Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బస్సులో ప్రయాణించే చిన్నారులకు అరటికెట్ తీసుకోవడం సాధారణం. అయితే కోళ్లకు కూడా అర టికెట్ తీసుకోవాల్సిందేని కండక్టర్ ఒత్తిడి చేయడంతో ఓ ప్రయాణికుడు తన కోళ్లను తీసుకొని మధ్యలోనే బస్సు దిగి వెళ్లిపోయాడు. దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి సమీపంలోని కుప్పెట్టికి చెందిన వ్యక్తి శిరాడి కారణికలోని ప్రసిద్ద దేవస్థానంలో మొక్కులు తీర్చుకునేందుకు రెండు కోళ్లను కొన్నాడు. వాటిని తీసుకొని సంచిలో ఉంచుకొని ఉప్పినండి సకలేశపురల మధ్య నడిచే కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కాడు. అయితే రెండు కోళ్లను చూసిన కండక్టర్ వాటికి అరటికెట్ తీసుకోవాలన్నాడు. ఒక్కో కోడికి రూ. 77 చొప్పున రూ. 154 చెల్లించాలని సూచించాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన వాదులాట జరిగింది. ప్రాణంతో ఉన్న కోళ్లను తీసుకెళ్లాలంటే తప్పని సరిగా టికెట్ తీసుకోవాలని, ఇది ప్రభుత్వం అదేశామని కండక్టర్ తేల్చి చెప్పాడు. దీంతో ఆ ప్రయాణికుడు మధ్యలోనే బస్సు దిగి వెళ్లాడు.
- పుప్పాల