Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అత్తవారింట్లో మరుగుదొడ్డి లేక పోవడంతో అలిగిన అల్లుడు అది నిర్మించే వరకూ అత్తవారింటికి వెళ్లేది లేదని భీష్మించాడు. జార్ఖండ్ రాష్ట్ర ధన్బాద్ జిల్లాలో భులి పట్టణానికి చెందిన ప్రమోద్కుమార్ 2017 ఏప్రిల్ 15న గిరిదిధ్ జిల్లా జోగ్తియాబాద్ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరునాడే అత్తవారింటికి వెళ్లిన ప్రమోద్ బహిర్భూమికి వెళ్లాల్సివచ్చింది. దీంతో టాయిలెట్ ఎక్కడుందాని అత్తవారింట్లో వాకబు చేయగా వారు అతనికి నీళ్ల చెంబు అందించి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లాలని చెప్పారు. దీంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. ఆ తర్వాత భార్యతో తన స్వగ్రామానికి చేరుకున్న అతడు టాయిలెట్ కట్టేదాకా అత్తవారింటికి వెళ్లే ప్రసక్తే లేదన్నాడు. అంతేకాదు తన భార్యను కూడా వెళ్లనివ్వను అని అడ్డుకున్నాడు. దీంతో దిగొచ్చిన మామ జగదేశ్వర్ పాశ్వాన్ అల్లుడి కోరిక మేరకు మరుగుదొడ్డి నిర్మించేందుకు ఏర్పాట్లు చేపట్టాడు. దీంతో కూరుతు, అల్లుడు త్వరలో ఇంటికి వస్తారనే సంతోషం వ్యక్తం చేశాడు. మన స్వచ్ఛభారత్ ఒట్టి ప్రచారానికే తప్ప వాస్తవంగా గ్రామీణులకు అవగాహన కల్పించి, ఆర్థిక సాయం చేసి మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేయకపోవడం విచారకరం.
- పుప్పాల