Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా, ప్రముఖ సాహితీ సంస్థ రంజని (ఏ.జి.ఆఫీసు) వారి స్వర్ణోత్సవాల సందర్భంగా 70 కథానికలతో ఈ 'స్వర్ణ రంజని' పుస్తకాన్ని వెలువరించారు. రంజని కొన్ని ఇతర పత్రికల సహకారంతో కథల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేసింది. అలా బహుమతి పొందిన కథలను, ఏ.జి.ఆఫీసులో పనిచేసిన రచయితల కథలను ఈ సంపుటి కోసం ప్రత్యేకంగా రాయించి తెప్పించారు. ఇతర పత్రికలలో ప్రచురితమైన ఏ.జి.ఆఫీసు రచయితల కథలను లేదా వారి సంపుటాలలో నుండి ఎంపిక చేసిన కథలను కూడా సేకరించి మొత్తం 70 కథలతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. కథలన్నీ కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలను చిత్రించినవే అయినప్పటికీ అవి విభిన్న కోణాలను స్పృశించగలిగాయి. విరించి 'సహనాభవతు', కాకాని చక్రపాణి 'తుట్టి' లాంటి వైవిద్యభరితమైన కథలు కూడా ఇందులో ఉన్నాయి.
స్వర్ణ రంజని (50 వసంతాల రంజని 70 కథానికలు) సంపాదకులు : చీకోలు సుందరయ్య, పేజీలు: 483, వెల:250/-, ప్రతులకు:అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు