Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా కూరగాయలు, పండ్లను ఫ్రిజ్లలో నిల్వ వుంచుతారు. ఇలా భద్రపరిచి ఎక్కువ రోజులు వాటుకుంటుంటారు. అయితే కొన్ని పదార్థాలను మాత్రం ఫ్రిజ్లో నిల్వ వుంచరాదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఫ్రిజ్లో నిల్వ వుంచడం వల్ల వాటి సహజ గుణం, రుచి కోల్పోతాయట. ఆ పదార్థాలు...
ఉల్లిపాయలు : వీటిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల మృదువుగా మారతాయి. పైగా నిమ్ము తగలడం వల్ల బూజుపట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ఉల్లిపాయల్ని చల్లని, పొడి వాతావరణంలో, ఇతర కూరగాయలకు దూరంగా నిల్వ చేయాలి. లేదంటే మిగిలిన కూరగాయలు కూడా చెడిపోయే ప్రమాదముంది.
అరటిపండ్లు : వీటి రుచి సహజంగా, మధురంగా వుంటుంది. అరటిపండ్లని ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల వాటి సహజ రుచితో పాటు అందులోని పొటాషియం కూడా పోతుంది.
బంగాళదుంపలు : వీటిని ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి కానీ దుంపల్లోని పిండిపదార్థం చక్కెరగా మారిపోతుంది.
టమాటాలు : టమాటాలని ఫ్రిజ్లో వుంచడంవల్ల రుచిని కోల్పోవడమే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉంది.
ఆలివ్ ఆయిల్ : ఆలివ్ ఆయిల్ని ఫ్రిజ్లో పెడితే దాని స్థిరత్వాన్ని కోల్పోతుంది. పైగా హానికారక క్రియులు తయారై అనారోగ్యాన్ని కలిగిస్తాయి.