Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా నియంత్రణ సాధ్యం కాని సమస్య ఏదైనా ఉంటే అది ప్లాస్టికే. ప్లాస్టిక్ వల్ల సముద్ర జీవులు కూడా మృత్యువాత పడటం చూస్తున్నాం. ఇక మన ప్రాంతాల్లో ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు తిన్న పశువులు ఎన్నో మృత్యువాత పడటం చూస్తున్నాం. ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తెచ్చినా.. ప్లాస్టిక్ నియంత్రణకు ఎంతలా పాటుపడుతున్నా ఏదో ఓ మూల ప్లాస్టిక్ వల్ల హాని జరుగుతూనే ఉంది. ఈ హానిని కొంత మేర ఎదుర్కొనేందుకు ఛత్తీస్ఢ్లోని అంబికాపూర్ మున్సిపాలిటీ వినూత్న ప్రయోగంతో ముందుకొచ్చింది. చెత్త తీసుకుని వస్తే వారికి ఆహారం ఇస్తామని ప్రకటించింది. నిరాశ్రయులు ఎవరైనా కిలో చెత్తను తీసుకువస్తే వారికి భోజనం, అర కిలో చెత్త తెస్తే అల్పాహారాన్ని ప్రోత్సాహకంగా ఇస్తారు. దేశంలో మొదటి సారిగా ఇక్కడ గార్బేజ్ కేఫ్ను ఏర్పాటు చేశారు. ఇలా సేకరించిన చెత్తను, ప్లాస్టిక్ను రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తారట. దేశంలోనే ఇండోర్ తర్వాత అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన అంబికాపూర్ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ సేకరించే వారికి ఇళ్లు కూడా నిర్మించే ఇచ్చే యోచనలో ఉన్నట్లు నగర మేయర్ అజరు తెలిపారు. మరి మన వద్దకూడా ఇలాంటి నిర్ణయాలు చేస్తే చాలా వరకు చెత్తకుండీలు, రోడ్లు క్లీన్ అవ్వడం ఖాయం.
- పుప్పాల