Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ జీవితంలో సోషల్ మీడియా వరమా, శాపమా అనే ప్రశ్నను అటుంచితే రాత్రి సమయంలో గంటల కొద్దీ సోషల్ మీడియా వినియోగం నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అది ఆరోగ్యానికి ఎంతో హానికరమని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో దాదాపు 48 శాతం మంది నిద్రకు ముందు టాబ్లాయిడ్ లేదా ల్యాప్టాప్ వంటి గ్యాడ్జెట్లను ఉపయోగిస్తున్నారని, అది నిద్రపై చాలా ప్రభావం చూపుతుందని అమెరికా నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తెలిపింది. సోషల్ మీడియాను అతిగా వినియోగిస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారని పలు దేశాల్లో జరిపిన అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
రాత్రివేళ ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడిపితే అది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఈ అలవాటే నిద్రపోయిన తర్వాత మేల్కొనడానికి, సరిగా నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుందంట.
పనితీరుపై ప్రభావం
రాత్రివేళల్లో అతిగా సోషల్ మీడియా వాడకంతో ఉద్యోగుల పని సామర్థ్యం కూడా తగ్గుతుంది. గ్యాడ్జెట్ల అతి వినియోగం వారిలో ఒత్తిడిని పెంచుతుందని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రశాంతత కరువు
నిద్ర పోయేముందు ఒక పుస్తకం చదవడానికీ, సోషల్ మీడియాను తిరగేయడానికి మధ్య చాలా తేడా ఉంది. రోజంతా కలిగిన ఒత్తిడి నుండి మెదడు ఉపశమనం పొంది మనకు నిద్రపట్టాలంటే అరగంట లేదా ఒక గంట పడుతుంది. అది పూర్తిగా మెదడుకు ప్రశాంతతనిచ్చే సమయం.
ఒక గ్లాసు వేడిపాలు తాగితే అది ప్రశాంత నిద్రకు మరింత తోడ్పడుతుంది. కానీ.. గ్యాడ్జెట్ల వాడకం వల్ల ఆ ప్రశాంతత లేకుండా పోతుంది.
''నిద్రపోయే ముందు ఫేస్బుక్ లేదా వాట్సాప్పై ఎదో ఒక మెసేజ్ వస్తుండటం చూస్తుంటాము. దానికి జవాబు ఇవ్వడానికో, లేదా దాని గురించి ఆలోచించడానికో 20-30 నిమిషాలు అక్కడే అయిపోతాయి. తర్వాత అవతలివైపు నుండి స్పందనల కోసం ఎదురుచూస్తాము. అప్పుడు నాడీ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. చివరికీ అదే ఫోన్ను పక్కనే పెట్టుకొని పడుకుంటాము. అప్పుడు వచ్చే ప్రతీ మెసేజ్ శబ్దం నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
న గాడ్జెట్ల నుంచి వెలువడే నీలి కాంతి కిరణాలు నిద్ర పోయేందుకు సహాయపడే 'మెలటోనిన్' హార్మోన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, దీంతో జీవ గడియారంపై భారం పడుతుందని అంటున్నారు. దీనివల్ల నిద్రలేమి, ఫలితంగా అనారోగ్యం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.