Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈసారి మార్చి కంటే ముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవి తాపం తీర్చుకునేందుకు చల్లని నీరు, పానీయాలు తాగేందుకు అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాగేపుడు చల్లగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.. కానీ ఇలాంటివి తాత్కాలిక ఉపశమనమే.. వేసవి తాపం తగ్గడానికి కొబ్బరిబోండం తాగడం చాలా ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. ఇది వ్యాధి రహితమైన జీవితాన్ని ఆస్వాదించేందుకు సహకరిస్తుంది. రోజువారీ పనులకు ఆటంకం కలిగించే తలనొప్పి వంటి చిన్న రుగ్మతలకు ఇది చక్కని పరిష్కారం. కొబ్బరినీళ్లలలో తేనెను కలిపి ప్రతిరోజు తీసుకోవడం వల్ల రోగ నిరధకశక్తిని పెంపొందించుకోవచ్చు. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కొబ్బరినీళ్లలో ఉన్న విటమిన్ సి వంటి కారకాలు కలిసి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కొబ్బరినీళ్లు, తేనెతో తయారు చేసిన పానీయం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్దకాన్ని నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గ్యాస్ సమస్యలు, కడుపులో మంట, అల్సర్ వంటి వాటిని కొబ్బరి నీళ్లు తగ్గిస్తాయి. కిడ్నీలలో రాళ్ళు కరుగుతాయి, కొబ్బరినీళ్లలో యాంటీ బాక్టీరియా, యాంటి షుగర్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ను, బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తుంది. అందుకే వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడమే ఉత్తమం.