Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లె, పల్లె జీవితం, పల్లెలో వున్న పిల్లల బాల్యం, వాళ్ళ ఆటపాటల నేపథ్యంలో రూపొందిన కథలివి. పదవ తరగతి పరీక్షలు రాయడానికి వెళుతున్న ప్రమీల ఆటో టైర్లు పంచరై పరీక్షకు వెళ్ళలేక ఇబ్బంది పడుతుంటే, ఊరు ఊరంతా ఆమెకు ఎలా సహాయం చేయాలా అని పరితపించడం 'ముగ్గురాళ్ళ మిట్ట'లో కనిపిస్తుంది. ఊళ్ళో చదువుకుని డాక్టార్లయి పట్నంలో స్థిరపడితే, మరి ఆ వూరి వాళ్ళను పట్టించుకునేదెవరని ఒక డాక్టర్ చేసుకున్న ఆత్మ పరిశీలనే 'ఊరి ఉప్పు'. శనగతోటల మీద దాడి చేసే 'అడవి పందుల్ని' చంపకుండా, వాటిని పారదోలే మార్గం చెప్పిన రామతులసిని మెచ్చుకోవాలి. పల్లెలో వున్న కుల వివక్షను చూపుతూనే, అది వారిలో తెచ్చిన పరివర్తనను కూడా రెండు కథలు తెలియజేస్తాయి. ఈ కథలన్నీ చదివిన తర్వాత ఆ పల్లె జీవితం, అక్కడి బాల్యం, అక్కడి మనుషుల మంచితనం ఇవన్నీ గత జ్ఞాపకాలే అనుకోవడంలో ఆశ్చర్యమేమున్నది.
- కె.పి.అశోక్కుమార్,
9700000948
ముగ్గురాళ్ళ మిట్ట, రచన : ఆర్.సి.కృష్ణస్వామిరాజు, పేజీలు:112, వెల.100/- ప్రతులకు: 9393662821