Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలే ఇంగ్లాండ్ దేశానికి చెందిన మార్క్ లీ దంపతులు శ్రీలంకలో ఓ బీచ్ రిసార్ట్లో గడపడానికి వచ్చారు. బాగా రాత్రి అయ్యాక.. బయట రమ్ తాగుతూ ఎంజారు చేస్తున్న వారికి లోపలి నుండి కొన్ని మాటలు వినిపించాయి. ఆ రోజుతో ఆ హౌటల్ నిర్వహణ కోసం చేసుకున్న లీజు అగ్రిమెంట్ ముగుస్తుందని.. మరుసటి రోజు నుండి హౌటల్ మూతపడుతుందని యజమానులు మాట్లాడుకోవడం వీరి చెవిన పడింది. అంతే.... ఈ జంటలో కొత్త ఆలోచనకు తెరలేపాయి. తామే ఈ రిసార్ట్ను లీజుకు తీసుకుంటే పోలా అనుకున్నారు. వెంటనే హౌటల్ లోపలికి వెళ్లి ఇదే విషయాన్ని చెప్పారు. కావాలంటే.. అడ్వాన్స్ కూడా తీసుకోండని కొంత సొమ్ము వారి చేతిలో పెట్టారు. ఈ జంట వింత ప్రవర్తనకు యజమానులు ఆశ్చర్యపోయినా.. మంచి బేరం దొరికినందుకు సంతోషించారు. అంతే.. రేటును అమాంతం పెంచేశారు. మూడు సంవత్సరాల లీజుకు 30,000 పౌండ్లు అని డిమాండ్ చేశారు. అయినా వెనక్కి తగ్గకుండా లీజ్ ఎగ్రిమెంట్పై సంతకాలు పెట్టేశారు. తెల్లారిన తర్వాత ఆ రిసార్ట్ పేరును కూడా మార్చేశారట.