Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న సంవేదనల సమాహారం
వికారి, మాడభూషి సంపత్కుమార్, పేజీలు:72, వెల:50/-, ప్రతులకు:సంపత్, 09444075128,
ప్రముఖ పుస్తక కేంద్రాలు
''రైతు కథకు విశ్రాంతి ఉండదు, విరామం ఉండదు/ తరతరాలకు సాగుతూనే ఉంటుంది/ ఆత్మవంచన చేసుకొనేవాళ్ళు ఉన్నంతవరకు/రైతు ఆత్మకథ రాసుకోలేడు'' అంటూ వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల సంవేదనని అక్షరీకరించారు మాడభూషి సంపత్కుమార్. విభిన్న సందర్భాల్లో రాసిన కవితల్ని ఉగాది సందర్భంగా 'వికారి'తో పేరు వెలువరించారు. ఈ పుస్తకంలో 29 కవితలున్నాయి. క్లుప్తత, సంక్షిప్తత, ఆర్ద్రత కలగలసిన కవిత్వమిది. ''చెరువులో అపార్ట్మెంట్ కట్టినప్పుడు/ చెరువు కడుపులో మట్టి గొట్టినప్పుడు/ అది ఎంతగా విలపించిందో ఎవరికి తెలుసు'' అంటూ 'చెరువు శాపం' కవితలో చెబుతారు. వర్షాలకు అపార్ట్మెంట్ల పార్కింగ్ స్థలాలు చెరువులుగా మారడం చూస్తున్నాం. ఆధునిక జీవన సంక్షోభాన్ని ఈ రీతిన చాలా కవితల్లో చెప్పారు సంపత్కుమార్. మరణం, భయం, ఏడుపు, ప్రకృతి, చీకటి, చింతన, విసర్జన వంటి కవితలు కవిలోని తాత్వికతని పట్టిస్తాయి. ఇటీవలి కాలాన వచ్చిన మంచి కవిత్వమిది.
- వికర్ణుడు
మానవుణ్ణి కేంద్రంగా చేసిన కవిత్వం
అజేయుడు మానవుడే, డా||ఎ.వి.వీరభద్రాచారి, పేజీలు : 228, వెల : 150/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
''నా కవిత్వంలో/ పడికట్టు పదాలు లేవు వర్ణనలు లేవు/ కథాకథనాలు కూర్పులు లేవు/ పునరుక్తాలు లేవు/ క్రమవిస్తృతిలో పేర్చటాలు లేవు'' అంటూ కవిత్వ విన్యాసం చేస్తున్న కవి డా||ఎ.వి.వీరభద్రాచారి. వీరందిస్తున్న పన్నెండో పుస్తకం 'అజేయుడు మానవుడే'. ఇది కవిత్వ రచన. ఔను, ఈ కవికి మానవుని పట్ల అపారమైన ప్రేమ, సానుభూతి వున్నాయి. అందుకే ''దోచుకు తింటున్న దోపిడీ వ్యవస్థను/ దుర్మార్గపు దళారి వ్వస్థను/ పెట్టుబడి దార్లను/ భూస్వామ్య వ్యవస్థను కూలదోస్తూంది/ మనిషి మూడో నేత్రం'' అనే నమ్మకంతో వుంటాడు. సాధారణ మనిషి తలచుకుంటే మహనీయుడవుతాడనే భావన గల కవి ''మనిషికి స్వంత వ్యక్తిత్వం వుండాలంటాడు. దేహి అనడం, దేబిరించడం కూడా వద్దంటాడు. ''ఎగిరే స్వేచ్ఛను, తిరిగే స్వేచ్ఛను అడుక్కోకూడదు'' అని సలహా ఇస్తాడు. మనిషి కేంద్రస్థానంగా వీరభద్రాచారి తన కలాన్ని సాగిస్తూ ''తీగలా మనిషిని అల్లుకుపోతూ/ ఈగలా ఊరిలో తిరుగుతుంటే/ డేగలా రాబందు చప్పుళ్ళను/ వేగంగా వింటూ పొలిమేర వరకు తరుముతా'' నంటూ భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు.
పాలక వర్గాల ప్రాపుకోసమో, దోపిడీ వర్గాల దాపు కోసమో ఈ కవి తాపత్రయ పడటం లేదు. జీవితంలో అనేక పార్శ్వాల్ని స్పృశిస్తూ సాదాసీదాగా, ఎలాంటి దాపరికాలు లేకుండా సూటిగా స్పష్టంగా రాసిన ఈ కవిత్వం పామర జనానికి సైతం పాఠాలు నేర్పగలిగేటట్లుంది.
- కె.హరనాథ్, 9703542598
భూగోళ విజ్ఞానం సురవరం ప్రతాపరెడ్డి
పేజీలు : 64, వెల : 40/-
ప్రతులకు : తెలంగాణ ప్రచురణలు, ఇందిరా నివాస్, 3/97, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. ఫోన్ : 9849220321
కాళీ పదములు పాలపర్తి ఇంద్రాణి
పేజీలు : 56
వెల : 60/-
ప్రతులకు : కేరాఫ్ పాలపర్తి సువర్ణ లత, అపార్ట్మెంట్ 502, ఎపిహెచ్బి టవర్స్, జి.వి.ఆర్ మ్యూజిక్ కాలేజి ఎదురుగా, దుర్గాపురం, విజయవాడ - 520003
మూడు ఎలుగుబంట్లులియో టాల్స్టాయ్
వెల : 45/-
ప్రతులకు : మంచి పుస్తకం, 12-13- 439, స్ట్రీట్ నెం.1, తార్నాక, సికింద్రాబాద్ - 17
ఇందుమతి కవిత్వం
సంపాదకులు : సంగిశెట్టి శ్రీనివాస్, పేజీలు : 120
వెల : 70/-, ప్రతులకు : తెలంగాణ ప్రచురణలు, ఇందిరా నివాస్, 3/97, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
ఫోన్ : 9849220321
ఆకాశంలోకి... ఇంకా పైపైకి
అనువాదం : దాసరి వెంకట రమణ, వెల : 55/-, ప్రతులకు : సంచాలకులు, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, నెహ్రూభవన్, 5 ఇన్ట్సిట్యూషనల్ ఏరియా, ఫేస్ 2, వసంత్ కుంజ్, కొత్త ఢిల్లీ.