Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాష తెలియనప్పుడు, ప్రాంతంతో పరిచయం లేనప్పుడు, వ్యక్తుల్ని చూడనప్పుడు, ఆకలి తప్ప మరేమీ ఎదురుకానపుపడు మనిషి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఆ భాష మాట్లాడేవారు మనలా మాట్లాడరేమో అని, ఆ ప్రాంతం వారికి ఇలాంటి వేడుకలు తెలియవేమో, ఆ వ్యక్తులు ఎంతో గొప్పవారై ఉంటారేమో అనుకోవడం సహజం. తీరా వారితో కలిసి బతకాల్సినప్పుడు వారి జీవితం, మాటలు, విధానం అన్నీ చూస్తుంటే ఎక్కడైనా ఇలానే ఉందన్నమాట అనిపిస్తుంది. మనిషి ఎక్కడున్నా, ఇవే మాటలు, ఇవే ఆలోచనలు అంతే అని తెలియజెప్పే అందమైన కథలు సంగవేని రవీంద్రగారి కథలు. సంగవేని రవీంద్ర ఏ రచన చేసినా అందులో ఎంతో ప్రామాణిక వుంటుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా, భాషను వెంటపెట్టుకుని వెళ్ళడం, ఆ భాషకు, భావాలకు సరైన ఉత్తీర్ణతను సాధించగలడటం ఒక్క తెలుగు వారికే సాధ్యమని రవీంద్ర గారు చాలా ఏళ్ళుగా రుజువు చేసుకుంటున్నారు. 20 కధలున్న ఈ సంపుటిలో ఏ కథకు ఆ కథే మైలు రాయి. ముంబయి లోని తెలుగువారి జీవితాలను అద్దంపట్టే కథ 'ముంబయి మేరే జాన్'. మంచును అరచేతిలో బిగిస్తే మంట పుడుతుందని తెలిసినా, భార్యే కదా ఎలా ఉన్నా ఏమవుతుంది అనుకునేవారికి తగిన బుద్దిని తెలిపే కథ 'వెన్నెల మంట'. మనిషి మనిషిలా తప్ప ప్రతి చోటా గెలుస్తూనే ఉంటాడనే చాటి చెప్పే కథ 'మరుగుజ్జు'. పరస్పర గౌరవం లేకున్నా పర్వాలేదు. దాంపత్యానికి ఎంతో అవసరమైన నమ్మకం కూడా లేకుంటే ఏమవుతుందో తెలియజెప్పే మానో విశ్లేషాత్మక కథ 'మమజీవన'. ఇలా కథలన్నీ మనిషి జీవన విధానాలకు, ఆవేదనలకు, తీరని దు:ఖాలకు, మితిమీరిన ఆథునికతకు, సర్వం కోల్పోయిన జీవితాలకు చక్కని రూపాన్నిచ్చాయి.