Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దసరా పండుగనాడు దేశ వ్యాప్తంగా రావణాసురవధ జరగడం ఆనవాయితీ. కానీ మహారాష్ట్రలో మాత్రం వెరైటీగా రావణాసురిడి సోదరి శూర్పణఖ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఆచారం కాదు. భార్యల వల్ల పడుతున్న అగచాట్లను తెలియజేయడం కోసం ఇలా శూర్పణక దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వెరైటీ ఘటన ఔరంగాబాద్లోని కరోలి గ్రామంలో జరిగింది. 'పత్నీ పీడిత్ పురుష్ సంఘటన' (భార్య బాధితుల సంఘం) సభకు చెందిన సభ్యులు తమ భార్యలపట్ల నిరసన వ్యక్తం చేయడం కోసం ఈ పనికి పూనుకున్నారు. ఈ విషయం గురించి ఆ సంఘానికి చెందిన ఓ వ్యక్తి మా భార్యలు మమ్ములను చాలా బాధపెడుతున్నారు. మన దేశంలో మహిళలకే అనుకూలంగా చట్టాలు ఉన్నాయి. వీటిని అడ్డు పెట్టుకుని భార్యలు మమ్ములను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. భార్యల వేధింపులకు గుర్తుగా మేము ఈ రోజు ఇలా శూర్పణక దిష్టిబొమ్మను దహనం చేశామన్నాడు. అనాది కాలం నుండి పురుషుల వేధింపులు ఎంత ఎక్కువగా లేకపోతే మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తేవాల్సి వచ్చింది. ఇలా చూస్తే వేధింపులకు గురయ్యే స్త్రీలు రోజూ ఎందరి పురుషుల దిష్టిబొమ్మలు కాల్చాలో.
- పుప్పాల