Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజస్థాన్లోని పుష్కర్ పశువుల సంతకు చాలా ప్రసిద్ధి గాంచింది. రంగు రంగుల తలపాగాలతో తమ గుర్రాలను, ఒంటెలను తీసుకొని వచ్చే వారితోను, వాటిని కొనడానికి వచ్చే వ్యాపారులతోను కళకళలాడుతూ ఉండే పుష్కర్ సంత రాను రాను కళావిహీనమై పోతూ ఉన్నది. 1990 వరకు ఒంటెలు, గుర్రాలతో కిటకిటలాడే సంత ఇప్పుడు బోసిపోయిన ఎడారిలానే కనిపిస్తుంది. పశువులను కట్టెయ్యడానికి, టెంట్లు వేసుకోవడానికి పాతిన కర్రలు, మొద్దులతో వెలవెల పోతూ చూపరులను వెక్కిరిస్తూ కనిపిస్తుంది. ఈ సంతను చూడటానికి విదేశీయులు పోటెత్తేవారు. ఫొటోగ్రాఫర్లు పండుగచేసుకునేవారు. అటువంటి సంతలో ఇప్పుడు గుర్రాలు, ఒంటెలు ఎందుకు కనుమరుగుతున్నాయా అని ఆరా తీస్తే... యాంత్రీకీకరణ ఇందుకు కారణమని తేలింది. ఈ జంతువులతో చేసే పనులన్నీ ఇప్పుడు యంత్రాలతో చేయడం వీటివినియోగం బాగా దగ్గింది. అందువల్ల ఈ జంతువులను పెంచి, పోషించేవారు తగ్గిపోయారు. 2017లో ఈ పశువుల మేళాలో అత్యంత తక్కువ పశువులు పాల్గొన్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వం గుర్రాలను ఇక్కడికి రాకుండా నిషేధించడమే. పుష్కర్కి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో భయంకరమైన అంటు వ్యాధితో ఒక గుర్రం చనిపోవడంతో, ఆ వ్యాధి మిగతా గుర్రాలకు వ్యాపించి నష్టం కలుగజేస్తుందనే భయంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన పుష్కర్ మేళా ఈ విధంగా క్రమంగా కాంతి విహీనంగా మారిపోతూ ఉండటం స్థానికులకే కాదు భారతీయులందరికీ భాధాకరమైన సంగతే!