Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కెరటం నాకు ఆదర్శం. ఎగిసి పడుతున్నందుకు కాదు. పడి లేస్తున్నందుకు'' అన్నారు స్వామి వివేకానంద. ఓటమి ఎదురైతే కుంగడం, గెలుపు వరిస్తే పొంగడం కాకుండా స్థితప్రజ్ఞతతో మసులుకున్నవాడే అసలైన మనిషి. అలాంటివారు ఎలాంటి విజయాన్నైనా పొందగలరు. జీవితాన్ని సార్థకం చేసుకోగలరు. జీవితంలో ఆనందాలను అనుభవిస్తూ ఎదుటి వారికి ఆదర్శంగా నిలబడగలరు. కవిత్వం అనేది ఎక్కడో పుట్టదు. చుట్టూ ఉన్న పరిస్థితులను గాంచి మదిసంద్రంలో ఎగిసే భావాల సమాహారమే కవిత్వమై పరిఢవిల్లుతుంది. సంఘర్షణల నుండి, సమస్యల నుండి, స్పందనల నుండి జనించే భావమే కవిత్వం. నానమ్మ, అత్తమ్మ, అమ్మ జీవితాలే నా కవితా దక్పథాలని అంటూ అక్షరాలతో చెలిమి చేస్తూ వివిధ అంశాలను తీసుకొని కవనమాలలల్లారు గౌరోజు అనూశ్రీ తన ''కెరటం'' కవితా సంపుటిలో. మరి తన మదిని తాకిన ఆ భావాల అలలేవో, వాటికి వారు స్పందించిన తీరుతెన్నులేవో, కూర్చిన పద పేటిక లేవో చూసొద్దామా వీరి మొదటి కవితా సంపుటి ''కెరటం''లో.
''సహనంలో అవని'' కవితలో ''తనో నిశ్శబ్ద భావాల కడలినని, నిక్షిప్త అనుభవాల సారాన్నని, సాగరమై ఘోషించే అనంత రాగాన్నని, సప్తనదుల సంగమ తరంగాన్నని, అనంత భావాల వాహిణినని తనను తాను ప్రకటించుకుంటారు. ''ప్రేరణ'' కవితలో ''నాన్న పేరు వినబడగానే తనలో కదులుతున్న గతజ్ఞాపకాలు కన్నీటి కెరటాలై ఎగిసి పడతాయని, తనతో గడిపిన బాల్యం మళ్లీ తిరిగిరావాలని'' వ్యధాభరిత హదయంతో ఆకాంక్షిస్తారు. ''అమ్మ'','' నీతో నేను'' కవితలలో అమ్మప్రేమను, గొప్పదనాన్ని, అనురాగాన్ని, భార్యగా తన పాత్రను హద్యంగా వెల్లడిస్తారు. అదే సమయంలో ''తప్పెవరిదైనా శిక్ష నాకేనంటూ'' నేటి సమాజంలో భార్యను నిందించే సంప్రదాయాన్ని ఎండగడతారు. ''ఆత్మీయతా నీ వెల ఎంత? ఎదుటివాళ్లు గుడ్డిగా నమ్మినంత!'' ''స్నేహమా నీ గడువెంత? నచ్చినట్టుగా నీవెంట నడిచినంత!'' అంటూ ''ఆత్మీయత'' కవితలో వాస్తవాలను నిక్కచ్చిగా ఉటంకిస్తారు. ''ప్రబంధం'' కవితలో ''నా చెంపలపై కారే కన్నీళ్లను చూసి, అరచేతుల్లో మోమును పొదువుకొని ఆరాధిస్తుందని, కొంగులో దాచుకున్న బెంగలన్నీ మాయం చేస్తుందని,'' పుస్తకంతో తనకు గల అనుబంధాన్ని వ్యక్తీకరిస్తారు. ''పండుటాకులు'' కవితలో ''బాధ్యతను మోసి మోసి బరువెక్కిన అడుగులవి, వెలివేతకు గురై భంగపడ్డ హదయాలవి'' అంటూ వద్ధుల వెతలను, మనో వ్యధను కళ్లకు కడతారు. ''మట్టిలోని మాణిక్యాలు'' కవితలో ''రహదారిపై రంగుల చిత్రం రాలే చిల్లరతో సేదదీరుతుంది రైలు బండిలో వెన్నెలగీతం వీనులకు విందై తాకుతుంది'' అని గుర్తింపులేని నైపుణ్యాలు గల మనుషుల వేదనను ఆవిష్కరిస్తారు. ''నాగేటి చాళ్లు'' కవితలో ''నాగేటి సాళ్లలో పొదిమేటి విత్తనాలతో...రైతుల స్వేదాన్ని, ఆశగా పంటకై ఎదురుచూసే రైతన్నలను వివరిస్తారు. ''ఉదయించే సూర్యుడు'' కవితలో పచ్చనిపొలంలో ఉదయించే సూర్యుడిగా కర్షకులను అక్షరీకరిస్తారు. ప్రభుత్వాలు మారినా మారని వారి తలరాతకు చింతిస్తారు. ''అందమైన కావ్యం''లో ''చిన్ని చిన్ని అలకలు, చిట్టి చిట్టి కోరికలతో, రపటి భయమెరుగని బాల్యం, అపురూపమైన కావ్యం'' అంటారు. బాదరబంధీల్లేని చిన్న తనంను మనసుకు హత్తుకునే విధంగా వివరిస్తారు. ''బతుకమ్మ పాట''లో ''బంతిపూల పాట, బాల నవ్వుల పాట, తంగేడు గునుగు తామర మందారాలతో గంగమ్మ ఒడిలో ఒదిగే'' బతుకమ్మను చక్కని పదాలతో కీర్తిస్తారు. ''జీవితం'' కవితలో ''జీవితం తెలియని పాఠాలు నేర్పే గురువని, కాలంతో పాటు నడిపించే నీడని, గెలుపులా ఆశను పెంచి, ఓటమై ఓర్పు నేర్పిస్తుందని'' వాస్తవాలను చిత్రీకరిస్తారు. ''కన్నీటి చిక్క'', చివరిపుట'', ''ఆమెకథ'','' ముగిసిన సమయం'' కవితల ద్వారా జీవనసారాన్ని, మనసు ఆవేదనను, సమాజ స్థితిగతులను కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తారు. ''నేనొక పచ్చని చెట్టునైతే'','' ఆకాశానికేమైందో'', ''సెలయేరు'' కవితల ద్వారా ప్రకతి సౌందర్యాన్ని, చెట్ల ఉపయోగాలను, కాలుష్య మహమ్మారి వింత చేష్టలను ప్రతిబింబింపజేస్తారు. ఇలా... ఈ సంపుటిలో సమాజంలోని సమస్యలను, కుటుంబ ఆప్యాయతలను, స్త్రీల ఔన్నత్యాన్ని, వత్తుల ప్రాముఖ్యతను, స్నేహ విలువలను ప్రస్తావిస్తారు. అలతి పదాలతోనే అనుకున్న భావాన్ని పండిస్తారు. తమ భావాలను యధాతధంగా అభివ్యక్తీకరిస్తారు. అవసరమైన చోట సందేశాలిస్తారు. స్నేహం,ప్రేమ, బాధ, నిర్వేదం, ఆనందం అన్ని స్పందనలను రంగరించి తనదైన శైలిలో కవితలుగా తీర్చిదిద్దారు. ఈ సంపుటిలో 76 కవితల ముత్యాలను సరంగా కుచ్చి పాఠకులకు అందజేసారు. మున్ముందు వీరి కలంనుండి లోతైనా భావాలతో గాఢమైన కవిత్వం వెలువడుతుందని ఆశిస్తూ.. అభినందనలు
(కెరటం, కవయిత్రి : గౌరోజు అనూశ్రీ, పేజీలు : 90, వెల: రూ.150/-, ప్రతులకు : ఇ.నెం 17-14-240/23 తిలక్ నగర్, గోదావరిఖని సెల్: 9666688370)
- అయిత అనిత, 8985348424
ఆమె (స్ఫూర్తివంతమైన మహిళల సక్సెస్ స్టోరీలు), రచయిత : వినోద్ మామిడాల, పేజీలు : 144, వెల : రూ. 130/-, ప్రతులకు : పాషా కయ్యూం, 9848216291, అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
యెల్లో రిబ్బన్ (మోహ లేఖలు), రచయిత : కుప్పిలి పద్మ, పేజీలు : 88, వెల : రూ. 100/-, ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రం, కాచిగూడ.