Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సంస్క త భాషా మహాపండితులు శ్రీ సత్యవ్రత శాస్త్రిగారు ఢిల్లీ వాస్తవ్యులు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానితులు. వీరిని ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా ఈనెల పదిహేడవ తేదిన ఎల్బీ స్టేడియంలో ప్రధాన వేదికపై మంత్రులు, సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంగా శ్రీధర్ చౌడారపు (సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, తెలంగాణ) శాస్త్రిగారితో జరిపిన సంభాషణ ఇది.
మీ బాల్యం గురించి చెప్పండి
నా జన్మస్థలం లాహౌర్. 29, సెప్టెంబర్ 1930 న అవిభాజ్య భారతదేశంలో జన్మించాను.
అవునా? మరి భారతదేశానికి ఎప్పుడు వచ్చారు.
దేశ విభజనతో లక్షలాది మంది ఇతరులతో పాటు మా కుటుంబమూ భారత సరిహద్దులుదాటి అంబాలా చేరుకున్నాము. అంటే నాటి పశ్చిమ పంజాబ్ నుండి తూర్పు పంజాబ్ లోని అంబాలాకు వచ్చి స్థిరపడ్డామన్నమాట.
మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం గురించి.
నాన్న గారు సంస్కృత అధ్యాపకులు. అమ్మ గృహిణి. నాకు ఒక అక్క ఉండేది. దేశ విభజనకు ముందే ఆమెకు వివాహం జరిగింది. ఆమెను జలంధర్ కు చెందిన ధర్మవీర్ గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వారు ఐఏయస్ రిటైర్డ్. వారు డైరెక్టర్ జనరల్, స్మాల్ ఇండిస్టీస్ కార్పరేషన్ ఆఫ్ ఇండియాగా పనిచేసి రిటైరయ్యారు.
మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి.
మాది పూర్తి సాంప్రదాయ కుటుంబం. నాన్న గారు లాహౌర్ లోని ఓ పాఠశాలలో సంస్కృత అధ్యాపకులు కావడంతో నన్ను సంస్కృత భాషలో పండితునిగా చూడాలనుకున్నారు. అందుచేత ఎనిమిదవ తరగతి వరకు సంస్కృతం నాన్నగారి వద్ద ఇంటివద్దనే ప్రాచీన పద్దతిలో చదివాను. తరువాత ఒక ప్రవేశ పరీక్ష రాసి తొమ్మిదో తరగతిలో మా పట్టణం లాహౌర్లోని డిఏవి (దయానంద ఆంగ్లో వేదిక్) స్కూల్ లో చేరాను. పదో తరగతి వరకూ అక్కడే చదివాను. అంబాలాలో గాంధీ మెమోరియల్ నేషనల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. తరువాత బి. ఏ సంస్కృతం (ఆనర్స్) పూర్తి చేశాను. అందులో 336/350 మార్కుల సాధించి యూనివర్సిటీ 125 ఏళ్ళ చరిత్రలోనే చెరిగిపోని రికార్డు నెలకొల్పాను. ఇప్పటికీ అదే రికార్డు ఉంది .పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి డాక్టరేట్ వరకు మిగిలిన విద్యాభ్యాసమంతా బనారస్ లో జరిగింది.
మీరు ఎక్కడెక్కడ ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు
ఢిల్లీలో హన్సరాజ్ కాలేజీలో 1957 లో లెక్చరర్ గా, కురక్షేత్రలో 1959 సీనియర్ లెక్చరర్ గా పనిచేశాను. ఢిల్లీ యూనివర్సిటీ పీజీ డిపార్ట్మెంట్ లో లెక్చరర్గా 1959లో నియామకం పొంది 1995లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను.
విజిటింగ్ ప్రొఫెసర్ గా థాయిలాండ్, బెల్జియం, జర్మనీ, అమెరికా దేశాల్లో ఆరు యూనివర్సిటీల్లో పనిచేసాను. శ్రీ జగన్నాథ్ సంస్క త్ యూనివర్సిటీ పూరీ, ఒరిస్సా కు ఉపకులపతి గా 1982 నుండి1984 వరకు పనిచేశాను
మీకు సాహిత్య అకాడమీ అవార్డు ఏ రచనకు వచ్చింది. వచ్చినప్పుడు మీ అనుభూతిని తెలపండి.
నాకు 37 ఏళ్ళ వయసులో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ జీవితాన్ని సంస్కృత భాషలో ''గురుగోవింద్ సింహ చరితం'' అని నేను రాసిన గ్రంథానికి ఆ అవార్డు ఇచ్చారు.
ఆ గ్రంథాన్ని 1967 జూన్ మాసంలో మొదలు పెట్టి నవంబర్ లో పూర్తి చేసాను. మొదలుపెట్టిన ఎనిమిది నెలల్లోనే అనగా 1968 ఫిబ్రవరి నెలకల్లా దానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సంస్కృతభాషలో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వారిలో అత్యంత పిన్న వయస్కడిని నేనే. అంత తక్కువ సమయంలో దానికి అవార్డు దక్కుతుందని ఊహించని నాకు అది ఎంతో అద్భుతమైన అనుభూతిని అందించి ఆనందపరిచింది.
మీకు వచ్చిన జ్ఞానపీఠ అవార్డు విశేషాలు తెలుపగలరా?
2009 సంవత్సరంలో వచ్చింది. అవార్డు ఇస్తున్నట్లుగా 19.08.2009 నాడు ప్రకటన వచ్చింది.
సంస్కృతభాషలో నేను రాసిన 'శ్రీ రామచరిత మహాకావ్యం' అనే గ్రంథానికి ఈ అవార్డు దక్కింది. ఇది ఇరవై ఐదు సర్గలతో, రెండువేల శ్లోకాలతో కూడిన నాలుగు వందల పేజీల గ్రంథం, ఇది థాయిలాండ్ లో 1990 లో మొదటిసారి ప్రచురితమయింది. తరువాత మరో రెండు ప్రచురణలూ అయ్యాయి.
మొత్తం మీద ఎనిమిది భారతీయ భాషల్లో, మూడు విదేశీ భాషల్లో ప్రచురితమయింది. ఆధునిక సంస్కృత సాహిత్యంలో అత్యధిక భాషల్లోకి అనువదితమైన గ్రంథం ఇదే. ప్రస్తుతం ఇది చైనా భాషలోకి కూడా అనువాదమై అక్కడే ప్రచురితమవుతున్నది.
తెలుగులో ప్రొ. ధూళిపాళ రామకృష్ణ గారు దానిని అనువదించారు. శ్రీ వెంకటేశ్వర వైదిక్ యూనివర్సిటీ, తిరుపతి వారు ప్రచురించారు.
మీరు ఇప్పుడు ఇంకా కొత్తవి ఏమైనా రాస్తున్నారా
ఆగేయ ఆసియా దేశాల సంస్కృతిలో రామాయణం వీరి సంస్కృతిపై రామాయణం ప్రభావాన్ని గురించి ఒక విపులమైన గ్రంథాన్ని రాయబోతున్నాను. దానిని ఎనిమిది సంపుటాలుగా రాస్తున్నాను.
సంస్కృతభాషలో ఆత్మకథ ప్రక్రియ ఆంతగా లేదు. అందుకే నా జీవితం, అనుభవాలు, పరిచయాలు, నేను తిరిగిన ప్రదేశాలు, నా సాహిత్యం, నేను చదివిన సాహిత్యం ఇత్యాదిగా నా ఆత్మకథను రాస్తున్నాను. అది నాలుగు సంపుటాలుగా తయారవుతోంది. మూడు సంపుటాలు కలిపి ఓ వెయ్యి పేజీలయ్యింది. నాలుగో సంపుటం మరో మూడు నాలుగు వందల పేజీలుంటుంది. త్వరలోనే ప్రచురితమయింది.
ఇప్పటి వరకు మీరు రచించిన గ్రంథాలు ఎన్ని వాటిలో మీకు అత్యంత ఇష్టమయిన రచన ఏది?
ఇప్పటి వరకు నేను 40 గ్రంథాలు పద్యం, గద్యం విధానాల్లో రాశాను. అందులో ఒక గ్రంథం 8 సంపుటాలుగా ఉంది. ఆ రీతిన చూస్తే 47 గ్రంథాలు రాశాను. ఇక పోతే నేను రాసిన అన్ని పుస్తకాలు నాకు ఇష్టమైనవే. అయినప్పటికీ రెండు గ్రంథాలు, 'రామాయణ్, ఎ లింగ్విస్టిక్ స్టడీ', 'రామకీర్తి మహాకావ్యం' నాకు మిక్కిలి ఇష్టమయున రచనలు
మీ రచనల ద్వార మీరు ఇచ్చిన సందేశం ఏమిటి
ప్రజలు తమ దేశ సంప్రదాయం మరిచిపోకూడదు. భారతదేశం గొప్ప వారసత్వం కలిగినట్టిది. దానిని పాటిస్తూ ఆధునాతన ఆవిష్కరణలు చేయాలి. వాటి లాభాలు పొందాలి ఇతరులకు పంచాలి.మనుష్యుడు తన జీవితంలో నిజాయితీ కలిగి ఉండాలి. సమరస భావంతో ప్రజలు కలిసి జీవించాలి
మీకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా లభించాయి కదా. అవి ప్రకటించిన సమయంలో మీ అనుభూతి ఏమిటి?
నాకు1999 లో పద్మశ్రీ, 2010 లో పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి. విద్యారంగంలోనూ, సాహిత్యంలోనూ నేను చేసిన క షికి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు అది. ఇవి నాలో ప్రజలపట్ల నా కర్తవ్యాన్ని మరింత గుర్తుచేసిన పురస్కారాలు. మొత్తంగా నాకు ఇప్పటి వరకు102 అవార్డులు వచ్చాయి. ప్రతి అవార్డు నాకు సమాజం పట్ల నా నిబద్ధతనీ, కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటుంది.
తెలుగులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలైన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ సి. నారాయణరెడ్డి గార్లతో మీ పరిచయం ఎలాంటిది.
విశ్వనాథ సత్యనారాయణ గారితో మంచి పరిచయం ఉంది. మేము ఇద్దరం ఒకసారి కేరళలోని సాహిత్య సమాలోచనలో కలుసుకున్నాం. ఆ వారం రోజుల సమయంలో వారితో సన్నిహితంగా గడిపాను. వారి తెలుగులో సంస్కృతపు సువాసనలు ఉండటం వల్లను, వారు నా సంస్కృతాన్ని అర్థం చేసుకోవడం వల్ల మామధ్య సంభాషణలు కొనసాగి హాయిగా గడిపాము. వారు చాలా సరళురు. సీదాసాదా మనిషి. ఇకపోతే సి. నారాయణరెడ్డి గారు తెలుసు. కానీ పరిచయం అంతగా లేదు.
మీ ఈ మూడురోజుల హైదరాబాద్ పర్యటన ఎలా అనిపించింది.
చాలా బాగుంది. మంత్రులు ఆదరాభిమానాలతో ప్రధాన వేదికపై ఘనంగా సత్కరించారు. తెలుగు కవులు ఎన్. గోపి గారిని, కె. శివారెడ్డి గారిని, కొలకులూరి ఇనాక్ గారితో ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా కలిసి సంభాషించాను. నా పూర్వశిష్యులైన శ్రీ కేశవనారాయణ వేదాలంకార్ ( ఆర్ట్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్), శ్రీ రాములు (సంస్స్క తం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ) లను కలుసుకోగలిగాను. వివిధ పత్రికలు ఇంటర్వూలు తీసుకున్నాయి. ఆకాశవాణివారు కూడా బాగా ఆదరించారు.
ప్రపంచ తెలుగు మహాసభల పై మీ అభిప్రాయం ఏమిటి?
ఇంతమంది తెలుగు సాహిత్యకారులు ఒక్క చోటికి రావడం చాలా గొప్పవిషయం. కవులు, రచయితలు, ఉపన్యాసకులు, సాంస్కృతిక కార్యకర్తలు ఒక్కచోట చేరటం, వాళ్ళ ప్రతిభను వ్యక్తం చేయటం, దృశ్యమానం కావించటం, పరిచయాలు పెంచుకోవటం వల్ల ఆదాన ప్రదానాలు జరిగి భాషా సంస్కృతుల అభివ ద్ధి మరింతగా జరుగుతుంది. వికాసానికి ఇది మంచి ప్రయత్నం. ఇది కొంత కాలావధితో నిరంతరం జరగాల్సిన కార్యక్రమం.
ఇంటర్వ్యూ : శ్రీధర్ చౌడారపు, 9440032211