Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరాల మీద అమితమైన ప్రేమ, భాష పట్ల అత్యంత అభిమానం, అక్షరాలను ప్రేమాభిమానాలతో కవిత్వంలోకి వొంపి ముందుకు సాగుతున్న కవి, వ్యాసకర్త, డా||బుర్ర మధుసూదన్రెడ్డి. సమకాలీన సమాజపు పోకడలను నిశితంగా పరిశీలించడం, సమాజ రుగ్మతలపై అక్షరాయుధాల్ని ఎక్కుపెట్టడం ఆయనకు నిత్య వ్యాపకరం. అధ్యయనం, రచన రెండు కళ్ళాయనకు. ''మదిగదిలో నదిలా/ అక్షరజలాల చెలిమెలు/ ఉప్పొంగి మనోపొరల్ని/ మురిపించి - తడిమి తడతాయ''ంటారు బుర్ర మధుసూదన్రెడ్డి. అక్షరాలను మదినిండా ఆయన నింపుకున్నాడనడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి. బుర్ర మధుసూదన్ రెడ్డి సమాజం పట్ల ఒక బాధ్యతతో సాహిత్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వారి కలం నుండి మరిన్ని మంచి కవితలు రావాలని కోరుకుందాం.
- కె.హరనాథ్,
9703542598
మధురాక్షరాలు, బుర్ర మధుసూదన్రెడ్డి, పేజీలు: 164, వెల : 100/-, ప్రతులకు : బి.జలజారెడ్డి, ఇం.నెం. 2-10-1400/సి, మైత్రీటవర్స్ - 201, జ్యోతినగర్, కరీంనగర్ - 505001
సెల్ : 9949700037