Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి సౌందర్యానికి పరవశించని వారెవరుంటారు? కాలాలను బట్టి స్థలాల ఎంపిక ఉంటుంది. శీతాకాలంలో చూడదగిన ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అందులో ఒకటే డల్హౌసీ.. దీనినే ప్రకృతి ప్రేమికుల స్వర్గం అని అంటారు. ఇది హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి 1970 మీటర్ల ఎత్తులో.. ఐదు పర్వత ప్రాంతాలలో విస్తరించి ఉంది. ఇక్కడ తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేసవికాలం, వసంత రుతువు ప్రారంభంలో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కుండపోత వర్షం కురుస్తుంటుంది. ఈ ప్రాంతంలో 3 నెలల పాటు మంచు కురుస్తుంటుంది. ఆ సమయంలో ఇక్కడ రాత్రి వేళలో ఏడాదిలో సగటు ఉష్ణోగ్రత 4 డిగ్రీలు, గరిష్టంగా 11 డిగ్రీల వరకు ఉంటుంది. అందువల్ల హిమపాతం ఎక్కువనే చెప్పవచ్చు. ఈ ప్రాంతం మొత్తం పచ్చని తోరణం ఉన్నట్లుంటుంది. ఎటు చూసినా ఆకుపచ్చ రంగు, చిన్న సరస్సులు దర్శనమిస్తుంటాయి. ఈ ప్రాంతానికి శీతల వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడే పర్యాటకులు బాగానే వస్తుంటారు.