస్థల గాంధీగా పేరు. 'నేతాజీ', 'బాపు చెప్పినమాట' నాటికల్లోని బాపూజీ పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. గాంధీ ఏకపాత్రాభినయంలో గోపాలరావు వందకుపైగా ప్రదర్శనలిచ్చారు. సరస నవరస సాంస్కతిక సంస్థను నెలకొల్పి, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో జాతీయ నాటకోత్సవాలను నిర్వహించారు. తన అనుభవాల సమాహారం 'అరవై వసంతాల ఏడిద గోపాలరావు', 'గోపాలతరంగాలు' కవితా సంకలనం తదితర పుస్తకాలు రచించారు.
కూచిపూడి 'శోభ'
విశాఖ జిల్లా అనకాపల్లిలో 1956లో శోభానాయుడు జన్మించారు. 12 ఏళ్ల వయసులో కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరారు. సత్యభామ, పద్మావతి పాత్రల్లో రాణించారు. హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ఆమె ప్రిన్సిపాల్గా పనిచేశారు. కూచిపూడి నత్యంలో వందల మందికి శిక్షణనిచ్చారు. శోభానాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1998లో ఎన్టీఆర్, 1982లో నిత్య చూడామణి, 1991లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. యూకే, సిరియా, టర్కీ, హాంకాంగ్, మెక్సికో, వెనిజులా, క్యూబా తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి.. రావి కొండలరావు
నటుడు, దర్శకుడు, రచయిత, నాటకం.. సినీమా.. టీవీ.. పత్రికలు.. మిమిక్రీ ఇలా అన్ని రంగాలలోనూ విశేష అనుభవం కలిగిన వ్యక్తి రావి కొండలరావు(88). సినీ, సాహిత్య, సాంస్కతిక, కళారంగాల్లో విశేష అనుభవం సంపాదించి నిరాడంబరంగా జీవితం గడిపిన వ్యక్తి రావి కొండలరావు. 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ రచనలు చేసేవారు. ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్గా శ్రీశ్రీ, ఆరుద్రలతో కలిసి పనిచేశారు. రావి కొండలరావు నాటకాలు, రావి కొండలరావు కథలు, రావి కొండలరావు నాటికలు రాశారు. ఆయన భార్య రాధా కుమారి కలిసి ఏకంగా 150పైగా సినిమాల్లో భార్యాభర్తలుగా కలిసి నటించారు.'దాగుడు మూతలు' సినిమాతో నటుడిగా మారారు. జూలై 28న గుండెపోటుతో మరణించారు.
విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి
తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి(74). సమర సింహా రెడ్డి సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడి విలన్గా నంది అవార్డ్ అందుకున్నారు. విలనిజం పండించడంలో కోట శ్రీనివాస రావు తర్వాత జయ ప్రకాష్ అని చెప్పోచ్చు. జయ ప్రకాష్ స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల. సినిమాల్లోకి రాకముందు జయప్రకాష్ రెడ్డి పోలీసుశాఖలో పనిచేశారు. దర్శకరత్న దాసరి నారాయణ రావును ఆయనను ఫిల్మ్ ఇండిస్టీకి పరిచయం చేశారు. గుండె పోటుతో సెప్టెంబర్ 8న మరణించారు.
ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకుడు ఎన్.వి.ఎల్.నాగరాజు
ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకుడు ఎన్.వి.ఎల్. నాగరాజు (70). కరోనా బారిన పడటంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 17న తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా పార్వతీ పురానికి చెందిన నాగరాజు ఢిల్లీలోని ఇఫ్కోలో మార్కెటింగ్ మేనేజరుగా ఉద్యోగంలో చేరారు. 1989లో ఢిల్లీ తెలుగు అకాడమీని స్థాపించారు. దీని ద్వారా ఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలను సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాల వైపు ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు.
కథా'కరుణాకరు'డు
బండారు కరుణాకర ప్రసాద్ తెలుగు కథా రచయిత, అధ్యయన శీలి. బీహెచ్ఈఎల్ ఫైనాన్స్ శాఖలో మేనేజర్గా 2004లో ఉద్యొగ విరమణ చేశారు. 'బీపీ కరుణాకర్' అనే కలం పేరుతో కథా రచనలు చేసిన ఆయన.. 'కార్డు' కథలు, 'కాలమ్' కథలు వంటి వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. అతని కలం నుంచి 'అంబాలిస్', 'నిర్నిమిత్తం', 'రెల్లు', 'డియర్', 'రజితం' వంటి పలు కథాసంపుటిలు వెలువడ్డాయి. మరెన్నో కథలు పలు వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 'నిర్నిమిత్తం', 'రాజితం' సంపుటాల్లోని కథలు హిందీలోకి తర్జుమా చేయబడ్డాయి. 'రాజితం' కథలు కన్నడంలో కూడా అనువాదం చేయబడ్డాయి. హద్రోగ సమస్యతో బాధపడుతూ 2020 జూలై 18న కన్నుమూశారు.
కవితాంకిత కేశవులు
ప్రముఖ కవి అంకిత కేశవులు జులై 24న ఖమ్మంలో మరణించారు. ఖమ్మం జిల్లాలోనే కాదు డెబ్బయి, ఎనభైలలో తెలుగు నేలపై వారి మినీ కవితలు మారుమ్రోగేవి. రావెళ్ళ వెంకట రామారావు, హీరాలాల్ మోరియా, కవి రాజమూర్తి, సుచంద్ర మొదలైన ప్రసిద్ధుల చిత్తశిద్ధులతో పాటుగా కవిత్వ రచన చేసిన వారు. ఆంగ్లము, తెలుగు, సంస్కతము, హిందీ భాషలలో ప్రావీణ్యమున్న వారు. ఆంగ్లోపన్యాసకుడుగా పని చేసి పదవీ విరమణానంతరమూ న్యాయశాస్త్రపట్టా పొందారు. నిత్య అధ్యయన శీలి. ప్రగతిశీల భావాలతో తన చివరికంటా నిబద్ధంగా వున్నారు. శ్రీశ్రీని గుండెకు హత్తుకున్న వారు. వద్ధాప్యంలో కూడా నిప్పులు కక్కే కవిత్వాన్ని రాశారు. మిణుగురులు, నింగీనేలా అనే పేర తన మినీ కవిత్వాన్ని, హైకూలను ప్రచురించారు. 'మానవతా జిందాబాద్' అనే కవితా సంకలనాన్ని ప్రచురించారు.
'క్రాస్ రోడ్స్' కథకుడు కె.సదాశివరావు
ప్రచారార్భాటాలంటే గిట్టని మంచి కథా రచయిత, కవి, అనువాదకుడు కె.సదాశివరావు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆయన తెలుగు రచయితలలో సాంప్రదాయిక కథ, బ్రిటిష్ కలోనియల్ కథ, సైన్స్ ఫిక్షన్ కథ - ఈ మూడు రకాల కథలలో సిద్ధహస్తుడు. 'క్రాస్ రోడ్స్' కొత్త సంపుటిలోని పొగ మంచు, చలిమంటలు, అశ్వమేధం, తుషార బిందువు, యులిసెస్ వచ్చిన రోజు... తదితర పదకొండు కథలుబీ లాస్ట్ పెరేడ్, యాత్ర, నేకేడ్ ఫకీర్, డిల్లీ దర్బార్.. వంటి 8 ఆంగ్ల రాజ్య కథలుబీ సైన్స్ ఫిక్షన్ కోవకు చెందిన ఆత్మా ఫాక్టర్, మానవ ఫాక్టర్, ఏలియన్ రిపోర్ట్, మిస్డ్ యూనివర్స్... తదితర కథలు ఆయన అనితర సాధ్యమైన రచనా నైపుణ్యానికి అద్దం పడతాయి.
ఉద్యమ పాటల కెరటం
నిసార్కు కమ్యూనిజంపై అచంచల నమ్మకం, విశ్వాసం. అందుకే ఆయన ప్రజల మనిషయ్యారు. అనేక పాటలు రాసి పాడారు. సాహిత్యంలో కూడా తన గళాన్ని వినిపించారు. వతన్ సంకలనంలో 'ముల్కీ' కథను రాశాడు, అలాగే పదునైన కవితలెన్నో రాశారు. నిజానికి ప్రజా సాంస్కతిక రంగంలో ముస్లిముల సంఖ్య చాలా పరిమితం. ముస్లిముల నుండి ప్రధాన వాగ్గేయకారునిగా ఎదిగివచ్చారు నిసార్. తెలంగాణ పల్లె భాషే అతని బలం. కవిగా... గాయగుడిగా... ప్రదర్శగుడిగా.. ఎర్రజెండాను మోసుకు తిరిగిన నిసార్, ప్రతీ సమస్యపై పాటై నిలబడ్డాడు. కరోనాతో జూలై 8న కన్నుమూశారు.
కొమ్మరెడ్డి కేశవరెడ్డి
ప్రముఖ సాహితీవేత్త, ఉపాధ్యాయ నేత కొమ్మరెడ్డి కేశవరెడ్డి(80) నవంబర్ 26న మరణించారు. యూటీఎఫ్ వారి ఐక్యఉపాధ్యాయ మాస పత్రికకు పదేండ్లు సంపాదకులుగా పనిచేశారు. గోర్కి కథలు, సిటీ ఆఫ్ ఎల్లోడెవిల్ లతో పాటు 30కి పైగా పుస్తకాలను ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చూశారు. సాహితీస్రవంతిలో క్రీయాశీలకంగా పనిచేశారు. సాహిత్య సేవ చేస్తూనే ప్రముఖంగా అనువాదాలపై దష్టిపెట్టారు. సమాజ మార్పుకు ఉపయోగపడే రచనలపైనే చేశారు. ప్రజాశక్తి బుక్ హౌస్ కు ప్రధాన అనువాదకులుగా వ్యవహరించారు.
విశాలాంధ్ర ఎడిటర్ ముత్యాల ప్రసాద్
విశాలాంధ్ర ఎడిటర్ ముత్యాల ప్రసాద్ నవంబర్24న కరోనా తో మతి చెందారు. అభ్యుదయ భావాలు కలిగిన ముత్యాల ప్రసాద్ విశాలాంధ్రలో సబ్ ఎడిటర్గా ప్రస్థానం మొదలు పెట్టి అంచలం చలుగా ఎదిగి గత ఏడేళ్లుగా విశాలాంధ్ర ఎడిటర్గా కొనసాగుతున్నారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అభ్యుదయ కవితా సంకలనాన్ని, ముత్యాలమాల పేరుతో సంపాదకీయాలను పుస్తకరూపంలో తీసుకువచ్చారు.
ప్రముఖ కవి నాగభూషణాచార్య
ఏలేశ్వర నాగ భూషణాచార్య (75) ఆగస్టులో అనారోగ్యంతో మతి చెందారు. మెదక్ మండలం ర్యాలమడుగుకు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మాస పత్రికకు సంపాదకవర్గ సభ్యులుగా పనిచేశారు. మంజీర రచయితల సంఘాన్ని స్ధాపించడంతో కీలకపాత్ర పోషించారు.
శ్రామిక గీతం- నూనెల
అభ్యుదయ కవి, రచయిత, సాహితీ స్రవంతి విశాఖ జిల్లా ప్రధానకార్యదర్శి నూనెల శ్రీనివాసరావు జూలై 24న మరణించారు. ఆయన శ్రామిక గీతాలు పేరిట కార్మిక చైతన్య గీతాలను పుస్తక రూపం లోనూ, సీడీగానూ తీసుకు వచ్చారు. 1996లో విశాఖ పోర్టులో ఉద్యోగ జీవితం ప్రారంభిం చినప్పటి నుండి కార్మికరంగంలోనూ, సాహిత్య రంగంలో విశేష కషిచేశారు.
రాపాక ఏకాంబరాచార్యులు
ప్రముఖ రచయిత, సాహితీవేత్త డాక్టర్ రాపాక ఏకాంబరాచార్యులు (80) అనారోగ్యంతో కన్ను మూశారు. అధ్యాపకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర సహకార శాఖ జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. అవధాన విద్యా సర్వస్వము, విశ్వబ్రాహ్మణ సర్వస్వము, భారతదేశ చరిత్ర రెండోభాగం తదితర ఎన్నో గ్రంథాలను రచించారు. పలు అవధానాలకు పచ్ఛకునిగా, సంధానకర్తగా వ్యవహరించారు. పత్రికలకు వ్యాసాలు, గ్రంథ సమీక్షలు, రేడియో, దూరదర్శన్లలో సాహిత్య ప్రసంగాలతో ఆయన ప్రసిద్ధి చెందారు.
విదూషిమణి 'మహాలక్ష్మి'
ప్రముఖ రచయిత్రి కందుకూరి వెంకట మహాలక్ష్మి ఢిల్లీలోని మునిర్కాలో తమ స్వగహంలో జూలై11న కన్నుమూశారు. ఢిల్లీలో స్థిరపడిన మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ భవన్లో జరిగే సాంస్కతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆమె రచయిత్రి, గాయని, వ్యాఖ్యాత, నటి, నాటక దర్శకురాలిగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపి మన్ననలు పొందారు. ఆమె 150కి పైగా కథానికలు, మూడు పుస్తకాలు, అనేక కవితలు, నాటకాలు రాశారు. ఆమెకు 2009లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు అందించింది.
ప్రముఖ సాహితీ వేత్త బి. హనుమారెడ్డి
ప్రముఖ సాహితీ వేత్త, ఏపీ రచయితల సంఘ గౌరవా ధ్యక్షుడు బి. హనుమారెడ్డి (80) ప్రకాశం జిల్లా ఒంగోలులో జనవరిలో గుండెపోటుతో మతి చెందారు. హనుమారెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల సంఘం 9వ మహాసభలు ఘనంగా జరిగాయి. వతి రిత్యా న్యాయవాది అయిన హనుమారెడ్డి రైతుపక్షపాతిగా రచనలు చేశారు.
నవతెలంగాణ సోపతి గొట్టిపర్తి
1970-80ల మధ్య మినీ కవిత ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన వ్యక్తి మొట్టమొదట 'అగ్నిపుష్పాలు' అనే కవితా సంకలనంలో తన కవితలతో సాహితీ జీవితం ఆరంభించిన వ్యక్తి గొట్టిపర్తి యాదగిరిరావు. వివిధ పత్రికలలో ఆయన కవితలు ప్రచురించారు. రేడియో నాటికలు కూడా రాశారు. 1980 తర్వాత ఉద్యోగరీత్యా రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో బ్యాంకు ఉద్యోగ నిర్వహణలో కవితా ప్రపంచంలో 'డీ-లింక్' అయి రిటైరయ్యే ముందు హైదరాబాద్కు వచ్చి తిరిగి కవితా ప్రస్థానం ఆరంభించాడు. 31 మినీ కవితలతో 'విస్పోటనం' కవితా సంకలనం ప్రచురించారు. 2012లో 'అలజడి' మినీ కవితల సంకలనాన్ని ఆవిష్కరించాడు. తర్వాత 'అలజడికి' అనే పేర ఆంగ్ల అనువాదాన్ని 'నిశ్శబ్ద యుద్ధం' అనే మరో సంకలనాన్ని వెలువరించాడు. కవితలతో పాటు కథా రచన, కార్టూన్లు వేసేవారు. నాలుగు సంవత్సరాల నుంచి 'సోపతి'లో 'పదకేళి' నిర్వహించి ఇప్పటికి 275 పదకేళులు పూర్తి చేశాడు. నవతెలంగాణ నిర్వహించిన కథల పోటిలో రెండుసార్లు బహుమతులు అందుకున్నారు. హైదరాబాద్ పాతన నగర రచయితల సంఘం కార్యవర్గ సభ్యునిగా తెలంగాణ కార్టూనిస్టుల సంఘ కార్య నిర్వాహకునిగా సేవలు అందించిన స్నేహశీలి, సున్నిత మనస్కుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు గొట్టిపర్తి యాదగిరిరావు.
బహుముఖ నటన - 'సురభి' జమున
''శ్రీకష్ణసత్య'' పేరుతో ఏకకాలంలో శ్రీకష్ణుడు - సత్యభామగా (అర్థ-నారీశ్వర స్ఫూర్తితో) మేకప్ ఆర్టిస్ట్ బాపన్ పల్లి వెంకటస్వామి గారు మేకప్ చేయగా జమునా రాయలు ఒక వైపు శ్రీకష్ణుడు గా , మరో వైపు సత్యభామ గా అద్వితీయ నటనను ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణను, నాటక ప్రయోక్తల ప్రశంసలు అందుకున్నారు. శ్రీమతి జమునా రాయలు నటజీవితం లో ఈ ''శ్రీకష్ణసత్య'' ఓ కలికి తురాయి గా చెప్పుకోవచ్చు. జమునా రాయలు గారికి 25 పర్యాయాలు ''శ్రీకష్ణసత్య'' గా మేకప్ చేసారు, బాపన్ పల్లి వెంకటస్వామి. ఐదు దశాబ్దాల పాటు తెలుగు రంగస్థలం పై పలు పాత్రలలో జీవించి, బహుముఖ మైన ప్రతిభతో రాణించి ఆమె కరోనాతో (12-8-20) రాత్రి కన్నుమూశారు.
ఇంకా అనేక మంది సాహిత్య, సాంస్కతిక,కళా రంగాలకు చెందిన ప్రముఖులు బాలాంతరపు హేమచందర్, ప్రజా కళాకారుడు శ్రీనివాస్, విజయలక్ష్మి (యానం), గిరిరాజ విజయలక్ష్మి లాంటి వారెందరో మరణించారు. వారందరికి నివాళులు.
- అనంతోజు మోహన్ కష్ణ,
8897765417