Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోహ్ తాంగ్ కనుమ హిమాలయాల్లోని ఓ ప్రాంతం. అంతేకాదు ఇది రెండు ప్రాంతాలకు వాణిజ్య రవాణాకు రహదారి కూడానూ. అయినా ఈ ప్రాంతం మొత్తం కొండ చరియలతో ఉంటుంది. అంతేకాదు మన దేశంలోని అత్యంత ప్రమాదకరమైన పర్వత ప్రాంతాలలో రోహ్ తాంగ్ కూడా ఒకటి. అయితే ఇక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది. పైగా ట్రెక్కింగ్కు అనువైన ప్రాంతం.. అందుకే ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగానే వస్తుంటారు. ఈ కనుమ 3,980 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లోని పీర్ పంజాల్ శ్రేణి తూర్పు చివరలో, మనాలి నుండి 51 కి.మీ. దూరంలో ఉంది. ఈ పేరుకు పార్సీ భాషలో శవాల దిబ్బ అని అర్థం. కనుమను దాటేందుకు ప్రయత్నించే ప్రజలు ఇక్కడి కల్లోల వాతావరణానికి బలైపోతున్న కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. ఈ కనుమ కులు లోయను హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్, స్పితి లోయలతో కలుపుతుంది. ఇది చీనాబ్, బియాస్ నదుల మధ్య ఉంది. ఈ కనుమ మే నుండి నవంబరు వరకు తెరిచి ఉంటుంది. హిమాలయాల ప్రమాణాల ప్రకారం చూస్తే ఇది పెద్ద ఎత్తులో ఏమీ లేదు. కాలినడకన దాటడం ఏమంత కష్టమూ కాదు, కానీ అనూహ్యంగా వచ్చే మంచు తుఫానుల కారణంగా ఇది ప్రమాదకరమైనదిగా పేరుపొందింది. ఈ కనుమ పిర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న ప్రజల మధ్య ప్రాచీన వాణిజ్య మార్గం.