Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీ.శే. కె.భీమాంజయ్య గౌడ్, కె.లక్ష్మమ్మ గారలకు ఈ పుస్తకం అంకితం ఇచ్చారు రచయిత. వీర శిలలు శాసన సాహిత్యంలో విశిష్టమైన స్థానం కల్గి వుంది. ఉన్నత కారణముల (ఆశయాలు)కొరకు ఆత్మార్పణము చేసుకొన్ని నిస్వార్థపరుల సంస్మరణకు ఈ వీరశిలలు.
వీరశిలా శాసనములు క్రీ.శ.9వ శతాబ్ధము నుండి ఉన్నట్లుగా అలంపూర్, అచ్చంపేట తాలూకాలోని 'ఉడిమిల్ల' లలో లభించిన శిలాశాసనముల ద్వారా తెలియుచున్నది. అక్కడ 'సర్పదీ' అనే వీరుడు ఉడమేశ్వర స్వామి కోసం ప్రాణలర్పిం చినట్లు విశిదమగుచున్నది. అలాగే మారడుగు గ్రామంలో ఉన్న వీరశిలా శాసనము క్రీ.శ.1298 నాటికి సంబంధించినది.
నలంబ్రోలయ అనునతడు మార్కండేయ ఆలయాన్ని నిర్మించి అందులో అతని కుమారుల గొప్పతనము చాటుకొనుటకు వారి జ్ఞాపకార్థమని రెండు వీరశిలలను వేయించాడు. రాజు సైనికులకు వీర శిలలు వేయించారు.
వీరత్వం అనేది ఏదైనా ముఖ్యమైన కారణానికి లేదా జన్మభూమి కోసం ధైర్య సాహసాలతో తన ప్రాణాలు సహితం లెక్క చేయక అర్పించటము.
ఆర్. చంద్రశేఖరరెడ్డి- డా|| కపిలవాయి లింగమూర్తి గారలు ముందు మాట రాసారు. క్రీ.శ. ఒకటవ శతాబ్ధము నుండి చాయా ప్రతిమలను వేయించినట్లు శీతవాహను, ఇక్ష్వాకుల శాసనాల ప్రతిమలు చెప్పకనే చెప్పుచున్నవి. పాలమూరు జిల్లాలో క్రీ.శ.7వ శతాబ్ధం - 14వ శతాబ్ధంలలోని అంశాలు వీర శిలల్లో లభ్యమవుతున్నాయి.
భర్త శవముతో సహా మరణము చేసిన వారికీ సతీశిలలు వేయించారు. రచయిత పరిశోధనల విశిష్టత ఈ గ్రంథంలోని 5 అధ్యాయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వీర శిలాశాసనాలు - శిల్పాలు - పలు ప్రాంతాల్లోని చరిత్ర - సాహస గాధలు పరిశీలించి పరిశోధించి ఈ గ్రంథం రాసారు. ఈ వీర శిలాశాసనాలు పూడూరు - ఈర్లదిన్నె - వడ్డెమాను - ఇంద్రకల్లు - గద్వాల - ఐజ - ఉమామహేశ్వరం - మన్ననూర్, ఉజ్జెలి - పులిమామిడి - అలంపూర్ - మారుమునుగాల - సుల్తాను పురం - రాజోలి - బోరవెల్లి - జిల్లాపురం - కల్వకోట - తూముకుంట - సూగణర్ - కొప్పునూర్ మొ|| చోట్ల గలవు. ''ఆత్మార్పణ'' అధ్యాయం ప్రామాణికమైంది. ఈ మొత్తం చరిత్ర అధ్యయన వాదులకు చక్కటి కరదీపిక
(రచయిత : కొమ్మిగోని శీనయ్య, పేజీలు : 112, వెల : 100/-, ప్రతులకు : కొమ్మిగోని వాణి, 1-48-4/సి-1, రాధాకృష్ణ కాలనీ, కల్వకుర్తి, నాగర్కర్నూల్ జిల్లా - 509324, సెల్ : 9398602166)
- తంగిరాల చక్రవర్తి,
9393804472