Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముళ్ళపూడి వెంకటరమణ గారి నిష్ర మణ తర్వాత దర్శకుడు బాపు తీవ్రంగా కుంగి పోయారు. ఎవరైనా సినిమా తీయమని అడగ డానికి వస్తే ''బ్రహ్మలేడు కదా.. నేనేం చేయగలను'' అనేవారు ఆక్రోశంతో. జీవమున్న సంభాషణలే కాకుండా అన్నగారు రాసే తీరు కొత్త ధోరణిలో, మూస పద్ధతులకు భిన్నంగా ఉండేది. ఉదాహరణకు 'అసూయ అసలైన ప్రేమకు ధర్మామీటరు', 'మొగుడు పెళ్ళాం సమానం.. కానీ మొగుడు కాస్త ఎక్కువ సమానం', 'వాడికి జబ్బు చేసింది' ఇత్యాదులు. ఇక 'ముత్యాల ముగ్గు' లో రావుగోపాల రావు ద్వారా చెప్పించిన 'పలుకు బడులు' అందరికీ బాగా గుర్తున్నవే. 'మడిస న్నాక కూసింత కలా పోసనుండాల.. ఊరికే తిని తొంగుంటే, మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటాది', 'ఆకాశంలో ఏదో మర్డరు జరిగినట్టుంది కదూ' వంటివి చాలా ఉన్నాయి. ఒక సందర్భంలో ముళ్ళపూడి రాసిన డైలాగుల్లో మీకు బాగా నచ్చినవి ఏమిటని బాపు గారిని అడిగితే, ఆయన మచ్చుకి రెండు సినిమాలను ప్రస్తావించారు ఒకటి స్నేహం చిత్రంలో రావుగోపాలరావు హలం మధ్య నడిచిన సంభాషణ. హలం విసుగ్గా 'అబోతోడా నీకు నాకూ ఏట్రా సం బంధం?' అంటే- రావుగోపాలరావు 'నిన్ను నీ మొగుడొదిలేశాడు. నా పెళ్ళాం లేచిపోయింది అది సాల్దేటి' అంటాడు. అలాగే ముత్యాల ముగ్గులు శోభనం నాడు భర్త (శ్రీధర్) భార్య (సంగీత)ను 'ఇంతకు ముందు నువ్వు ఎవరి నైనా ప్రేమించావా?' అని అడుగుతాడు. అప్పుడామె 'ప్రేమంటే నాకు తెలియదు పిల్ల మనసు అద్దం లాంటిది. చాలా మంది కనిపిస్తుంటారు పెళ్ళవ గానే అది మొగుడు బొమ్మతో పటంగా అయిపో తుందని మా అమ్మమ్మ అనేది' అంటుంది. సగటు సినిమా ల్లోని మూస ధోరణికి భిన్నంగా ఉండే ఈ తరహా సంభాషణలు ప్రేక్షకులకు కొత్తగానే కాదు ఆహ్లాదకరంగానూ ఉండేవి. అదే ముళ్ళపూడి మ్యాజిక్ !