Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు పనిపట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ప్రతి పనినీ వాయిదా వేస్తుంటారు. ఇలాంటి వారిలో ఈ రోజు చేయాల్సిన పనిని రేపు చేద్దాంలే అనే ధోరణి ఉంటుంది. ఇలా కొద్దిరోజుల వరకి బాగానే ఉన్నా.. చివరికి బద్ధకస్తులుగా మారుతారు. అప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. వాయిదాల పర్వం ఇలాగే కొనసాగుతుంది. ఒక్కోసారి మీ జీవితంలో ప్రాముఖ్యం కలిగిన పనిని కూడా వాయిదా వేస్తే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భం, మంచి అవకాశం మళ్లీ రాకపోవచ్చు. అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. కావున, ''రేపు చేయాల్సిన పనిని ఈరోజే చేయాలి, ఈరోజు చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేయాలి'' అని పెద్దలు కూడా అంటుంటారు. కావున, ప్రతి వ్యక్తి అనుకున్న పనిని ఆలోచనతో ముందుకు తీసుకువెళ్తే, మంచి ఫలితాలు వస్తాయి దీనివల్ల తప్తి కలుగుతుంది. అలాగే కొనసాగడం వల్ల జీవితంలో విజయాలు మన వెన్నంటే ఉంటాయి. అందుకే పని వాయిదా పర్వాలకి స్వస్తి చెప్పండి. చురుకుగా ఉంటేనే జీవితం ఆనందంగా గడపవచ్చు.