Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ, పురుషులు వివాహం చేసుకోవడం సహజం. గతంలో పురుషులు, పురుషులు కూడా రహస్యంగా సహజీవనం చేయడం కూడా చూశాం. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో చాలామంది తమ బంధం గురించి బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఒకడుగు ముందుకేసి వివాహం కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వరుసకు అక్కా చెల్లెలు అయిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. వారణాసిలో ఈ ఘటన కలకలం రేపింది. ఇటువంటి వివాహం జరగడం వారణాసి చరిత్రలో మొదటిదని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాన్పూర్కు చెందిన ఓ యువతి తనకు చెల్లి వరుస అయ్యే మరో యువతిని స్థానిక శివాలయానికి తీసుకెళ్లింది. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో.. ఎరుపు రంగు చున్నీని ముఖానికి ధరించి వెళ్లారు. తమకు పెళ్లి జరిపించాలని పూజారిని కోరారు. అయితే ఆయన మాత్రం ఇందుకు నిరాకరించారు. అయినప్పటికీ అక్కడే భీష్మించుకుని కూర్చున్న సదరు యువతులు తమకు తాముగా వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారాయి. స్త్రీ, పురుషులు పెళ్లిచేసుకోవచ్చు, స్త్రీలైనా పురుషులైనా స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవచ్చు కానీ అక్కాచెల్లెళ్లు పెళ్లిచేసుకోవడం ఏంటని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
- పుప్పాల