Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు 'కరోనా' వైరస్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయిన సంగతి తెలిసిందే.చాలామంది రోగులు చనిపోతున్నారు. వేలాది మంది ఈ వైరస్ బారిన పడి అనారోగ్యంపాలవుతున్నారు. అనేక దేశాలు ఈ వైరస్ బారిన పడి.. విలవిల్లాడుతున్నాయి. మరోవైపు.. సోషల్ మీడియాలో కరోనా గురించి మీమ్స్ రూపంలో జోకుల మీద జోకులు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఓ సంఘటన ఆసక్తి రేపుతోంది. కరోనా ఉధృతి కొనసాగుతున్న చైనాలోని జింగ్ షాన్ అనే పట్టణంలో.. ఓ మహిళ ఒంటరిగా ఉన్న సమయం చూసి ఒక దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. సమయస్ఫూర్తి ప్రదర్శించిన ఆ మహిళ.. అతని మొహంపై దగ్గుతూ.. తనకు కరోనా సోకిందని చెప్పిందట. అంతే.. ఆ ఇంట్లో దొరికిన సుమారు 3 వేల యువాన్లతో ఆ దుండగుడు పారిపోయాడట. ఈ ముచ్చట ఇక్కడితో ఆగిపోలేదు. ఇందులో మరో వింత కూడా ఉంది. ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా.. ఆ దొంగను మాత్రం వారు పట్టుకోలేకపోయారు. కానీ.. ఆ దొంగే.. తన తండ్రితో పాటు వచ్చి పోలీసులను కలిసి నేరాన్ని ఒప్పుకోవడం.. లొంగిపోవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.