Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నడక నా తల్లి'' అన్నాడు డాక్టర్ సి.నారాయణరెడ్డి. ఆయన కవిత్వమంతా ఉదయపు నడకలోనో సాయంత్రపు నడకలోనో రూపు దిద్దుకున్నదే. నడక కదలిక రూపం. చైతన్య స్వరూపం. నడక మన లోపలి మాలిన్యాలని శుద్ధి చేసి మనకొక కొత్త రూపును ఇస్తుంది. మన లక్ష్యాలను, మన కలలను సాకారం చేస్తుంది. మన కలలు, ఆధ్యాత్మికం, సామాజికం, రాజకీయం ఏవైనా కావచ్చు. వాటిని సాధించుకోవడానికి ఏకైక మార్గం నడక .
ఆదిశంకరాచార్యుల వారు తన స్వల్పకాలిక జీవితంలోనే నాలుగుసార్లు భారతదేశం మొత్తం పాదయాత్ర చేసి హిందూ మత పునరుద్ధరణ అనే తన లక్ష్యం నెరవేర్చుకున్నారు. ఆధునిక భారతంలో మరీ ముఖ్యముగా ఆంధ్రదేశంలో ముగ్గురు నాయకులు మూడుసార్లు పాదయాత్ర చేసి మూడుసార్లు అధికారం చేజిక్కించుకున్నారు.పాదయాత్రలో వాళ్ళేం చూసారో, వాళ్ళేం విన్నారో, వాళ్ళేం అనుభవించారో, అవన్నీ వాళ్ళ వాళ్ళ అంతరంగాలలో ఒక గొప్ప మార్పును తీసుకుని వచ్చాయి. ఆ తరువాత వాళ్ళు తమ మునుపటిస్వభావాలను విడిచి పెట్టారా? లేదా అన్నది మరొక చర్చనీయాంశం. పాదయాత్ర సమయంలో మాత్రం వాళ్ళ జీవితాలు తాత్కాలికంగా అయినా సరే ఒక గొప్ప మెటామార్ఫాసిస్కి గురి కావడం విస్మరించలేని విషయం.
ఈ ఉపోద్ఘాతమంతా ఒక గొప్ప, అసమానమైన యాత్రీకుడిని పరిచయం చేయడానికి. చైనాలో మహాయాన బౌద్ధం అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్నది. మహాయాన బౌద్దానికి ప్రాణం లాంటి ప్రజ్ఞాపారమిత లాంటి గ్రంథాలు సంచలనం సష్టిస్తున్న రోజులు. ఆ రోజులలో ఒక యువకుడు నిండా పాతికేళ్ళు లేని యువకుడు బౌద్ధాన్ని అది పుట్టిన నేల మీదే, అది పుట్టిన భాషలోనే, బౌద్ధ గురువుల దగ్గర నేర్చుకో వాలని సంకల్పించాడు. అతడికి ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ కావాలి. అందుకోసం అతడు చైనా నుండి భారతదేశానికి ఒక అనితర సాధ్యమైన యాత్ర సంకల్పించాడు. ఆ రోజులలో చైనాను టాంగ్ వంశస్తులు పరిపాలిస్తూ ఉండేవారు. సరిహద్దు తగాదాల కారణంగా విదేశీ యాత్రలు చేయడం రాజు పూర్తిగా నిషేధించాడు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో ఒక అనితర సాధ్యమైన యాత్ర, 25000 కిలోమీటర్లు. 119 దేశాల మీదుగా, చేయడానికి సంకల్పించాడా బౌద్ధ భిక్షువు. అతడి పేరు హుయాన్త్సాంగ్.
అవును మీరు సాంఘిక శాస్త్ర పుస్తకాలలో చదువుకున్న హుయాన్త్సాంగ్ ఈ హుయాన్త్సాంగ్ ఒకరే.
అడవులు, కొండలు, ఎడారులు, ప్రకతి వైపరీత్యాలు, కరువు కాటకాలు, తుఫానుల మధ్య చైనా నుండి పశ్చిమ దిశగా ప్రయాణం చేసి పశ్చిమోత్తర చైనా మీదుగా ఇప్పటి కిర్గిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్ల మీదుగా ప్రయాణం చేసి సింధు నదిని దాటి భారతదేశం చేరుకుంటాడు.
అదొక అద్భుతమైన యాత్ర. భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను ముడి వేసే అలౌకిక యాత్ర. ఒక మనిషి తన తోటి వారి కోసం నిస్వార్ధంగా ఏదైనా తలపెడితే ప్రకతి పరీక్షలు పెడుతూనే, మానవశక్తి సామర్ధ్యాలను పుటం పెడుతూనే ఎలా సహకరిస్తుందో తెలుసుకోవడానికి చరిత్ర మానవ జీవితం మీద విసిరిన ఒక రూపకాలంకారం ఈ యాత్ర.
ఇంత అద్భుతమైన యాత్రను చైనా, భారత దేశాలు రెండూ సంయుక్తంగా 2016లో హుయాన్త్సాంగ్ పేరుతో ఒక సినిమాగా నిర్మించాయి. చైనా తరపున ఉత్తమ విదేశీచిత్రం క్యాటగిరీలో ఆస్కార్ అవార్డుకి పోటీ పడింది కానీ నామినేషన్ దక్కలేదు. అయితేనేమి? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల హదయ ఆస్కార్ అవార్డును పొందిన ఈ సినిమా చూడటం ఒక అద్భుతమైన అనుభవం. అప్పటి విశాలమైన చైనా లాండ్ స్కేప్లు, మట్టి ఇళ్ళు, గోబీ ఎడారిలో వచ్చే ఇసుక తుఫానులు, అప్పటి మనుషులు, వాళ్ళ భావోద్వేగాలు అదంతా ఒక ప్రపంచం.
ముంబై యూనివర్సిటీలో చదువుకునే ఒక స్టూడెంట్ యూనివర్సిటీ లైబ్రరీలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ రాసిన 1870 నాటి పుస్తకం ుష్ట్రవ Aఅఱషఱవఅ్ +వశీజూస్త్రతీaజూష్ట్రy శీట ×అసఱa పుస్తకం గురించి ఎంక్వయిరీ చేయడంతో సినిమా మొదలు అవుతుంది. ఆ పుస్తకంలో రాసిన విషయాలు తమ పురాతత్వ తవ్వకాలకు ఎలా ఉపయోగపడిందో ఉదాహరణ లతో సహా వివరించిన పుస్తకం అది. ఆ పుస్తకాన్ని స్టూడెంట్ చదువుతూ పేజీలు తిరగేస్తున్నకొద్దీ చరిత్రలోకి మనం వెళ్ళిపోతాము.
చైనాను క్రీస్తుశకం 627లో అంటే ఏడవ శతాబ్దంలో టాన్గ్ వంశస్తులు పరిపాలిస్తున్న కాలంలో హుయాన్త్సాంగ్ అనే బౌద్ధ భిక్షువు బౌద్ధ సూత్రాలను అవి ఉద్భవించిన భాషలోనే చదువు కోవాలని, సంస్కతం నేర్చుకోవాలనే ఒక లక్ష్యంతో సింధు నదిని దాటి భారత్ చేరుకోవడానికి ఒక అద్భుతమైన యాత్ర చేయడానికి పూనుకుంటాడు. అప్పటి రాజు సరిహద్దు సంఘర్షణల మూలంగా విదేశీ ప్రయాణాలు నిషేధించాడు. అయినా హుయాన్త్సాంగ్ రాజును ఒప్పించి విదేశీ యాత్రకు బయలుదేరుతాడు. అతడు ప్రయాణము చేసిన దారి ఇప్పుడు మనం చెప్పుకునే సిల్క్ రూట్.
చైనా పూర్తిగా దాటకుండానే తక్లమకం ఆర్మ్ పోస్ట్ దగ్గర హుయాన్త్సాంగ్ను సైనిక అధికారులు ఆపి ట్రావెల్ పర్మిట్ లేదని అతడిని బౌద్ధ ఆరామానికి పంపించాలని ప్రయత్నం చేస్తారు. అలా బౌద్ధ ఆరామానికి పంపించడం కంటే తనను చంపివేయడం మేలని హుయాన్త్సాంగ్ అనడంతో ఆ ఆర్మ్ పోస్ట్లో ఉన్న ఒక బౌద్ధ మత అభిమాని హుయాన్త్సాంగ్ యాత్ర సాగించడానికి అనుమతి ఇస్తాడు.
ఆ అనుభవంతో తరువాత వచ్చే ఆర్మ్ చెక్పోస్ట్ నుండి తప్పించుకోవడానికి ప్రధాన రహదారిని వదిలి వేరే మార్గం ద్వారా ప్రయాణం చేయాలని హుయాన్త్సాంగ్ ఆలోచిస్తాడు . ఫలితంగా దారి తప్పుతాడు. ఆ తరువాత తను రాసిన యాత్రానుభవ పుస్తకంలో ఆ భయంకరమైన స్థితి గురించి హుయాన్త్సాంగ్ ''రశీ షఱశ్రీస ్ష్ట్రa్ అశీ ఙవర్ఱస్త్రవ శీట శ్రీఱటవ షశీబశ్రీస bవ టశీబఅస ్ష్ట్రవతీవ. ుష్ట్రవతీవ ఱర అవఱ్ష్ట్రవతీ bఱతీస, అశీతీ టశీబతీ-శ్రీవస్త్రస్త్రవస bవaర్ర, అవఱ్ష్ట్రవతీ షa్వతీ అశీతీ జూaర్బతీవ''. అని రాసుకున్నాడు.. అక్కడ దారితప్పిన హుయాన్త్సాంగ్ దాదాపు మత్యుముఖంలోకి వెళ్ళిపోతాడు. కానీ అతడి గుఱ్ఱము అతడిని కాపాడుతుంది. దాహంతో స్పహ తప్పి పడిపోయిన అతడిని తన నడుంపైన వేసుకుని ఒక నీటి కొలను దగ్గరకు తీసుకుని వెళుతుంది. అలా హుయాన్త్సాంగ్కి ఒక గుర్రం ప్రాణ భిక్ష పెడుతుంది.
అక్కడి నుంచి తుర్ఫాన్ చేరుకుంటాడు హుయాన్త్సాంగ్. తుర్ఫాన్ రాజు హుయాన్త్సాంగ్ బోధనలకి ముగ్ధులై అతడిని అక్కడే ఉండమని కోరుతాడు. హుయాన్త్సాంగ్ నిరాకరించే సరికి అతడిని చంపేస్తానని బెదిరిస్తాడు. అయితే తన నిరాహార దీక్షతో ఆ రాజు మనసు మారుస్తాడు హుయాన్త్సాంగ్.
అక్కడ ినుంచి సమర్ఖండ్ చేరుకుంటాడు. సమర్ఖండ్ను ''ుష్ట్రఱర ఱర a తీఱషష్ట్ర శ్రీaఅస, షష్ట్రవతీవ ్ష్ట్రవ ్తీవaరబతీవర శీట సఱర్aఅ్ షశీబఅ్తీఱవర aషషబఎబశ్రీa్వ, షష్ట్రవతీవ ్ష్ట్రవతీవ aతీవ జూశీషవతీటబశ్రీ ష్ట్రశీతీరవర aఅస రసఱశ్రీశ్రీవస aత్ీఱఝఅర, aఅస ్ష్ట్రవ షశ్రీఱఎa్వ ఱర ఎశీర్ జూశ్రీవaఝఅ్.'' అని ప్రస్తుతించాడు. ఇలా అనేక అడ్డంకులు దాటుకుని చివరకు భారతదేశంలోని నలంద చేరుకుంటాడు. అక్కడ ఐదేళ్లు బౌద్ధంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించి మరో పన్నెండేళ్ళు భారత యాత్ర చేస్తాడు .
కనౌజ్లో హర్షవర్ధనుడు నిర్వహించిన బౌద్ధ సంగీతిలో నలంద ప్రతినిధిగా హుయాన్త్సాంగ్ పాల్గొంటాడు. ఇరవైమంది రాజులు, వేల మంది పండితులు, మూడు వేలకు పైగా బౌద్ధ భిక్షులు, మూడు వేలమంది బ్రాహ్మణులు, జైనులు పాల్గొన్న ఆ ఇరవై మూడు రోజుల బౌద్ధ సంగీతికి అధ్యక్షుడుగా హుయాన్ త్సాంగ్ ఏకగ్రీవంగా ఎన్నికై మహాయాన బౌద్ధం రహస్యాలని కరతలామలకం చేస్తాడు.
ఆ తరువాత అతడు మళ్ళీ చైనా వెళ్ళిపోతాడు.
హుయాన్త్సాంగ్ చరిత్రను, డాక్యుమెంటరీగా తప్ప తీయలేని చరిత్రను, ఫుల్ప్లెడ్జ్డ్ సినిమాగా తీసి ఒప్పించడం సామాన్యమైన విషయం కాదు. ఆ ఫీట్ను అలవోకగా చేసింది. చైనా ఫిలిం కార్పొరేషన్. దానికి ఈరోస్ తోడవడం ఈ సినిమాను ఫ్లాలెస్గా తీర్చిదిద్దింది.
సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే శీలభద్ర, హుయాన్త్సాంగ్ సంవాదం అంతా సంస్కతంలోనే ఉండటం కూడా సినిమాకు ఒక నిండుదనాన్ని ఇచ్చింది.
హుయాన్త్సాంగ్గా చైనా నటుడు నబaఅస్త్ర శఱaశీఎఱఅస్త్ర హుయాన్త్సాంగ్ ఇలాగే ఉంటాడా అనేట్టు నటించాడు. మిగతా నటులెవరో నాకు తెలియదు కానీ హర్షవర్ధనుడుగా మన సోనూ సూద్ మెప్పించాడు. ఈ సినిమా చూడటం కళ్ళకి వేడుక.
ఎడారిలో హూయంత్సాంగ్ తప్పిపోవడం లాంటి సన్ని వేశాలు ప్రతి మనిషి జీవితంలోనూ కచ్చితంగా ఉంటాయి. హుయాన్త్సాంగ్ లాగా మనం చాలాసార్లు మనలో నుంచి మనం తప్పిపోతాము. ఆ తప్పిపోవడమే ఎడారి. కానీ మనం మళ్ళీ మనలోకి రావాలి అంటే గుఱ్ఱం లాంటి చేయూత అవసరం. మీరు ఎవరికైనా అయినా చేయూత అవుతున్నారా? లేదా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా చేస్తుంది ఆ మెటఫర్
అమెజాన్ ప్రైమ్లోనూ, యూ ట్యూబ్లోనూ ఈ సినిమా వుంది ఈ ఆదివారం చూడండి..
- వంశీకృష్ణ, 9573427422