Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిలాబాద్ ఆకాశవాణి ప్రసారాల కోసమై ఆ ప్రాంతపు పల్లెవాసుల జీవితాలు, కష్టాలు, కన్నీళ్ళు తెలుపుతూ రాసిన నాటికలు 'అరుగు మీది ముచ్చట్లు'. వివిధ పార్శ్వాల నుండి తడుముతూ పదకొండు నాటికలవి. రచయిత డా||ఉదారి నారాయణది ఆధునిక తెలుగు సాహిత్యంలో పరిచయం చేయనవసరం లేని పేరు.
అన్ని నాటికల్లోనూ మూడే మూడు పాత్రలున్నాయి. బాబారు పాత్ర మొదటిది. ఇతనికి లోకజ్ఞానం తెలుసు. చదువుకున్న పెద్ద మనిషి కూడా. మిగతా రెండు పాత్రల మధ్య సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు. రెండోపాత్ర లలితమ్మది. ఈమె తెలంగాణ ఇల్లాలికి ప్రతీక. ఇంటిని చక్కదిద్దుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడం వంటి వాటిలో అవగాహనతో మాట్లాడుతుంది. మూడోపాత్ర వెంకన్నది. ఇతడు హాస్యాస్పదంగా మాట్లాడతాడు. తెలిసీ తెలియని మనస్తత్వంతో వుంటాడు. వీళ్ళంతా ఆదిలాబాద్ పాత జిల్లాల పల్లెటూళ్ళ సంబంధీకులు. అన్ని కథల్లోనూ పెళ్ళిళ్ళు, హాస్టల్ చదువులు, మహిళలపై అత్యాచారాలు, చేనేత వృత్తుల సమస్యలు, రైతుల అవస్థలు, పండుగల వంటివి ప్రస్తావనలకు వచ్చాయి. పూలదండలో దారం దాగున్నట్లు ఈ నాటికలలో సామాజిక, రాజకీయ రంగాల విషయాలు చర్చకు వచ్చాయి. శ్రోతలను ఆలోచింపజేస్తాయి.
- కె.హరనాథ్,
9703542598
అరుగుమీది ముచ్చట్లు, రచన : డా||ఉదారి నారాయణ, పేజీలు : 120, వెల : 60/-, ప్రతులకు: రచయిత, 4-112/7, రోడ్ నెం.3, కె.సి.బి.గార్డెన్స్ ఎదురుగా, రామ్నగర్, మావల, ఆదిలాబాద్ 504001