Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెండితెరపైనే కాదు యావత్ భారతీయ ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసిన నాయకానాయికలు రాజ్కపూర్, వహీదా రెహ్మాన్.
పాత్రలు, సినిమాల ఎంపికలో వీరిద్దరి శైలి చాలా విలక్షణం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా 'గ్రేటెస్ట్ షో మాన్ ఆఫ్ హిందీ సినిమా'గా రాజ్కపూర్ పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా భారతీయ సినిమా చరిత్రలో సినిమాని అత్యంత ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను కైవసం చేసుకున్న రాజ్కపూర్ 'ద క్లర్క్గాబ్లే ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండిస్టీ'గా అంతర్జాయంగా పేరొందారు.
తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళం వంటి భాషల్లో ఎన్నో భిన్న చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన కథానాయిక వహీదా రెహ్మాన్. జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్న వహీదా 'జయసింహ', 'రోజులు మారాయి' వంటి తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచారు. డాక్టర్ కావాలనుకున్నప్పటికీ పరిస్థితుల కారణంగా వహీదా తెరంగేట్రం చేశారు. అందం, అద్భుతమైన అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేయడంలో వహీదా తనకు తానే సాటి.
'ప్యాసా', 'కాగజ్ కే ఫూల్', 'సోల్వా సాల్', 'కాలా బజార్', 'సాహిబ్ బీబీ ఔర్ గులామ్', 'రాఖీ', 'ముఝే జానే దో', 'ఆద్మీ', 'ఖామోషీ', 'అధాలత్', 'చాందిని' వంటి తదితర ఎన్నో చిత్రాలు ఆమె అసమాన నటనా ప్రతిభకు మచ్చుతునకలు. అత్యంత ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వహీదా 2006లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని సైతం దక్కించుకోవడం విశేషం.