Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్ లోని గండికోటను అనుకుని ఉత్తరదిశలో ఎర్రమల కొండల నడుమ సుమారు 8 కిలోమీటర్లు వ్యాపించిన పెన్నాలోయ సహజ కందకంలాగా కోటకు రక్షణగా ఉంది. పెన్నా పరీవాహక ప్రాంతంలో దాదాపు 300 అడుగుల లోతు 250 అడుగుల వెడల్పున్న ఈ రాతిగట్లలోయ రాతిబండలు సహజంగా గోడలై నిలబడ్డట్లు ఉంటుంది. రంగనాథస్వామి ఆలయానికి ఉత్తరంగా పెన్నా వైపు ఉన్న రాతిలోయలో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక గుహ ఉంది. దీనిని స్థానికులు దొంగల పడవ లేదా లంజల పడవ అంటారు. పడవ అంటే ఇక్కడి వాడుక భాషలో చదునైనరాయి అని అర్ధం. ఈ గుహలో ఉన్నవారు బయటికి కనిపించరు కానీ బయటివారు లోపట ఉన్నవారికి కనిపిస్తారు. పైగా ఎండ తీవ్రంగా వున్నప్పుడు కూడా లోపట చల్లగా వుండటంతో పాటు గాలి కూడా బాగా వీస్తుంది.
నదీతీరాలలోని ఇటువంటి అనుకూలమైన తావులను ఆదిమానవులకాలం నుంచి కూడా అవాసాలుగా వినియోగించిన ఆనవాళ్లు మనకు అనేకచోట్ల కనిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ పుడక(పుల్ల)చిత్రాలను పోలిన మానవాక తులు తెల్లని వర్ణంలో గీయబడి ఉన్నాయి. రాక్ ఆర్ట్ లో వైట్ కలర్ కొంత ప్రత్యేకమైనది.
గుహ అంచున వున్న ఈ తావులో బహుశా అప్పట్లో పడుకుని గీస్తే కానీ సాధ్యపడని విధంగా ఉన్నాయి చిత్రాలు. ఇదే పరిసర ప్రాంతాలలో మూడేండ్ల క్రితం ఎరుపు రంగులోని రాతి చిత్రాలను ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్న ఏనుగుల రామక ష్ణారెడ్డి వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడు కొత్తగా కనుక్కున్న తావులు వాటికి అదనం. ఆహార సేకరణ అనంతరం, వర్షం, ఎండ ఎక్కువగా వున్నప్పుడు ఇటువంటి తావులలో విశ్రాంతి తీసుకునే పురామానవుడు తన మనసులోని వివిధ ఆలోచనలకు ఇలా బొమ్మలరూపం ఇవ్వడం మనకు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. పరిసరాలలో దొరికే ఎర్రరాళ్లు (హేమాటైట్), నల్లరాళ్లు (మాగటైట్) సుద్దరాళ్లు (koalin and ground Calcite) లాంటి వాటిని జంతువుల కొవ్వు, గింజలనూనెల వంటి వాటిలో రంగరించి రంగుని తయారుచేసేవాడు.
మొత్తంగా ఇది ఒక వేటదశ్యం అనిపిస్తున్నది. గుంపులుగా ఏదో క్రతువు కోసం నిలబడ్డట్లు ఉన్న ఆకారాలు, నిండు చంద్రుడిని పోలిన బొమ్మ కనిపించాయి. ఈ రాతిచిత్రంలో ఏడుగురు మనుషులు కనిపిస్తున్నారు. ఇంకా కనిపించని బొమ్మలు మరికొన్ని వున్నాయి. మగమనుషులను జననాంగాలతో గుర్తుపట్టొచ్చు. వేటగాళ్ళ గుంపు మధ్యలో వున్న వేటజంతువు అడవిపంది. వేటాడేతీరు, వాళ్ళు ధరించిన ఆయుధాలు, పురామానవుల జీవన సంస్కృతికి అద్దంపట్టిన చిత్రమిది. ఈ చిత్రాలకు వాడిన తెలుపురంగు అరుదైంది. ఈ చిత్రాలు తెలంగాణలోని వరంగల్ జిల్లా బందారం గుట్టల్లోని తెలుపురంగు చిత్రాలతో, హైద్రాబాద్ లోని కోకాపేటగుహల చిత్రాలు, మెదక్ జిల్లా ఎడితనూర్ రాతిచిత్రాలతో పోలికలు కలిగివున్నాయి. చిత్రాల శైలి, జననాంగాల చిత్రణ, వేటతీరు చిత్రాలన్నింటి ఆధారంగా ఇవి చాల్కోలితిక్ ( తామ్ర యుగం) కాలానికి చెందిన చిత్రాలని చెప్పొచ్చు.
- శ్రీరామోజు హరగోపాల్