Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోతి దాడి చేసింది కేసుపెట్టాలని వచ్చిన ఓ వ్యక్తిని గతంలో చూశాం. ఇప్పుడు కోడిపుంజుపై కేసు పెట్టాలని స్టేషన్కు వచ్చిన వార్త వైరల్ అవుతోంది. కోడిపుంజుపై కేసు పెట్టడం ఏంటని షాకవుతున్నారా? నిజమండీబాబూ.. మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన పప్పు జాదవ్, లక్ష్మీ దంపతులకు సంతానం లేకపోతే ఓ కోడిపుంజును తెచ్చి పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో పప్పు జాదవ్ పొరిగింట్లో ఉండే ఐదేళ్ల చిన్నారి రాధిక రోడ్డుపై ఆడుకుంటోంది. ఈ లోపే ఈ కోడిపుంజు కూడా అటువైపు వెళ్లింది. ఏమి జరిగిందో ఏమో కానీ కోడిపుంజు ఐదేళ్ల చిన్నారి బుగ్గపై పొడిచింది. రక్తం రావడంతో ఏడవడం మొదలు పెట్టింది. తల్లి వచ్చి ఏం జరిగింది అని అడిగింది. కోడి పొడిచిందని చెప్పింది రాధిక. రాధిక తల్లిదండ్రులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెళ్లి కోడిపుంజును తీసుకొచ్చి కేసు నమోదుచేసి జైల్లో పెట్టారు. చివరకు ఇరుపక్షాలనూ కూర్చోబెట్టి కేసు రాజీ కుదిర్చారు పోలీసులు.
- పుప్పాల