Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కడివడైనానేమి ఖరము పాలు అని వేమన చెప్పినప్పటి కాలానికి ఇప్పుటికి పరిశీలిస్తే కాలం పూర్తిగా మారిపోయింది. ఎందుకూ పనికి రావనుకున్న గాడిద పాలకు నేడు ఎంతో గిరాకీ పెరిగింది. అందుకే ఇప్పుడు చాలామంది చెంచాడైనా చాలు ఖరము పాలు అని ఆత్రంగా తాగుతున్నారు కొందరు. ఇటీవల తమిళనాడులో గాడిద పాలకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. అన్నవాసల్ ప్రాంతంలో 100 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.500కు విక్రయిస్తున్నారు. పుదుకోట జిల్లాలోని అన్నవాసల్, ఇలుప్పూర్, ముక్కన్నమైయెపట్టి గ్రామాల్లో విరుదాచలానికి చెందిన 10 మందికి పైగా ఊరూరా తిరిగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. అడిగిన వారికి అక్కడికక్కడే పాలు పితికి ఇస్తున్నారు. పాలు ఒక చెంచా రూ.50, 100 మి.లీ.రూ. 500లకు విక్రయిస్తున్నారు. ఈ పాలు తాగితే జలుబు, దగ్గు, కామెర్లు వంటి వ్యాధులు నయం అవుతాయని చెప్పి వ్యాపారం చేస్తున్నారు. దీంతో ప్రజలు కొనుగోలు చేసి మరీ కొంటున్నారు. అందుకే ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయని అంటారు.
- పుప్పాల